Political News

400 రోజులు.. 4000 కిలో మీట‌ర్లు.. లోకేష్ పాద‌యాత్ర‌

తాను నిర్వ‌హించ‌నున్న‌ పాదయాత్రపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా స్పందించా రు. తాను పాద‌యాత్ర చేస్తున్నానంటూ వ‌స్తున్న‌వార్త‌లు నిజ‌మేన‌ని చెప్పారు. వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరాటంలో భాగంగానే తాను పాద‌యాత్ర చేస్తున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్ర వ్యాప్తంగా త‌న పాద‌యాత్ర ఉంటుంద‌ని.. ప్ర‌తిగ్రామం, న‌గ‌రం స‌హా ప‌ట్ట‌ణాల్లోనూ త‌న పాద‌యాత్ర కొన‌సాగుతుంద‌ని తెలిపారు. త‌న త‌ల్లి ఆశీర్వాదంతో ఈ పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు.

వ‌చ్చే ఏడాది జనవరి 27 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర.. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు కొనసాగుతుందని నారా లోకేష్ తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు లోకేష్‌ నడవనున్నారు. మంగళగిరిలో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త‌న పాద‌యాత్ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ హాజ‌రు కావాల‌ని.. పార్టీ నాయ‌కుల‌కు నిర్దేశించారు. పాద‌యాత్ర ను జ‌య‌ప్ర‌దం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌న్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న మంగళగిరి నియోజకవర్గంలో 4 రోజులు పాదయాత్ర ఉంటుందని నారా లోకేష్ తెలిపారు. మిగిలిన రోజుల్లో రాష్ట్రమంతా పాదయాత్ర చేయనున్నట్లు లోకేష్‌ వెల్లడించారు. తనని ఓడించేందుకు సీఎం జగన్‌ వాడే అన్ని ఆయుధాలను దీటుగా ఎదుర్కోవాలని పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న‌ పిలుపునిచ్చారు. మంగళగిరిని కాపు కాసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు లోకేష్‌ సూచించారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

8 minutes ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

45 minutes ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

48 minutes ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

2 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

4 hours ago

బెంగాల్ కోసం మోదీ ఎంత పరితపించారో

దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…

5 hours ago