Political News

ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన ఆనంకు వైసీపీ ఎఫెక్ట్‌..!

వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ప్ర‌స్తుతం ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి గ‌త కొన్నాళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. త‌న నియోజ‌క‌వ‌ర్గం లో అభివృద్ధి చేయ‌డం లేద‌ని.. ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయ‌డం లేద‌ని.. కొన్నాళ్లు విమ‌ర్శించారు. ఇక‌, ఇటీవ‌ల.. ఏం చేశామ ని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తాం.. అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తే.. ప్ర‌భుత్వానికి ఇప్పుడున్న 151లో 50 వ‌చ్చినా ఎక్కువేన‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి.

ఈ క్ర‌మంలోనే వెంక‌ట‌గిరి ఇంచార్జ్‌గా ఉన్న రామ‌నారాయ‌ణ‌రెడ్డిని వెంట‌నే తొల‌గించి.. నేదురుమ‌ల్లి రామ్ కుమార్‌ను నియ‌మించారు. ఇక‌, తాజాగా.. ఆనం వ్యక్తిగత భద్రతను కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనంకు వన్ ప్లస్ వన్ భద్రత కల్పించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యే అయ్యాక సెక్యూరిటీని 2 ప్లస్ 2కు పెంచారు. ఇది పెంచింది కూడా వైసీపీ ప్ర‌భుత్వమే.

 ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆనం అధికారాలను కట్ చేస్తూ ఒకదాని తరువాత ఒక సంఘటన చోటు చేసుకొంటున్న తరుణంలో సెక్యూరిటీని కుదిం చడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌కు సెక్యూరిటీని ఒన్ ప్లస్ ఒన్ నుంచి 2 ప్లస్ 2కు పెంచింది. సమాన హోదాలు కలిగిన ఇద్దరు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ విషయంలో ప్ర‌భుత్వం ఇలా వ్య‌వ‌హ‌రించడంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీసింది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

18 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago