రాష్ట్ర విభజన నేపథ్యంలో పాలనను మరింత వికేంద్రీకరించే క్రమంలో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్ని 33 జిల్లాలుగా ఏర్పాటు చేయటం తెలిసిందే. పది కాస్తా ముప్ఫై మూడు కావటంతో టీఆర్ఎస్ సర్కారుకు పెద్ద సమస్యలు ఎదురు కాలేదు. అయిన్పటికీ కొన్ని జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఏపీలోనూ కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తు సాగుతోంది.
ఎన్నికలకు ముందుగా జగన్ పార్టీ ప్రతి లోక్ సభ స్థానాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని చెప్పటం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని పాతిక ఎంపీ స్థానాలు పాతిక జిల్లాలుగా మారనున్నాయి. అయితే.. ఆ మధ్యన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో కొత్త కన్ఫ్యూజన్ తెర మీదకు వచ్చింది. మొదట్నించి చెబుతున్న దాని ప్రకారం పాతిక లోక్ సభ స్థానాలకు పాతిక జిల్లాలుగా ఏర్పాటు చేయాలనుకున్న వేళలోనే..సీఎం జగన్ మాత్రం ఒక గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న మాట చెప్పారు.
దీంతో.. ఏపీలో ఏర్పాటు చేసేది పాతిక జిల్లాలా? ఇరవై ఆరు జిల్లాలా? అన్నది ప్రశ్నగా మారింది. జగన్ ఏర్పాటు చేస్తానని చెప్పిన గిరిజన జిల్లా శ్రీకాకుళం.. విజయనగరం మధ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఇదేమీ కాకుండా అరకును విశాఖ జిల్లా నుంచి వేరు చేసిన కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. శ్రీకాకుళం.. విజయనగరం మధ్యన ఉన్న పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వాదనలు ఇలా కొనసాగుతుండగా.. కొత్త జిల్లాల మీద ఎవరూ క్లారిటీ ఇవ్వని పరిస్థితి.
మొత్తంగా చూస్తే.. ఏపీలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలు ఏమిటన్నది పక్కన పెడితే.. ఎన్ని జిల్లాలు అన్న దానిపైనా కన్ఫ్యూజన్ నెలకొందని చెప్పక తప్పదు. ఏమైనా ఈ విషయంలో సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ కానుంది.
This post was last modified on July 13, 2020 10:15 am
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…