ఆయన సీనియర్నాయకుడు, మాజీ మంత్రి. పైగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. కీలకమైన నాయకుడు కూడా. అయితే.. ఇప్పుడు ఆయన తీవ్ర అసహనంలోకూరుకుపోయారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు వస్తుందో రాదో అనే బెంగ ఆయనను వెంటాడేస్తోంది. దీంతో నిన్న మొన్నటి వరకు యక్టివ్గా ఉన్న సదరు సోదరుడు.. ఇప్పుడు.. టీడీపీపై నిర్లిప్త వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆయనే మాజీ మంత్రి ఆలపాటి రాజా అలియాస్ ఆలపాటి రాజేంద్రప్రసాద్. రాష్ట్రంలో టీడీపీ, జనసేన మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆలపాటి రాజా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే.. జనసేనతోపొత్తు పెట్టుకుంటే.. ఈసీటును ఖచ్చితంగా టీడీపీ వదులుకోవాలి.
ఎందుకంటే.. జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్.. తెనాలి నుంచి పోటీ చేయనున్నారు. ఆయనను పక్కన పెట్టే పరిస్థితి లేదు. దీంతో ఈ విషయంపై ఆలపాటి మనస్తాపంతో ఉన్నారు. మొదట్లో వేమూరులో, ఆ తర్వాత తెనాలిలో పోటీ చేశా. ఒక సీటు అని రాసి పెట్టలేదు. నేను మానసికంగా సిద్ధ పడాల్సిన అవసరం లేదు. అధికారం నాకు కొత్త కాదు అని వ్యాఖ్యానించారు.
తొలుత ఈ ఏడాదిలో గత రెండు మాసాల వరకు కూడా ఆయన పార్టీలో యాక్టివ్గానే ఉన్నారు. కానీ, గత నెల నుంచి మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు. దీనికి కారణాలు తెలియకపోయినా.. తాజాగా మాత్రం ఆయన స్పందించి..తానేమీ..పర్మినెంట్ కాదని.. టీడీపీలో అనేక మంది నాయకులు ఉన్నారని.. అధినేత ఇష్టం అంటూ.. ముక్తసరి వ్యాఖ్యలతో పార్టీలోకాక పుట్టించారు. బలమైన సామాజికవర్గం నేతగా గుర్తింపు ఉన్న ఆలపాటి రియాక్షన్ పార్టీపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
This post was last modified on December 24, 2022 5:37 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…