రాష్ట్ర విభజన నేపథ్యంలో పాలనను మరింత వికేంద్రీకరించే క్రమంలో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్ని 33 జిల్లాలుగా ఏర్పాటు చేయటం తెలిసిందే. పది కాస్తా ముప్ఫై మూడు కావటంతో టీఆర్ఎస్ సర్కారుకు పెద్ద సమస్యలు ఎదురు కాలేదు. అయిన్పటికీ కొన్ని జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఏపీలోనూ కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తు సాగుతోంది.
ఎన్నికలకు ముందుగా జగన్ పార్టీ ప్రతి లోక్ సభ స్థానాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని చెప్పటం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని పాతిక ఎంపీ స్థానాలు పాతిక జిల్లాలుగా మారనున్నాయి. అయితే.. ఆ మధ్యన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో కొత్త కన్ఫ్యూజన్ తెర మీదకు వచ్చింది. మొదట్నించి చెబుతున్న దాని ప్రకారం పాతిక లోక్ సభ స్థానాలకు పాతిక జిల్లాలుగా ఏర్పాటు చేయాలనుకున్న వేళలోనే..సీఎం జగన్ మాత్రం ఒక గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న మాట చెప్పారు.
దీంతో.. ఏపీలో ఏర్పాటు చేసేది పాతిక జిల్లాలా? ఇరవై ఆరు జిల్లాలా? అన్నది ప్రశ్నగా మారింది. జగన్ ఏర్పాటు చేస్తానని చెప్పిన గిరిజన జిల్లా శ్రీకాకుళం.. విజయనగరం మధ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఇదేమీ కాకుండా అరకును విశాఖ జిల్లా నుంచి వేరు చేసిన కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. శ్రీకాకుళం.. విజయనగరం మధ్యన ఉన్న పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వాదనలు ఇలా కొనసాగుతుండగా.. కొత్త జిల్లాల మీద ఎవరూ క్లారిటీ ఇవ్వని పరిస్థితి.
మొత్తంగా చూస్తే.. ఏపీలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలు ఏమిటన్నది పక్కన పెడితే.. ఎన్ని జిల్లాలు అన్న దానిపైనా కన్ఫ్యూజన్ నెలకొందని చెప్పక తప్పదు. ఏమైనా ఈ విషయంలో సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ కానుంది.
This post was last modified on July 13, 2020 10:15 am
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…