రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు. తిరుగులేదని చెప్పుకొన్న నాయకులు కూడా ప్రజల మనసులో చోటు సంపాయించుకోకపోతే.. తర్వాత కాలంలో కాల గర్భంలో కలిసిపోయిన పరిస్థితి కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సూత్రం.. గుంటూరుజిల్లాలో కీలక నాయకుడు.. వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నరాయపాటి సాంబశివరావు విషయంలోనూ జరుగుతోందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన వయోవృద్ధుడు అయిపోయారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు.
మరోపక్క ఆయన కుమారుడు.. రాయపాటి రంగారావు.. పోటీ చేయాలని అనుకున్నారు. కానీ.. ఆయన ప్రజల మధ్య ఉండడం లేదు. పైగా.. పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పటికీ.. ఆయన ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. వాస్తవానికి గుంటూరు జిల్లా నాయకులు అందరూ కూడా.. నారా లోకేష్కు మద్దతు తెలుపుతున్నారు. దాదాపు జిల్లా మొత్తంపైనా నారా లోకేష్ ఆధిపత్యం ఉంది. ఈ సమయంలో అందరూ ఆయనకు జై కొడుతున్నారు. ఎలాగైనా సరే.. నారా లోకేష్ను వచ్చే ఎన్నికల్లో గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ సమయంలో లోకేష్కు అండగా నిలిచి.. తను ఎంచుకున్న నియోజకవర్గంలో పోటీ ఇచ్చేలా వ్యవహ రించాల్సిన రంగారావు.. ఎక్కడా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో రంగారావు.. పోటీ చేయాల్సి ఉంది. అయితే.. అప్పటి పోటీ తీవ్రంగా ఉంటుందని భావించిన చంద్రబాబు.. ఆయనను తప్పించారు. దీంతో ఒత్తిడి తెచ్చిన రాయపాటి నరసరావుపేట పార్లమెంటు సీటును దక్కించుకున్నారు. అయితే..యువ నేత, వైసీపీ నాయకుడు.. లావు చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోయారు.
ఇక, అప్పటి నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితం అయ్యారు. ఇక, ఆ తర్వాత.. రంగారావుకు సత్తెనపల్లి సీటు ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో నరసరావుపేట నియోజకవర్గాన్ని కూడా తమ కుటుంబానికే.. ఇవ్వాలని.. పట్టుబట్టారు. రెంటు సీట్లు కాదు.. ఒకటి తీసుకోమని.. చంద్రబాబు పదే పదే చెప్పారు. ఈ విషయంలో ఎటూ తేల్చుకోని.. రంగారావు.. అప్పటి నుంచి పార్టీపై అలకబూనారు.
ఫలితంగా.. ఇప్పుడు అటు సత్తెనపల్లి.. ఇటు నరసరావుపేటలను కూడా పోగొట్టుకున్నారని అంటున్నారు పార్టీ నాయకులు.. ఈ రెండు చోట్ల కూడా చంద్రబాబు వేరేవారికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని.. సత్తెనపల్లిని కోడెల శివప్రసాదరావు తనయుడు.. శివరామకృష్ణ లేదా మరో ఇద్దరు నేతల్లో ఎవరో ఒకరికి ఇవ్వనున్నారని సమాచారం. ఇక, నరసారావుపేట విషయంలో తేల్చాల్సి ఉంది.
This post was last modified on September 17, 2022 6:32 am
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…