Political News

400 రోజులు.. 4000 కిలో మీట‌ర్లు.. లోకేష్ పాద‌యాత్ర‌

తాను నిర్వ‌హించ‌నున్న‌ పాదయాత్రపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా స్పందించా రు. తాను పాద‌యాత్ర చేస్తున్నానంటూ వ‌స్తున్న‌వార్త‌లు నిజ‌మేన‌ని చెప్పారు. వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరాటంలో భాగంగానే తాను పాద‌యాత్ర చేస్తున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్ర వ్యాప్తంగా త‌న పాద‌యాత్ర ఉంటుంద‌ని.. ప్ర‌తిగ్రామం, న‌గ‌రం స‌హా ప‌ట్ట‌ణాల్లోనూ త‌న పాద‌యాత్ర కొన‌సాగుతుంద‌ని తెలిపారు. త‌న త‌ల్లి ఆశీర్వాదంతో ఈ పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు.

వ‌చ్చే ఏడాది జనవరి 27 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర.. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు కొనసాగుతుందని నారా లోకేష్ తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు లోకేష్‌ నడవనున్నారు. మంగళగిరిలో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త‌న పాద‌యాత్ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ హాజ‌రు కావాల‌ని.. పార్టీ నాయ‌కుల‌కు నిర్దేశించారు. పాద‌యాత్ర ను జ‌య‌ప్ర‌దం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌న్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న మంగళగిరి నియోజకవర్గంలో 4 రోజులు పాదయాత్ర ఉంటుందని నారా లోకేష్ తెలిపారు. మిగిలిన రోజుల్లో రాష్ట్రమంతా పాదయాత్ర చేయనున్నట్లు లోకేష్‌ వెల్లడించారు. తనని ఓడించేందుకు సీఎం జగన్‌ వాడే అన్ని ఆయుధాలను దీటుగా ఎదుర్కోవాలని పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న‌ పిలుపునిచ్చారు. మంగళగిరిని కాపు కాసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు లోకేష్‌ సూచించారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

2 hours ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

3 hours ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

3 hours ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

4 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

4 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

5 hours ago