Trends

27 వేల క‌రోనా శాంపిల్స్ ప‌నికిరాకుండా పోయాయ్

క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రుపుతున్న‌ సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌ల్ల ల‌క్ష‌ల రూపాయ‌ల న‌ష్టం వాటిల్లింది. తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. జ‌నాల నుంచి సేక‌రించి 27 వేల శాంపిల్స్ ప‌నికి రాకుండా పోయాయి. ఈ ఉదంతం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విష‌య‌మై ప్ర‌కాశం జిల్లా క‌లెక్ట‌ర్ పోలా భాస్క‌ర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేవారు.

అనుమానిత లక్షణాలున్న వారి నుంచి నమూనాల సేకరించే క్ర‌మంలో క్షేత్ర స్థాయిలో పొరపాట్లు దొర్లుతున్నాయని.. సేకరించిన వాటికి ఐడీ నంబర్లు వేయడం లేదని.. మూత లేకుండానే కొన్నింటిని ల్యాబ్‌లకు పంపిస్తున్నారని.. దీంతో టెస్టింగ్‌ కేంద్రాల్లో నమూనాలు పక్కన పెడుతున్నారని.. ఇలా జిల్లాలో 27 వేల శాంపిల్స్ వృథా అయ్యాయ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు.

\క‌రోనా శాంపిల్స్ సేక‌ర‌ణ‌, మెయింటైనెన్స్‌లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యంవల్ల ల్యాబ్‌ సిబ్బంది ఒకరు మరణించిన‌ట్లు కూడా క‌లెక్ట‌ర్‌ వెల్ల‌డించారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదంటూ ఆయ‌న మీడియాకు కూడా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇదిలా ఉంటే ప్రకాశం మాదిరిగానే ఏపీలోని పలు జిల్లాల్లోనూ అనుమానితుల నుంచి సేక‌రించిన శాంపిల్స్ ప‌రీక్ష‌ల‌కు నోచుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది.

సుమారు పది జిల్లాలలో ఒక్కోచోట 4 నుంచి 5 వేల వరకు నమూనాలను పరీక్షించకుండానే వదిలేశారన్న ఆరోప‌ణ‌లున్నాయి. ఏపీలో ఒక్కో నిర్ధారణ పరీక్షకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 వరకు ఖ‌ర్చు చేస్తోంది. సేకరించిన నమూనాలు నిర్ణీత వ్యవధిలో ల్యాబ్‌లకు వెళ్తున్నాయా.. వివరాల నమోదు సక్రమంగా ఉందా.. సకాలంలో ఫలితాలు వస్తున్నాయా.. అన్న‌దానిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


Satya

Recent Posts

గీతాంజలి… ఇలాంటివి కదా చూడాలి

గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…

1 hour ago

పవన్ మాటంటే మాటే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…

3 hours ago

దృశ్యం 3 తెలుగు అభిమానులకు షాక్

రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…

3 hours ago

ఈ రచ్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…

4 hours ago

కన్నప్ప పునఃదర్శనం ఇంత త్వరగానా

మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…

4 hours ago

సాయికృష్ణ ఘటనపై చంద్రబాబు సీరియస్

విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…

5 hours ago