17న కేసీఆర్‌ సంచ‌లన ప్ర‌క‌ట‌న.. ముంద‌స్తు ఖాయం?

తెలంగాణ రాజ‌కీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించిన సీఎం కేసీఆర్‌.. చూచాయ‌గా.. ఒక కీల‌క విష‌యాన్ని మంత్రుల‌కి చెప్పేసిన‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నా యి. ముంద‌స్తుకు వెళ్లిపోదామ‌ని.. కేసీఆర్ చెప్పిన‌ట్టు కీల‌క మంత్రికి సంబంధించిన పీఏ ఒక‌రు మీడియాకు లీకు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ ప్ర‌క‌ట‌న ఈ నెల 17న జ‌ర‌గ‌నున్న స‌చివాల‌య ప్రారంబోత్స‌వం, అనంత‌రం సికింద్రాబాద్ లో నిర్వ‌హించే బీఆర్ ఎస్ మూడో విడ‌త స‌మావేశంలో ఉంటుంద‌ని అంటున్నారు.

అంటే.. అసెంబ్లీని ర‌ద్దు చేయ‌నున్న‌ట్టు కేసీఆర్ మంత్రుల‌కు ఇప్ప‌టికే చెప్పేసిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న స‌భ‌ను మొత్తాన్ని కూడా కేటీఆర్‌కు అప్ప‌గించేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికిప్పుడు అసెంబ్లీ ర‌ద్దుకు ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని.. విశ్లేష‌కులు చెబుతున్నారు. షెడ్యూల్ ప్ర‌కారం న‌వంబ‌రు వ‌ర‌కు ప్ర‌భుత్వానికి గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ.. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూస్తే.. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా పుంజుకునే ఛాన్స్ ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని కేసీఆర్ త‌ల‌పోస్తున్నారు.

వాటికి అవ‌కాశం ఇచ్చే బ‌దులు.. త‌నే అవ‌కాశంగా మార్చుకుని..ఇ ప్ప‌టికిప్పుడు స‌భ‌ను ర‌ద్దు చేసుకుని.. మేలో నే ఎన్నిక‌ల‌కు వెళ్లిపోతే.. తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించేందుకు ఛాన్స్ ఉంటుంద‌ని చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి కూడా సీఎం కేసీఆర్‌ను క‌ల‌వ‌డం వెనుక ఇదే వ్యూహం ఉంద‌ని భావిస్తున్నారు. జ‌గ్గారెడ్డిని స్వ‌యంగా కేసీఆర్ పిలిపించుకున్నార‌ని.. రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఇక‌, మ‌రోవైపు.. మే నాటికి తెలంగాణ ఎన్నిక‌లు పూర్తి చేసుకుంటే.. త‌న చేతిలో దాదాపు 10 మాసాల స‌మ‌యం ఉంటుంది. ఈ స‌మ‌యంలో కేంద్రంలో చ‌క్రం తిప్పేందుకు అవ‌స‌ర‌మైన స‌రంజామాను రెడీ చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని.. తెలంగాణ ఎన్నిక‌ల‌కు ఎక్కువ స‌మ‌యం వెచ్చిస్తే.. ఇబ్బంది త‌ప్ప‌ద‌ని కూడా కేసీఆర్ ఒక అంచ‌నాకు వ‌చ్చార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఇప్పుడు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్లో సంక్షేమానికి పెద్ద‌పీట వేసిన నేప‌థ్యంలో దీనినే ఎన్నిక‌ల అస్త్రంగా మార్చుకుని.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తార‌ని.. కేటీఆర్‌కు ప‌గ్గాలు అప్ప‌గించేస్తార‌ని.. ఈ రెండు ప్ర‌క‌ట‌న‌లు అంటే.. అసెంబ్లీ ర‌ద్దు, బీఆర్ ఎస్ రాష్ట్ర చీఫ్‌గా కేటీఆర్ ప్ర‌క‌ట‌న రెండూ కూడా.. ఈనెల 17నే జ‌రిగిపోతాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.