తాను నిర్వహించనున్న పాదయాత్రపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా స్పందించా రు. తాను పాదయాత్ర చేస్తున్నానంటూ వస్తున్నవార్తలు నిజమేనని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటంలో భాగంగానే తాను పాదయాత్ర చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్ర ఉంటుందని.. ప్రతిగ్రామం, నగరం సహా పట్టణాల్లోనూ తన పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. తన తల్లి ఆశీర్వాదంతో ఈ పాదయాత్రను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
వచ్చే ఏడాది జనవరి 27 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర.. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు కొనసాగుతుందని నారా లోకేష్ తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు లోకేష్ నడవనున్నారు. మంగళగిరిలో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పాదయాత్రకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని.. పార్టీ నాయకులకు నిర్దేశించారు. పాదయాత్ర ను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న మంగళగిరి నియోజకవర్గంలో 4 రోజులు పాదయాత్ర ఉంటుందని నారా లోకేష్ తెలిపారు. మిగిలిన రోజుల్లో రాష్ట్రమంతా పాదయాత్ర చేయనున్నట్లు లోకేష్ వెల్లడించారు. తనని ఓడించేందుకు సీఎం జగన్ వాడే అన్ని ఆయుధాలను దీటుగా ఎదుర్కోవాలని పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరిని కాపు కాసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు లోకేష్ సూచించారు.
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…