ఆయన సీనియర్నాయకుడు, మాజీ మంత్రి. పైగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. కీలకమైన నాయకుడు కూడా. అయితే.. ఇప్పుడు ఆయన తీవ్ర అసహనంలోకూరుకుపోయారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు వస్తుందో రాదో అనే బెంగ ఆయనను వెంటాడేస్తోంది. దీంతో నిన్న మొన్నటి వరకు యక్టివ్గా ఉన్న సదరు సోదరుడు.. ఇప్పుడు.. టీడీపీపై నిర్లిప్త వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆయనే మాజీ మంత్రి ఆలపాటి రాజా అలియాస్ ఆలపాటి రాజేంద్రప్రసాద్. రాష్ట్రంలో టీడీపీ, జనసేన మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆలపాటి రాజా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే.. జనసేనతోపొత్తు పెట్టుకుంటే.. ఈసీటును ఖచ్చితంగా టీడీపీ వదులుకోవాలి.
ఎందుకంటే.. జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్.. తెనాలి నుంచి పోటీ చేయనున్నారు. ఆయనను పక్కన పెట్టే పరిస్థితి లేదు. దీంతో ఈ విషయంపై ఆలపాటి మనస్తాపంతో ఉన్నారు. మొదట్లో వేమూరులో, ఆ తర్వాత తెనాలిలో పోటీ చేశా. ఒక సీటు అని రాసి పెట్టలేదు. నేను మానసికంగా సిద్ధ పడాల్సిన అవసరం లేదు. అధికారం నాకు కొత్త కాదు అని వ్యాఖ్యానించారు.
తొలుత ఈ ఏడాదిలో గత రెండు మాసాల వరకు కూడా ఆయన పార్టీలో యాక్టివ్గానే ఉన్నారు. కానీ, గత నెల నుంచి మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు. దీనికి కారణాలు తెలియకపోయినా.. తాజాగా మాత్రం ఆయన స్పందించి..తానేమీ..పర్మినెంట్ కాదని.. టీడీపీలో అనేక మంది నాయకులు ఉన్నారని.. అధినేత ఇష్టం అంటూ.. ముక్తసరి వ్యాఖ్యలతో పార్టీలోకాక పుట్టించారు. బలమైన సామాజికవర్గం నేతగా గుర్తింపు ఉన్న ఆలపాటి రియాక్షన్ పార్టీపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
This post was last modified on December 24, 2022 5:37 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…