పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం పర్లేదనిపించినప్పటికీ పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న విశ్వక్ సేన్ ఈసారి విక్టరీ వెంకటేష్ సహాయం తీసుకున్నాడు. తమిళ హిట్ మూవీ ఓ మై కడవులేకి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఓరి దేవుడా ఈ నెల 21న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన అశ్వత్ మారిముత్తునే దీనికి దర్శకుడు. చాలా గ్యాప్ తర్వాత పివిపి నిర్మాణంలో వస్తున్న ఎంటర్ టైనర్ ఇది. ఇందాక గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. మొన్నటిదాకా దీని మీద పెద్దగా బజ్ లేదు కానీ వెంకీ క్యామియో కన్ఫర్మ్ అయ్యాక అంచనాలు పెరిగాయి.
స్టోరీ పాయింట్ వెరైటీగా తోస్తోంది. స్నేహితురాలినే పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అతను ఆశించినంత అందంగా జీవితం లేకపోగా చిత్ర విచిత్రమైన గొడవలతో సతమతమవుతూ ఉంటాడు. ఈలోగా గతంలో ఇష్టపడిన అమ్మాయి ఇతనికి తారసపడుతుంది. కట్టుకున్న దానికేమో సవాలక్ష అనుమానాలు. ఈ పోరు పడలేక సతమతమవుతున్న అర్జున్ (విశ్వక్ సేన్)మొర విని ఏకంగా దేవుడే వచ్చేస్తాడు. ఊహించని ఒక ఆఫర్ ఇస్తాడు. దీంతో లైఫ్ టర్న్ అవుతుందనే గ్యారెంటీతో అర్జున్ ఒప్పుకుంటాడు. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఏంటి, ప్రేమికుడితో దేవుడి ఫ్రెండ్ షిప్ ఎలా కుదిరింది ఇదంతా తెరమీదే చూడాలి.
సినిమాలో విషయముందనే అభిప్రాయమైతే దీంతో కలిగించారు. ఎఫ్3 తర్వాత గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుందేమోనని టెన్షన్ పడిన దగ్గుబాటి ఫ్యాన్స్ కి రిలీఫ్ కలిగేలా వెంకీని మంచి పాత్రలో చూసే అవకాశం దక్కింది. తమిళ్ లో ఇది విజయ్ సేతుపతి చేయగా కన్నడలో స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ పోషించారు. లక్కీ మ్యాన్ గా రూపొందిన ఈ మూవీ కర్ణాటకలో ఓ మాదిరిగా ఆడింది. ఈ వారమే ఓటిటిలో వచ్చింది. అయితే వాళ్ళిద్దరికీ కామెడీ టైమింగ్ పరంగా వెంకటేష్ కు చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మంచి అవుట్ పుట్టే ఆశించొచ్చు. దీపావళికున్న గట్టి పోటీలో ఎక్కువ ఎడ్జ్ దీనికే కనపడుతోంది.
This post was last modified on October 8, 2022 11:53 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…