బీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితి .. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన జాతీయ పార్టీ. దేశవ్యాప్తంగా.. దీనిపై చర్చ జరుగుతున్నదా.. లేదా.. అనే విషయాన్ని పక్కన పెడితే.. మన తెలుగు వాడు.. పెట్టిన పార్టీ కాబట్టి.. తెలుగు వారిగా.. ఒకింత గర్వించదగ్గ విషయమే అవుతుంది. ఎందుకంటే.. ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీగా మార్చడంలో ఇప్పటికే టీడీపీ లైన్లో ఉంది. టీడీపీ జాతీయ పార్టీగా ఎన్నికల సంఘంలో గుర్తింపు పొందింది.
అయితే.. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పోటీ చేయలేదు. సరే.. ఇప్పుడు.. కేసీఆర్. జాతీయ స్థాయిలో వెలుగుతానంటూ.. దూకుడుగా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఏపీ విషయాన్ని తీసుకుంటే.. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ పరిస్థితి ఏంటి? అనేది ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారనే.. చర్చ కొన్నాళ్లుగా జరుగుతోంది. ఈ విషయంపై.. అనేక సందేహాలు ఉన్నా.. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
పొరుగు రాష్ట్రం.. పైగా తెలుగు రాష్ట్రం.. అంతా మనోళ్లే.. పైగా హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకునేవారు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్కు ఏపీపై దృష్టి పెట్టడం ఖాయం. విశాఖ సహా.. కర్నూలు.. వంటి ఉమ్మడి జిల్లాల్లో 4-5 జిల్లాలను ఎంపిక చేసుకుని ఆయన పోటీకి దిగడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. దీంతో ఈ విషయంపై అధికార వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ప్రశ్న. ఇప్పటికే టీడీపీ తిప్పి కొట్టింది. పార్టీకి, కేసీఆర్కు నిజాయితీలేదని వ్యాఖ్యానించింది.
మరి వైసీపీ ఏమని భావిస్తుంది? అనేది ప్రశ్న. ఈ విషయంలో మంత్రులు కొందరు మాట్టాడుతూ.. కేసీఆర్ రావొచ్చని.. సభలు కూడా పెట్టొచ్చని.. తప్పేముందని వ్యాఖ్యానించారు. అయితే.. వచ్చే ఎన్నికలను చూసుకుంటే.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు పెరుగుతుందనే అంచనా వుంది. ఈ క్రమంలో దీనిని చీలకుండా.. చూస్తానని జనసేనాని పవన్ వ్యాఖ్యానించారు. కానీ, ఇది చీలితేనే బెటర్ అని వైసీపీ భావిస్తోంది. ఇది చీలాలంటే.. కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో ఇక్కడ పోటీకి దిగితేనే బెటర్. సో.. ఈ కోణంలో చూసుకుంటే.. కేసీఆర్ విషయంలో వైసీపీ సానుకూల ధోరణితోనే ఉన్నట్టు కనిపిస్తోంది.
This post was last modified on October 7, 2022 10:11 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…