జ‌గ‌న్‌కు మోడీ ఝ‌ల‌క్‌.. అమ‌రావ‌తిపై తేల్చేశారు!

ఏపీ ప్ర‌భుత్వం పెట్టుకున్న మూడు రాజ‌ధానుల ఆశ‌ల‌పై కేంద్రం కుద‌ర‌ద‌ని ప‌రోక్షంగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెప్పేసింది. ఏపీ రాజధాని అమరావతేన‌ని స్ప‌ష్టం చేసింది. అది కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విజభన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటైందని పేర్కొంది. ఈ మేర‌కు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

కేంద్రం ఏం చెప్పిందంటే..

— ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 లతో రాజధాని అమరావతి ఏర్పాటు అయ్యింది.
— దీంతో రాజధానిని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఏపీకి లేదు.
— మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదు.
— జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం చేసిన చట్టాలతో కేంద్రానికి సంబంధం లేదు.
— అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించాం.
— అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసింది.
— ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉంది.
— దీనిపై ఇంత‌క‌న్నా ఎక్కువ‌గా మాట్లాడటం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుంది.
— ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 5, 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నూతన రాజధాని నిర్మాణం అధ్యయనానికి ఏర్పాటు చేసింది.
— అధ్యయన నివేదికను తదుపరి చర్యలు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించాం.
— ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా నోటిఫై చేసింది.
— 2020లో మూడు రాజధానుల బిల్లును తీసుకువచ్చారు.
— మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చే ముందు ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదు.
— రాజధాని అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.