పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం పర్లేదనిపించినప్పటికీ పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న విశ్వక్ సేన్ ఈసారి విక్టరీ వెంకటేష్ సహాయం తీసుకున్నాడు. తమిళ హిట్ మూవీ ఓ మై కడవులేకి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఓరి దేవుడా ఈ నెల 21న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన అశ్వత్ మారిముత్తునే దీనికి దర్శకుడు. చాలా గ్యాప్ తర్వాత పివిపి నిర్మాణంలో వస్తున్న ఎంటర్ టైనర్ ఇది. ఇందాక గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. మొన్నటిదాకా దీని మీద పెద్దగా బజ్ లేదు కానీ వెంకీ క్యామియో కన్ఫర్మ్ అయ్యాక అంచనాలు పెరిగాయి.
స్టోరీ పాయింట్ వెరైటీగా తోస్తోంది. స్నేహితురాలినే పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అతను ఆశించినంత అందంగా జీవితం లేకపోగా చిత్ర విచిత్రమైన గొడవలతో సతమతమవుతూ ఉంటాడు. ఈలోగా గతంలో ఇష్టపడిన అమ్మాయి ఇతనికి తారసపడుతుంది. కట్టుకున్న దానికేమో సవాలక్ష అనుమానాలు. ఈ పోరు పడలేక సతమతమవుతున్న అర్జున్ (విశ్వక్ సేన్)మొర విని ఏకంగా దేవుడే వచ్చేస్తాడు. ఊహించని ఒక ఆఫర్ ఇస్తాడు. దీంతో లైఫ్ టర్న్ అవుతుందనే గ్యారెంటీతో అర్జున్ ఒప్పుకుంటాడు. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఏంటి, ప్రేమికుడితో దేవుడి ఫ్రెండ్ షిప్ ఎలా కుదిరింది ఇదంతా తెరమీదే చూడాలి.
సినిమాలో విషయముందనే అభిప్రాయమైతే దీంతో కలిగించారు. ఎఫ్3 తర్వాత గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుందేమోనని టెన్షన్ పడిన దగ్గుబాటి ఫ్యాన్స్ కి రిలీఫ్ కలిగేలా వెంకీని మంచి పాత్రలో చూసే అవకాశం దక్కింది. తమిళ్ లో ఇది విజయ్ సేతుపతి చేయగా కన్నడలో స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ పోషించారు. లక్కీ మ్యాన్ గా రూపొందిన ఈ మూవీ కర్ణాటకలో ఓ మాదిరిగా ఆడింది. ఈ వారమే ఓటిటిలో వచ్చింది. అయితే వాళ్ళిద్దరికీ కామెడీ టైమింగ్ పరంగా వెంకటేష్ కు చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మంచి అవుట్ పుట్టే ఆశించొచ్చు. దీపావళికున్న గట్టి పోటీలో ఎక్కువ ఎడ్జ్ దీనికే కనపడుతోంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…