Trends

27 వేల క‌రోనా శాంపిల్స్ ప‌నికిరాకుండా పోయాయ్

క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రుపుతున్న‌ సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌ల్ల ల‌క్ష‌ల రూపాయ‌ల న‌ష్టం వాటిల్లింది. తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. జ‌నాల నుంచి సేక‌రించి 27 వేల శాంపిల్స్ ప‌నికి రాకుండా పోయాయి. ఈ ఉదంతం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విష‌య‌మై ప్ర‌కాశం జిల్లా క‌లెక్ట‌ర్ పోలా భాస్క‌ర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేవారు.

అనుమానిత లక్షణాలున్న వారి నుంచి నమూనాల సేకరించే క్ర‌మంలో క్షేత్ర స్థాయిలో పొరపాట్లు దొర్లుతున్నాయని.. సేకరించిన వాటికి ఐడీ నంబర్లు వేయడం లేదని.. మూత లేకుండానే కొన్నింటిని ల్యాబ్‌లకు పంపిస్తున్నారని.. దీంతో టెస్టింగ్‌ కేంద్రాల్లో నమూనాలు పక్కన పెడుతున్నారని.. ఇలా జిల్లాలో 27 వేల శాంపిల్స్ వృథా అయ్యాయ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు.

\క‌రోనా శాంపిల్స్ సేక‌ర‌ణ‌, మెయింటైనెన్స్‌లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యంవల్ల ల్యాబ్‌ సిబ్బంది ఒకరు మరణించిన‌ట్లు కూడా క‌లెక్ట‌ర్‌ వెల్ల‌డించారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదంటూ ఆయ‌న మీడియాకు కూడా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇదిలా ఉంటే ప్రకాశం మాదిరిగానే ఏపీలోని పలు జిల్లాల్లోనూ అనుమానితుల నుంచి సేక‌రించిన శాంపిల్స్ ప‌రీక్ష‌ల‌కు నోచుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది.

సుమారు పది జిల్లాలలో ఒక్కోచోట 4 నుంచి 5 వేల వరకు నమూనాలను పరీక్షించకుండానే వదిలేశారన్న ఆరోప‌ణ‌లున్నాయి. ఏపీలో ఒక్కో నిర్ధారణ పరీక్షకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 వరకు ఖ‌ర్చు చేస్తోంది. సేకరించిన నమూనాలు నిర్ణీత వ్యవధిలో ల్యాబ్‌లకు వెళ్తున్నాయా.. వివరాల నమోదు సక్రమంగా ఉందా.. సకాలంలో ఫలితాలు వస్తున్నాయా.. అన్న‌దానిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


This post was last modified on July 13, 2020 7:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

45 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago