వైసీపీ నాయకుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గత కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తన నియోజకవర్గం లో అభివృద్ధి చేయడం లేదని.. ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయడం లేదని.. కొన్నాళ్లు విమర్శించారు. ఇక, ఇటీవల.. ఏం చేశామ ని.. ప్రజల్లోకి వెళ్తాం.. అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ప్రభుత్వానికి ఇప్పుడున్న 151లో 50 వచ్చినా ఎక్కువేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ క్రమంలోనే వెంకటగిరి ఇంచార్జ్గా ఉన్న రామనారాయణరెడ్డిని వెంటనే తొలగించి.. నేదురుమల్లి రామ్ కుమార్ను నియమించారు. ఇక, తాజాగా.. ఆనం వ్యక్తిగత భద్రతను కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనంకు వన్ ప్లస్ వన్ భద్రత కల్పించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యే అయ్యాక సెక్యూరిటీని 2 ప్లస్ 2కు పెంచారు. ఇది పెంచింది కూడా వైసీపీ ప్రభుత్వమే.
ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆనం అధికారాలను కట్ చేస్తూ ఒకదాని తరువాత ఒక సంఘటన చోటు చేసుకొంటున్న తరుణంలో సెక్యూరిటీని కుదిం చడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్కు సెక్యూరిటీని ఒన్ ప్లస్ ఒన్ నుంచి 2 ప్లస్ 2కు పెంచింది. సమాన హోదాలు కలిగిన ఇద్దరు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం ఇలా వ్యవహరించడంపై సర్వత్రా చర్చకు దారితీసింది.
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…