వైసీపీ నాయకుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గత కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తన నియోజకవర్గం లో అభివృద్ధి చేయడం లేదని.. ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయడం లేదని.. కొన్నాళ్లు విమర్శించారు. ఇక, ఇటీవల.. ఏం చేశామ ని.. ప్రజల్లోకి వెళ్తాం.. అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ప్రభుత్వానికి ఇప్పుడున్న 151లో 50 వచ్చినా ఎక్కువేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ క్రమంలోనే వెంకటగిరి ఇంచార్జ్గా ఉన్న రామనారాయణరెడ్డిని వెంటనే తొలగించి.. నేదురుమల్లి రామ్ కుమార్ను నియమించారు. ఇక, తాజాగా.. ఆనం వ్యక్తిగత భద్రతను కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనంకు వన్ ప్లస్ వన్ భద్రత కల్పించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యే అయ్యాక సెక్యూరిటీని 2 ప్లస్ 2కు పెంచారు. ఇది పెంచింది కూడా వైసీపీ ప్రభుత్వమే.
ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆనం అధికారాలను కట్ చేస్తూ ఒకదాని తరువాత ఒక సంఘటన చోటు చేసుకొంటున్న తరుణంలో సెక్యూరిటీని కుదిం చడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్కు సెక్యూరిటీని ఒన్ ప్లస్ ఒన్ నుంచి 2 ప్లస్ 2కు పెంచింది. సమాన హోదాలు కలిగిన ఇద్దరు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం ఇలా వ్యవహరించడంపై సర్వత్రా చర్చకు దారితీసింది.
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…
కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…
అసలే వేసవి కాలం.. సాధారణ ఇళ్లలో ఫాన్లు.. మధ్యతరగతి ఇళ్లలో కూలర్లు, ఆపై తరగతుల ఇళ్లలో ఏసీలు కనీసంలో కనీసం…