రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో భారీ విజయాన్నందుకున్న మెగాస్టార్ చిరంజీవికి ఆ తర్వాత ఆశించిన ఫలితాలు దక్కట్లేదు. ‘సైరా నరసింహారెడ్డి’కి మంచి టాకే వచ్చినా.. సినిమా మీద పెట్టిన బడ్జెట్కు తగ్గట్లుగా వసూళ్లు రాబట్టలేకపోయింది. పాన్ ఇండియా స్థాయిలో అద్భుతాలు చేస్తుందనుకున్న సినిమా వేరే భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఓవరాల్గా అది కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచింది. ఇక ‘సైరా’ తర్వాత చిరు చేసిన ‘ఆచార్య’ ఎంత చేదు అనుభవం మిగిల్చిందో తెలిసిందే.
ఇక చిరు లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ తొలి వారాంతం వరకు సందడి చేసి ఆ తర్వాత చల్లబడిపోయింది. ఓవరాల్గా ఈ సినిమా ఫలితాన్ని ‘యావరేజ్’గానే అభివర్ణించాల్సి ఉంటుంది. ఇక మెగా అభిమానుల ఆశలన్నీ బాబీ దర్శకత్వంలో చేస్తున్న కొత్త చిత్రం మీదే ఉన్నాయి. ఈ చిత్రానికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
దీపావళి కానుకగా సోమవారం ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు. ఒక వీడియో ద్వారా టైటిల్ రివీల్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక ప్రి టీజర్ వదిలారు. అందులో వెనుక నుంచి చిరు ఊర మాస్ అవతారాన్ని చూపించారు. బీడీ తీసుకుని నోట్లో పెట్టుకుంటున్న దృశ్యం చూపించారు. ఇది యాజిటీజ్ ‘కొదమ సింహం’ నుంచి తీసుకొచ్చిన సీనే. వెంటనే మెగా అభిమానులు ఆ విషయం కనిపెట్టి ‘కొదమ సింహం’లోని సన్నివేశం తాలూకు వీడియోను షేర్ చేస్తున్నారు.
ఐతే పాత సినిమాను కాపీ కొట్టాడని బాబీ మీద వారికేమీ కోపం రావట్లేదు. అభిమానుల్లో చాలామందికి ఇది నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తోంది. బాబీ ఫిల్మోగ్రఫీని గమనిస్తే అతనేమీ కొత్త తరహా సినిమాలు చేయడు. పాత సినిమాల నుంచే స్ఫూర్తి పొంది హీరోల అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తాడు. ‘వాల్తేర్ వీరయ్య’కు సంబంధించి కూడా చిరు, బాబీ ముందు నుంచి చెబుతున్నదేమంటే.. చిరు ఇందులో అభిమానులు మెచ్చేలా వింటేజ్ స్టయిల్లో కనిపిస్తాడని. చిరు ఊర మాస్ సినిమాల్లోని మూమెంట్స్ను గుర్తుకు చేసేలా సినిమా ఉంటుందని.. కొదమసింహం మాత్రమే కాక రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ లాంటి మాస్ సినిమాల స్టయల్లో ఇది సాగుతుందన్నది స్పష్టం.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…