ఏ ముహూర్తాన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను కాస్తా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చాడో కానీ.. ఈ మార్పు వల్ల ఆయన కొత్తగా ఏం సాధిస్తున్నది లేకపోగా.. పార్టీకి ఎక్కువ డ్యామేజే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పుట్టిందే విభజన రాజకీయం మీద. అలాంటిది దేశం మొత్తాన్ని కలుపుకుపోతాం.. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తాం అంటుంటే జనాలకు కామెడీగా అనిపిస్తోంది.
ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏదైనా కార్యక్రమాలు చేయబోతుంటే… ఎన్నికల్లో పోటీ పడుతుంటే.. ఆంధ్రా పార్టీకి ఇక్కడేం పని? మిమ్మల్ని ఇక్కడ్నుంచి తరిమేశాం కదా అంటూ దారుణంగా మాట్లాడేవాళ్లు టీఆర్ఎస్ పార్టీ వాళ్లు. కానీ ఈ మధ్య ఖమ్మంలో భారీ సభ పెట్టి తిరిగి తెలంగాణ రాజకీయాల్లో టీడీపీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు చేస్తే.. టీఆర్ఎస్ వైపు నుంచి బలమైన వాయిస్ లేకపోయింది.
ఓవైపు బీఆర్ఎస్ను ఏపీతో పాటు దేశమంతా విస్తరిస్తామని.. అందరినీ కలుపుకుని వెళ్తామని అంటూ.. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి రావడాన్ని వ్యతిరేకించలేరు కాబట్టి.. సైలెంటుగా ఉండాల్సి వచ్చింది. ఇక తాజాగా ఏపీలో రావెల కిషోర్, తోట చంద్రశేఖర్ లాంటి జనబలం లేని, ఔట్ డేటెడ్ రాజకీయ నేతల్ని బీఆర్ఎస్లో చేర్చుకుని.. ఏపీలో అధికారంలోకి వచ్చేస్తాం.. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేస్తాం అని అంటుంటే వినడానికి మరింత కామెడీగా అనిపిస్తోంది. నిన్న ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి కేసీఆర్ మీద సోషల్ మీడియా ట్రోలింగ్ మామూలుగా జరగట్లేదు.
ఆంధ్రా బిరియానీని పేడ బిరియానీ అని వ్యాఖ్యానించడమే కాక ఆ ప్రాంతం మీద తీవ్ర స్థాయిలో విద్వేషాన్ని చిమ్ముతూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలన్నీ బయటికి తీస్తున్నారు. ఇన్ని మాటలు అని ఇప్పుడు ఏపీలో మీ రాజకీయం ఏంటి అంటూ కేసీఆర్ను నిలదీస్తన్నారు. టీఆర్ఎస్ అనే పేరుతో పార్టీ ఉన్నంత వరకు తెలంగాణ సెంటిమెంట్ దానికి ఎటాచ్ అయి ఉండేది. అవసరమైనపుడు సెంటిమెంటను రగల్చడానికి అది ఉపయోగపడేది. కానీ బీఆర్ఎస్గా పేరు మారడంతో ఇక ఆ అవకాశం కోల్పోయినట్లే. మొత్తంగా చూస్తే ట్రోల్స్ ఎదుర్కోవడానికి తప్ప బీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ ఏం సాధిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి.
This post was last modified on January 4, 2023 7:22 am
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…