రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో భారీ విజయాన్నందుకున్న మెగాస్టార్ చిరంజీవికి ఆ తర్వాత ఆశించిన ఫలితాలు దక్కట్లేదు. ‘సైరా నరసింహారెడ్డి’కి మంచి టాకే వచ్చినా.. సినిమా మీద పెట్టిన బడ్జెట్కు తగ్గట్లుగా వసూళ్లు రాబట్టలేకపోయింది. పాన్ ఇండియా స్థాయిలో అద్భుతాలు చేస్తుందనుకున్న సినిమా వేరే భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఓవరాల్గా అది కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచింది. ఇక ‘సైరా’ తర్వాత చిరు చేసిన ‘ఆచార్య’ ఎంత చేదు అనుభవం మిగిల్చిందో తెలిసిందే.
ఇక చిరు లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ తొలి వారాంతం వరకు సందడి చేసి ఆ తర్వాత చల్లబడిపోయింది. ఓవరాల్గా ఈ సినిమా ఫలితాన్ని ‘యావరేజ్’గానే అభివర్ణించాల్సి ఉంటుంది. ఇక మెగా అభిమానుల ఆశలన్నీ బాబీ దర్శకత్వంలో చేస్తున్న కొత్త చిత్రం మీదే ఉన్నాయి. ఈ చిత్రానికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
దీపావళి కానుకగా సోమవారం ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు. ఒక వీడియో ద్వారా టైటిల్ రివీల్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక ప్రి టీజర్ వదిలారు. అందులో వెనుక నుంచి చిరు ఊర మాస్ అవతారాన్ని చూపించారు. బీడీ తీసుకుని నోట్లో పెట్టుకుంటున్న దృశ్యం చూపించారు. ఇది యాజిటీజ్ ‘కొదమ సింహం’ నుంచి తీసుకొచ్చిన సీనే. వెంటనే మెగా అభిమానులు ఆ విషయం కనిపెట్టి ‘కొదమ సింహం’లోని సన్నివేశం తాలూకు వీడియోను షేర్ చేస్తున్నారు.
ఐతే పాత సినిమాను కాపీ కొట్టాడని బాబీ మీద వారికేమీ కోపం రావట్లేదు. అభిమానుల్లో చాలామందికి ఇది నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తోంది. బాబీ ఫిల్మోగ్రఫీని గమనిస్తే అతనేమీ కొత్త తరహా సినిమాలు చేయడు. పాత సినిమాల నుంచే స్ఫూర్తి పొంది హీరోల అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తాడు. ‘వాల్తేర్ వీరయ్య’కు సంబంధించి కూడా చిరు, బాబీ ముందు నుంచి చెబుతున్నదేమంటే.. చిరు ఇందులో అభిమానులు మెచ్చేలా వింటేజ్ స్టయిల్లో కనిపిస్తాడని. చిరు ఊర మాస్ సినిమాల్లోని మూమెంట్స్ను గుర్తుకు చేసేలా సినిమా ఉంటుందని.. కొదమసింహం మాత్రమే కాక రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ లాంటి మాస్ సినిమాల స్టయల్లో ఇది సాగుతుందన్నది స్పష్టం.
This post was last modified on October 23, 2022 3:01 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…