ఆయన సీనియర్నాయకుడు, మాజీ మంత్రి. పైగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. కీలకమైన నాయకుడు కూడా. అయితే.. ఇప్పుడు ఆయన తీవ్ర అసహనంలోకూరుకుపోయారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు వస్తుందో రాదో అనే బెంగ ఆయనను వెంటాడేస్తోంది. దీంతో నిన్న మొన్నటి వరకు యక్టివ్గా ఉన్న సదరు సోదరుడు.. ఇప్పుడు.. టీడీపీపై నిర్లిప్త వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆయనే మాజీ మంత్రి ఆలపాటి రాజా అలియాస్ ఆలపాటి రాజేంద్రప్రసాద్. రాష్ట్రంలో టీడీపీ, జనసేన మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆలపాటి రాజా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే.. జనసేనతోపొత్తు పెట్టుకుంటే.. ఈసీటును ఖచ్చితంగా టీడీపీ వదులుకోవాలి.
ఎందుకంటే.. జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్.. తెనాలి నుంచి పోటీ చేయనున్నారు. ఆయనను పక్కన పెట్టే పరిస్థితి లేదు. దీంతో ఈ విషయంపై ఆలపాటి మనస్తాపంతో ఉన్నారు. మొదట్లో వేమూరులో, ఆ తర్వాత తెనాలిలో పోటీ చేశా. ఒక సీటు అని రాసి పెట్టలేదు. నేను మానసికంగా సిద్ధ పడాల్సిన అవసరం లేదు. అధికారం నాకు కొత్త కాదు
అని వ్యాఖ్యానించారు.
తొలుత ఈ ఏడాదిలో గత రెండు మాసాల వరకు కూడా ఆయన పార్టీలో యాక్టివ్గానే ఉన్నారు. కానీ, గత నెల నుంచి మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు. దీనికి కారణాలు తెలియకపోయినా.. తాజాగా మాత్రం ఆయన స్పందించి..తానేమీ..పర్మినెంట్ కాదని.. టీడీపీలో అనేక మంది నాయకులు ఉన్నారని.. అధినేత ఇష్టం అంటూ.. ముక్తసరి వ్యాఖ్యలతో పార్టీలోకాక పుట్టించారు. బలమైన సామాజికవర్గం నేతగా గుర్తింపు ఉన్న ఆలపాటి రియాక్షన్ పార్టీపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
This post was last modified on December 24, 2022 5:37 pm
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన హరీష్ శంకర్.. ఇంటర్వ్యూల్లో సినిమా సంగతులు చాలా మాట్లాడతారు కానీ.. వ్యక్తిగత విషయాల గురించి…
హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని.. దీంతో…
శ్రీవిశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు.…
ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్…
ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని…
నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా…