Political News

మ‌రీ ఇంత బ‌లుపా.. ఎమ్మెల్యేగారూ!!

ఎమ్మెల్యే అంటే.. ఎలా ఉండాలి? ప్ర‌జ‌ల‌కు అంతో ఇంతో సేవ చేసేలా ఉండాలి. పోనీ.. చేయ‌క‌పోయినా.. వారు ఓట్లు వేసి గెలిపించినందుకైనా వారి ప‌ట్ల‌క‌నీసం మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాలి. కానీ, ఇటీవ‌ల కాలంలో కొంద‌రు ఎమ్మెల్యేలు.. దారి త‌ప్పుతున్నారు. నోటి దురుసుతో కొంద‌రు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంటే.. మ‌రికొంద‌రు.. ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించి.. వివాదాల‌కు కేంద్రం అవుతున్నారు. తాము ఏం చేసినా.. అడిగే వారెవ‌రు.. అనుకుంటున్నారో.. లేక‌.. ప్ర‌జ‌లు భ‌రిస్తారులే.. అని భావిస్తున్నారో.. తెలియ‌దు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. నిత్యం ఏదో ఒక వివాదంలో అయితే.. చిక్కుతున్నారు.

తాజాగా.. పోచంమైదాన్‌లో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే Narendera దిష్టిబొమ్మ దహనం చేసేందుకు పద్మశాలీయులు యత్నించారు. దీంతో అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పద్మశాలీయులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే నరేందర్ పద్మశాలీలను కించపరిచేలా… మగ్గంపై కాలుపెట్టి దుర్మార్గంగా వ్యవహరించారని పద్మశాలీయులు ఆరోపించారు. రోడ్డుపై భైఠాయించి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే అయితే.. ఎవ‌రికి ఎక్కువ‌? అనే వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యే దిష్ట బొమ్మ‌ను ద‌హ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక‌కు సంబంధించి TRS అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డిని గెలిపించేందుకు.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో న‌రేంద‌ర్ కూడా రంగంలోకి దిగి ప్ర‌చారం ప్రారంబించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని పోచం మైదాన్‌లో ఆయ‌న ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డ మెజారిటీగా ఉన్న చేనేత కార్మికుల ఇళ్ల‌కు వెళ్లారు. టీఆర్ ఎస్ కే ఓటు వేయాల‌ని.. నేత‌న్న‌ల‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం ఎంతో చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. ఈ క్ర‌మంలో ఆయ‌న ఒక ఇంట్లో మ‌గ్గంపై కాళ్లు పెట్టి మాట్లాడార‌నేది నేత‌న్న‌ల ఆరోప‌ణ‌. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని.. డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సోమ‌వారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు మంగ‌ళ‌వారం వారు రోడ్డెక్కారు అయితే.. అధికార పార్టీ నాయ‌కులు మాత్రం ఈ వివాదం వెనుక‌.. బీజేపీ నేత‌లు ఉన్నార‌ని.. వారు ప్రోత్స‌హిస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

39 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

55 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago