టీడీపీ అభ్యర్థిగా కొలికిపూడి?

తెలుగుదేశం పార్టీలో అనధికార సభ్యుడిగా కొనసాగుతున్న కొలికిపూడి శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా సోషల్ మీడియా బ్యాచ్ కోడై కూస్తోంది. అందులోనూ టీడీపీ పట్టున్న, ప్రతిష్టాత్మకమైన నందిగామ సీటును కేటాయిస్తారని చెబుతున్నారు. దీనిపై పార్టీ వర్గాలు మాత్రం పెదవి విప్పడం లేదు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన కొలికిపూడి.. ఇప్పుడు ఐఎఎస్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తూ…. రైతుల గొంతుకగా ఉన్న కొలికిపూడి.. టీవీ డిబెట్లలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఏబీఎన్ లో చర్చ సందర్భంగా లైవ్ లోనే బీజేపీ నేత విష్ణు వర్షన్ రెడ్డిని చెప్పుతో కొట్టి ఫేమస్ అయ్యారు. తర్వాతే కొలికిపూడిని టీడీపీ ఓన్ చేసుకుంది. ఆయనకు పార్టీ ఫండ్ కూడా వస్తుందని చెబుతున్నారు.

నందిగామ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పక్కనపెట్టి మరీ కొలికిపూడికి టికెట్ ఇస్తారని ప్రచారం ఊపందుకుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు కొలికిపూడి తగిన ప్రత్యర్థి అని చంద్రబాబు నమ్ముతున్నారట. అందుకే సౌమ్యను వేరే విధంగా అకామడేట్ చేసి… కొలికిపూడికి నందిగామ కేటాయించేందుకు ఆయన అంగీకరించారని సోషల్ మీడియాలో టాక్

కొలికిపూడికి దూసుకు పోయే తత్వముందని, జగన్ తప్పిదాలను ఆయన కరెక్టుగా ఎండ గట్టగలరని టీడీపీ నమ్ముతోంది. పైగా అమరావతి ఉద్యమాన్ని సమర్థించే వారంతా కొలికిపూడికి ఓటేస్తారని కూడా చెబుతున్నారు. కొలికిపూడి మాటకారి. ప్రతీ మాటలోనూ విశ్లేషణ ఉంటుంది. టీవీ డిబెట్ల ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే నందిగామ సీటుకు ఆయన పేరు వినిపిస్తోంది. మరి అసలు విషయం పార్టీ అధినేత మాత్రమే చెప్పగలరు…