Political News

మ‌రీ ఇంత బ‌లుపా.. ఎమ్మెల్యేగారూ!!

ఎమ్మెల్యే అంటే.. ఎలా ఉండాలి? ప్ర‌జ‌ల‌కు అంతో ఇంతో సేవ చేసేలా ఉండాలి. పోనీ.. చేయ‌క‌పోయినా.. వారు ఓట్లు వేసి గెలిపించినందుకైనా వారి ప‌ట్ల‌క‌నీసం మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాలి. కానీ, ఇటీవ‌ల కాలంలో కొంద‌రు ఎమ్మెల్యేలు.. దారి త‌ప్పుతున్నారు. నోటి దురుసుతో కొంద‌రు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంటే.. మ‌రికొంద‌రు.. ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించి.. వివాదాల‌కు కేంద్రం అవుతున్నారు. తాము ఏం చేసినా.. అడిగే వారెవ‌రు.. అనుకుంటున్నారో.. లేక‌.. ప్ర‌జ‌లు భ‌రిస్తారులే.. అని భావిస్తున్నారో.. తెలియ‌దు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. నిత్యం ఏదో ఒక వివాదంలో అయితే.. చిక్కుతున్నారు.

తాజాగా.. పోచంమైదాన్‌లో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే Narendera దిష్టిబొమ్మ దహనం చేసేందుకు పద్మశాలీయులు యత్నించారు. దీంతో అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పద్మశాలీయులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే నరేందర్ పద్మశాలీలను కించపరిచేలా… మగ్గంపై కాలుపెట్టి దుర్మార్గంగా వ్యవహరించారని పద్మశాలీయులు ఆరోపించారు. రోడ్డుపై భైఠాయించి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే అయితే.. ఎవ‌రికి ఎక్కువ‌? అనే వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యే దిష్ట బొమ్మ‌ను ద‌హ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక‌కు సంబంధించి TRS అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డిని గెలిపించేందుకు.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో న‌రేంద‌ర్ కూడా రంగంలోకి దిగి ప్ర‌చారం ప్రారంబించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని పోచం మైదాన్‌లో ఆయ‌న ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డ మెజారిటీగా ఉన్న చేనేత కార్మికుల ఇళ్ల‌కు వెళ్లారు. టీఆర్ ఎస్ కే ఓటు వేయాల‌ని.. నేత‌న్న‌ల‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం ఎంతో చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. ఈ క్ర‌మంలో ఆయ‌న ఒక ఇంట్లో మ‌గ్గంపై కాళ్లు పెట్టి మాట్లాడార‌నేది నేత‌న్న‌ల ఆరోప‌ణ‌. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని.. డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సోమ‌వారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు మంగ‌ళ‌వారం వారు రోడ్డెక్కారు అయితే.. అధికార పార్టీ నాయ‌కులు మాత్రం ఈ వివాదం వెనుక‌.. బీజేపీ నేత‌లు ఉన్నార‌ని.. వారు ప్రోత్స‌హిస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Share
Show comments
Published by
Satya
Tags: TRSTRS MLA

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

14 seconds ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

44 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago