Political News

కాంగ్రెస్‌కు మోడీ భారీ షాక్‌!!

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుతో ఒక‌రి త‌ర్వాత‌..ఒక‌రుగా విచార‌ణ‌లుఎదుర్కొంటూ.. ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్న కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌కు.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో భారీ షాక్ ఇచ్చింది. ఈ దెబ్బ‌తో కాంగ్రెస్ కోలుకోవ‌డం.. క‌ష్ట‌మ‌నే వాద‌న కూడా వినిపిస్తుండడం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. ఈ షాక్‌తో రాహుల్ త‌న భార‌త్ జోడో యాత్ర‌ను అర్ధంత‌రంగా విర‌మించుకుని హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిపోయారు.

ఏం జ‌రిగింది?

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి చెందిన రెండు ఎన్జీఓలకు కేంద్రం షాక్ ఇచ్చింది. విదేశీ విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆ రెండు ఎన్జీల ఎఫ్సీఆర్ఏను అంటే.. విదేశాల నుంచి విరాళాలు సేక‌రించేందుకు వినియోగించుకునే లైసెన్సులను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జీసీటీ) చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. నిధుల దుర్వినియోగం, ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు వివ‌రాల‌ను వక్రీకరించడం సహా, చైనా, విదేశాల నుంచి నిధులు పొందుతూ మనీలాండరింగ్కు పాల్పడుతున్నాయని అధికారులు తెలిపారు.

హోం శాఖ లైసెన్సులు రద్దు చేసిన రెండు ఎన్డీఓలకు సోనియాగాంధీ ఛైర్పర్సన్గా ఉన్నారు. ట్రస్టీలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేత చిదంబరం, ప్రియాంక గాంధీ.. తదితరులు ఉన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్.. 1991లో ఏర్పాటైంది. అణగారిన వర్గాలు, గ్రామీణ పేదల అవసరాలను తీర్చేంచుకు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ను 2002లో నెలకొల్పారు.

ఇదిలావుంటే.. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న భార‌త్‌ జోడో యాత్ర తెలంగాణ‌లో ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. దీనిని ర‌ద్దు చేసుకుని.. ఆయన హైద‌రాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి న్యూఢిల్లీకి వెళ్లిపోయారు.

This post was last modified on October 23, 2022 2:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని 500 కోట్లు కొట్టాలంటే…

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…

48 minutes ago

మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఇంకెప్పుడు?

బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…

3 hours ago

వంగా అసలు ఆలోచన ఏంటి?

సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన…

3 hours ago

ఘట్టమనేని వారసుడి గురించి టాక్ ఏంటి

ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…

4 hours ago

గాయపడ్డ హీరో గట్టిగా కొడతాడా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…

8 hours ago

ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లానింగా?

మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…

8 hours ago