రాష్ట్ర విభజన నేపథ్యంలో పాలనను మరింత వికేంద్రీకరించే క్రమంలో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్ని 33 జిల్లాలుగా ఏర్పాటు చేయటం తెలిసిందే. పది కాస్తా ముప్ఫై మూడు కావటంతో టీఆర్ఎస్ సర్కారుకు పెద్ద సమస్యలు ఎదురు కాలేదు. అయిన్పటికీ కొన్ని జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఏపీలోనూ కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తు సాగుతోంది.
ఎన్నికలకు ముందుగా జగన్ పార్టీ ప్రతి లోక్ సభ స్థానాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని చెప్పటం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని పాతిక ఎంపీ స్థానాలు పాతిక జిల్లాలుగా మారనున్నాయి. అయితే.. ఆ మధ్యన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో కొత్త కన్ఫ్యూజన్ తెర మీదకు వచ్చింది. మొదట్నించి చెబుతున్న దాని ప్రకారం పాతిక లోక్ సభ స్థానాలకు పాతిక జిల్లాలుగా ఏర్పాటు చేయాలనుకున్న వేళలోనే..సీఎం జగన్ మాత్రం ఒక గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న మాట చెప్పారు.
దీంతో.. ఏపీలో ఏర్పాటు చేసేది పాతిక జిల్లాలా? ఇరవై ఆరు జిల్లాలా? అన్నది ప్రశ్నగా మారింది. జగన్ ఏర్పాటు చేస్తానని చెప్పిన గిరిజన జిల్లా శ్రీకాకుళం.. విజయనగరం మధ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఇదేమీ కాకుండా అరకును విశాఖ జిల్లా నుంచి వేరు చేసిన కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. శ్రీకాకుళం.. విజయనగరం మధ్యన ఉన్న పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వాదనలు ఇలా కొనసాగుతుండగా.. కొత్త జిల్లాల మీద ఎవరూ క్లారిటీ ఇవ్వని పరిస్థితి.
మొత్తంగా చూస్తే.. ఏపీలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలు ఏమిటన్నది పక్కన పెడితే.. ఎన్ని జిల్లాలు అన్న దానిపైనా కన్ఫ్యూజన్ నెలకొందని చెప్పక తప్పదు. ఏమైనా ఈ విషయంలో సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ కానుంది.
This post was last modified on July 13, 2020 10:15 am
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…