కొందరు అంతే.. మారరు బ్రో!-ఇదీ.. తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలను గమనిస్తున్న వారు బాహాటంగానే చెబుతున్న మాట. దీనికి కారణం.. పార్టీలో ఉన్న సీనియర్లే! వీరంతా.. పార్టీని ముందుకు తీసుకువెళ్లలేరు.. తీసుకువెళ్తామని చెబుతున్నవారిని తీసుకుని వెళ్లనివ్వడమూ లేదు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడానికి తప్ప.. పాలించడానికి పనికిరాకుండా పోయిన పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోయే ప్రమాదం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు.
రేవంత్ పగ!
కాంగ్రెస్ ప్రస్తుత చీఫ్ రేవంత్రెడ్డి కేంద్రంగా కొన్ని రోజులుగా పార్టీ సీనియర్లు.. తీవ్ర విమర్శలు చేస్తున్నా రు. ముఖ్యంగా జంబో కమిటీలను ఏర్పాటు చేయడం.. దీనిలో ప్రాధాన్యం లేని పదవులను తమకు కట్టబె ట్టారంటూ..కొండా సురేఖ ఆరోపించడంతో ప్రారంభమైన ఈ అసమ్మతి సెగ.. ఇప్పుడు సౌమ్యుడిగా పేరున్న భట్టి విక్రమార్క వరకు పాకింది. వీరందరికీ కంటగింపు ఒక్క రేవంత్రెడ్డే!
దీనికి కారణం.. ఆయన పార్టీ మారి వచ్చాడు. టీడీపీతో ఇప్పటికి సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నా డు. అనేది కాదు! చిత్రంగా ఆయనకు కీలకమైన పదవి ఇవ్వడమే వీరికి బాధ. పోనీ తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఇద్దరు కీలక నాయకులు.. చీఫ్లుగా చేశారు. పొన్నాల లక్ష్మయ్య సారథ్యం వహించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చామని చెప్పుకొని అధికారం లోకి వస్తామన్నారు. కానీ, ఏమైంది. ఆయన నాయకత్వానికి కూడా గండి కొట్టారు.
తర్వాత బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్రెడ్డిని కూడా సీనియర్లు అలానే చేశారు. కేవలం ఆయనను డమ్మీ అంటూ.. ప్రచారం చేశారు. ఎవరికి వారు తామంటే తామని.. కొట్టాడుకుని.. సొంత ఇంటికి కుంపటి పెట్టుకున్న చందంగా.. పార్టీని బజారున పడేసిన వారే తప్ప.. మేమున్నాం.. అంటూ.. పార్టీని భుజాన వేసుకుని నడిపించిన నాయకులు ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఇప్పుడు కూడా ఎన్నికల ముందు.. సీనియర్లు చేస్తున్న రాజకీయంతో పార్టీని నష్టమే కాదు.. వ్యక్తిగతంగా వారి ఇమేజ్ కూడా కోల్పోవడం ఖాయం.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…