కరోనా పరీక్షలు జరుపుతున్న సిబ్బంది నిర్లక్ష్యం వల్ల లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జనాల నుంచి సేకరించి 27 వేల శాంపిల్స్ పనికి రాకుండా పోయాయి. ఈ ఉదంతం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయమై ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేవారు.
అనుమానిత లక్షణాలున్న వారి నుంచి నమూనాల సేకరించే క్రమంలో క్షేత్ర స్థాయిలో పొరపాట్లు దొర్లుతున్నాయని.. సేకరించిన వాటికి ఐడీ నంబర్లు వేయడం లేదని.. మూత లేకుండానే కొన్నింటిని ల్యాబ్లకు పంపిస్తున్నారని.. దీంతో టెస్టింగ్ కేంద్రాల్లో నమూనాలు పక్కన పెడుతున్నారని.. ఇలా జిల్లాలో 27 వేల శాంపిల్స్ వృథా అయ్యాయని కలెక్టర్ వెల్లడించారు.
\కరోనా శాంపిల్స్ సేకరణ, మెయింటైనెన్స్లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యంవల్ల ల్యాబ్ సిబ్బంది ఒకరు మరణించినట్లు కూడా కలెక్టర్ వెల్లడించారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదంటూ ఆయన మీడియాకు కూడా ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే ప్రకాశం మాదిరిగానే ఏపీలోని పలు జిల్లాల్లోనూ అనుమానితుల నుంచి సేకరించిన శాంపిల్స్ పరీక్షలకు నోచుకోవడం లేదని తెలుస్తోంది.
సుమారు పది జిల్లాలలో ఒక్కోచోట 4 నుంచి 5 వేల వరకు నమూనాలను పరీక్షించకుండానే వదిలేశారన్న ఆరోపణలున్నాయి. ఏపీలో ఒక్కో నిర్ధారణ పరీక్షకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 వరకు ఖర్చు చేస్తోంది. సేకరించిన నమూనాలు నిర్ణీత వ్యవధిలో ల్యాబ్లకు వెళ్తున్నాయా.. వివరాల నమోదు సక్రమంగా ఉందా.. సకాలంలో ఫలితాలు వస్తున్నాయా.. అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on July 13, 2020 7:41 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…