Political News

లోకేష్ గ్రాఫ్‌ పెరిగిందా.. తాజా స‌ర్వే ఏం చెప్పింది…!

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ తో భేటీ అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లో భాగంగా.. లోకేష్‌ తో చంద్ర‌బాబు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంపై చ‌ర్చించారు. సాధార‌ణంగా.. నారా లోకేష్ దూకుడు, నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు మీడియాలో జొరుగానే ప్ర‌చారం జ‌రుగుతున్నాయి. వీటిని బ‌ట్టి.. ఎవ‌రైనా..లోకేష్ దూకుడు సూప‌రెహే! అనే అనుకుంటారు. కానీ, చంద్ర‌బాబు చేయించి న లేటెస్ట్ స‌ర్వేలో మాత్రం.. లోకేష్‌కు త‌క్కువ మార్కులు వ‌చ్చాయ‌ని తెలిసింది. దీంతో తాజాగా నిర్వ‌హించిన సమీక్ష‌లో లోకేష్‌కు నేరుగా క్లాస్ ఇచ్చిన ట్టు తెలుస్తోంది.

వాస్త‌వానికి.. గ‌త ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కుతాడ‌ని.. లోకేష్‌పై టీడీపీ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. నంద‌మూరి కుటుంబంలో కానీ… నారా కుటుం బంలోకానీ.. తొలిసారి పోటీ చేసిన వారు ఓడిపోవ‌డం అనేది.. లేదు. ఏదైనా.. తీవ్ర‌మైన రాజ‌కీయ స‌మ‌రం వ‌స్తే.. త‌ప్ప‌. అది కూడా.. ఎంతో కీల‌క స‌మయంలోనే. అయితే.. ఇప్పుడు.. ఎలాంటి కీల‌క సంద‌ర్భం లేకుండానే.. నారా లోకేష్ మంగ‌ళగిరిలో ప‌రాజ‌యం పాల‌య్యార‌నేది.. ఒక చ‌ర్చ‌. అది కూడా .. గ‌తంలో కంటే.. ఏకంగా వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ నాయ‌కుడు విజ‌యం ద‌క్కించుకోవ‌డం కూడా.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ ప‌రిణామాల‌తోనే ఇక్క‌డ పార్టీ పుంజుకోవాల‌ని.. ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో లోకేష్ గెలిచి తీరాల‌ని.. చంద్ర‌బాబు సంక‌ల్పం చెప్పుకొన్నారు. దీనికి త‌గిన‌ట్టుగానే.. చంద్ర‌బాబు అడుగులు ముందుకు వేస్తున్నారు. క‌నీసం.. నెల‌కు రెండు సార్లు.. నియోజ‌క‌వ‌ర్గంలో లోకేష్ ప‌ర్య‌టించేలా ప్లాన్ చేసు కున్నారు. ఈ క్ర‌మంలోనే స్థానికంగా.. ఉన్న వృత్తి దారుల‌కు.. వివిధ వ‌స్తువులు.. బండ్లు అందిస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. వారు చెబుతున్న స‌మ‌స్య‌ల‌ను కూడా.. నోట్ చేసుకుంటున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు.. ఆశించిన మేర‌కు మార్కులు ప‌డ‌లేద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు తాజాగా చేయించిన స‌ర్వేలోనూ తేలింద‌ని చెబుతున్నారు. లోకేష్‌.. వ‌స్తే.. ప్ర‌జ‌లు వ‌స్తున్నారు. ఆయ‌న‌కు స‌మ‌స్య‌లు చెబుతున్నారు. కానీ, ఆయా స‌మ‌స్య‌ల‌ను స‌మ‌స్య‌లుగా చూడ‌కుండా.. దీనిని కూడా.. రాజ‌కీయం చేయ‌డం.. ప్ర‌జ‌ల ద‌గ్గ‌రే దీనిపై విమ‌ర్శ‌లు చేయ‌డం.. వంటివి లోకేష్‌కు మైన‌స్ గా మారుతున్నాయ‌ని అంటున్నారు. నిజానికి ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పిన‌ప్పుడు.. వాటిని రాజ‌కీయ కోణంలో చూడ‌కుండా.. వారికి కొంత భ‌రోసా క‌ల్పించేలా చూడాలి. అయితే.. ఈ విష‌యంలో లోకేష్ చెబుతున్న మాటలు రాజ‌కీయ కోణంలోనే ఉన్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే మార్కులు ఆశించినంతగా ప‌డ‌లేద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా.. మారి.. మంచి మార్కుల‌దిశ‌గా అడుగులు వేస్తారో లేదో చూడాలి.

This post was last modified on October 29, 2022 11:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

31 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago