Political News

జ‌గ‌న్ సార్‌.. మూడు జిల్లాల కోసం చూస్తే.. ప‌ది చేజారుతున్నాయే!!

ఔను.. రాజ‌కీయాల్లో ఏం చేసినా.. పార్టీకి మేలు జ‌ర‌గాలి. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాలి. ఏ పార్టీ అయినా.. నాయకుడికైనా.. ఉన్న ఏకైక ల‌క్ష్యం ఇదే. అయితే.. ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో ఆయ‌న‌కే పెద్ద మైన‌స్ ఏర్ప‌డుతోంద‌ని మేధావి వ‌ర్గం చెబుతోంది. ఆయ‌న తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంతో ఆయ‌న‌కు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. చెబుతున్నారు. ఎందుకంటే.. ఇది మూడు ప్రాంతాల‌కు సంబంధించిన విష‌యంగా మారిపోతే.. మిగిలిన ప‌ది జిల్లాల విష‌యం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో 13 ఉమ్మ‌డి జిల్లాలు ఉన్నాయి. ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తి.. ఒక్క గుంటూరులోనే ఉంది. గ‌త ప్ర‌భుత్వం ఇక్క‌డ న‌వ‌న‌గ‌రాలు పేరుతో అభివృద్ధి చేసేందుకు రెడీ అయింది. స‌న్ రైజ్ స్టేట్‌గా ఏపీని తీర్చ‌దిద్దాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే.. గత ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయిన ద‌రిమిలా.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. వ‌చ్చీరావ‌డంతోనే.. మూడు రాజ‌ధానులు అంటూ.. సీఎం జ‌గ‌న్ ప‌ల్ల‌వి అందుకున్నారు. అంతేకాదు.. మూడు ప్రాంతాల అభివృద్ది దీనివ‌ల్లే సాధ్య‌మ‌ని కొత్త భాష్యం చెప్పారు.

ఈ దిశ‌గానే అడుగులు వేస్తున్నారు. కోర్టులు వ‌ద్దంటున్నా.. రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు.. మేం భూములు ఇచ్చాం.. మాకు అన్యాయం చేస్తారా.. అంటూ.. క‌న్నీరు పెడుతున్నా.. జ‌గ‌న్ మాత్రం త‌న పంతానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. దీనివ‌ల్ల జ‌గ‌న్‌కు కానీ.. వైసీపీకి కానీ.. ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏంటి? అస‌లు 175కు 175 అసెంబ్లీలు గెలుచుకుందామ‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న జ‌గ‌న్ టార్గెట్ ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంది? అనేది ఇప్పుడు కీల‌క‌మైన చ‌ర్చ‌కు వ‌స్తోంది.

దీనిపై మేధావులు ఆస‌క్తిక‌ర చ‌ర్చ చేస్తున్నారు. రాష్ట్రంలో గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు, కర్నూలు, క‌డ‌ప‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగాఇత‌ర జిల్లాల్లోనూ… భారీ ఎత్తున సీట్లు పోగేసుకుంది. ఈ ప‌రిణామం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొన‌సాగాలంటే.. ఎక్క‌డి రాజ‌ధానిని అక్క‌డే ఉంచాల‌నేది మేధావుల మాట‌. అలా కాకుండా.. మూడు రాజ‌ధానులు చేస్తే.. కేవ‌లం.. జ‌గ‌న్‌కు ఆ మూడు ప్రాంతాల్లోని ప్ర‌జ‌లే.. ఓట్లు వేసే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

మిగిలిన జిల్లాల్లో ప్ర‌జ‌లు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పినా.. ఆశ్చ‌ర్యం లేద‌నేది.. మేదావుల మాట‌. ఎందుకంటే.. విశాఖ‌ను రాజ‌ధాని చేస్తే.. క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం, చిత్తూరు ప్ర‌జ‌ల‌కు వంద‌ల కిలో మీట‌ర్ల‌దూరం పెరిగిపోయి.. ఉపాధి కూడా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది. ఇక‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, కృష్ణా, గుంటూరు వాసులు.. కీల‌క మైన పాల‌నా రాజ‌ధాని.. గుంటూరులోనే ఉండాలని కోరుకుంటున్నారు., ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల్లో వైసీపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని మేధావులు చెబుతున్నారు.

అంటే.. మూడు రాజ‌ధానుల‌తో జ‌గ‌న్ ద‌క్కేది.. కేవ‌లం మూడు జిల్లాల్లో విజ‌య‌మే త‌ప్ప‌.. మిగిలిన 10 ఉమ్మ‌డి జిల్లాల్లో మాత్రం వ్య‌తిరేక‌త ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం ఆలోచిస్తున్నారో.. ఏమో తెలియ‌దు కానీ.. పార్టీ న‌మ్ముకున్న నాయ‌కుల‌ను మాత్రం ఈ ప‌రిణామం.. తీవ్ర ఎఫెక్ట్ చూపిస్తుంద‌నే ఆవేద‌న‌, ఆందోళ‌న‌, అంత‌కు మించిన భ‌యం వెంటాడుతుండ‌డం గ‌మ‌నార్హం.మ‌రి ఇప్ప‌టికైనా..జ‌గ‌న్‌, పార్టీని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on September 17, 2022 6:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

16 minutes ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

40 minutes ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

50 minutes ago

విజయ్ నిర్మాతలకు ఊహించని పండగ

అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…

1 hour ago

మే నెల బోణీ చేదుగా ఉంది

కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…

2 hours ago

ఎమ్మెల్యేగా ఆ రాష్ట్ర సీఎం ఓటమి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…

3 hours ago