Movie News

ఇండస్ట్రీ మీద అమ్మాయి సెటైర్లు

అభిమానులు నిట్రో స్టార్ అని పిలుచుకునే సుధీర్ బాబు కొత్త సినిమా ఆ అమ్మాయి గురించి మీతో చెప్పాలి థియేటర్లలోకి వచ్చేసింది. శ్రీదేవి సోడా సెంటర్ కోసం ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడంతో దీని మీదే ఆశలు పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టే టీమ్ కూడా ప్రమోషన్లు ఘనంగా చేసింది. కానీ టాక్ డివైడ్ గానే ఉంది. సమ్మోహనం స్థాయిలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మేజిక్ చేయలేకపోయారనే కామెంట్స్ బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఓపెనింగ్స్ చాలా నెమ్మదిగా ఉండటం ట్రేడ్ ని కొంత టెన్షన్ పెట్టిన వాస్తవం.

ఇదిలా ఉండగా ఈ మూవీలో ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ నే తీసుకున్న ఇంద్రగంటి పరిశ్రమ మీద, ప్రస్తుత పోకడ మీద కొన్ని డైరెక్ట్ సెటైర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో హీరో పాత్ర పేరు నవీన్. వరసగా ఆరు సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్. మొదటి మగాడు, కసక్ లాంటి చిత్ర విచిత్రమైన టైటిల్స్ తో బ్లాక్ బస్టర్లు కొట్టుంటాడు. హీరోయిన్ తో సహా జనం వీటిని తిట్టుకుంటారు. అయినా డబ్బులొచ్చి నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉంటారు. కమర్షియల్ సక్సెస్ సాధించాడు కాబట్టి ప్రొడ్యూసర్లు కథలు వినకుండా మరీ అడ్వాన్స్ లు ఇచ్చేందుకు రెడీ అవుతారు.

ఇది ఎవరి గురించో నేరుగా ప్రస్తావించలేదు కానీ ఓ యవ దర్శకుడిని టార్గెట్ చేసినట్టుగా సోషల్ మీడియా భాష్యం చెబుతోంది. ఇలా ఫెయిల్యూర్ చూడకుండా మసాలా సినిమాలతో కెరీర్ లో పెద్ద స్థాయికి వెళ్లిన వాళ్లకు ఓ చురక వేశారని అంటున్నారు. అంతేకాదు వెబ్ సైట్స్ మీద వెన్నెల కిషోర్ తో చెప్పిన డైలాగ్ సైతం ఏదో లక్ష్యంగా రాసిన వ్యంగ్య ధోరణి కనిపించింది. మొత్తానికి ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సున్నితమైన అంశాలను మాత్రమే స్పృశించే ఇంద్రగంటి ఈసారి గేర్ మార్చి ఇలా కొత్త రూట్ లో వెళ్లడం ఆశ్చర్యం. స్టార్ల సతీమణులపై వేసిన కౌంటర్ ఆల్రెడీ ట్రైలర్ లో వచ్చేసిన సంగతి తెలిసిందే.

This post was last modified on September 17, 2022 6:15 am

Share
Show comments

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

2 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

2 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

3 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

4 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

4 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

6 hours ago