అభిమానులు నిట్రో స్టార్ అని పిలుచుకునే సుధీర్ బాబు కొత్త సినిమా ఆ అమ్మాయి గురించి మీతో చెప్పాలి థియేటర్లలోకి వచ్చేసింది. శ్రీదేవి సోడా సెంటర్ కోసం ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడంతో దీని మీదే ఆశలు పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టే టీమ్ కూడా ప్రమోషన్లు ఘనంగా చేసింది. కానీ టాక్ డివైడ్ గానే ఉంది. సమ్మోహనం స్థాయిలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మేజిక్ చేయలేకపోయారనే కామెంట్స్ బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఓపెనింగ్స్ చాలా నెమ్మదిగా ఉండటం ట్రేడ్ ని కొంత టెన్షన్ పెట్టిన వాస్తవం.
ఇదిలా ఉండగా ఈ మూవీలో ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ నే తీసుకున్న ఇంద్రగంటి పరిశ్రమ మీద, ప్రస్తుత పోకడ మీద కొన్ని డైరెక్ట్ సెటైర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో హీరో పాత్ర పేరు నవీన్. వరసగా ఆరు సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్. మొదటి మగాడు, కసక్ లాంటి చిత్ర విచిత్రమైన టైటిల్స్ తో బ్లాక్ బస్టర్లు కొట్టుంటాడు. హీరోయిన్ తో సహా జనం వీటిని తిట్టుకుంటారు. అయినా డబ్బులొచ్చి నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉంటారు. కమర్షియల్ సక్సెస్ సాధించాడు కాబట్టి ప్రొడ్యూసర్లు కథలు వినకుండా మరీ అడ్వాన్స్ లు ఇచ్చేందుకు రెడీ అవుతారు.
ఇది ఎవరి గురించో నేరుగా ప్రస్తావించలేదు కానీ ఓ యవ దర్శకుడిని టార్గెట్ చేసినట్టుగా సోషల్ మీడియా భాష్యం చెబుతోంది. ఇలా ఫెయిల్యూర్ చూడకుండా మసాలా సినిమాలతో కెరీర్ లో పెద్ద స్థాయికి వెళ్లిన వాళ్లకు ఓ చురక వేశారని అంటున్నారు. అంతేకాదు వెబ్ సైట్స్ మీద వెన్నెల కిషోర్ తో చెప్పిన డైలాగ్ సైతం ఏదో లక్ష్యంగా రాసిన వ్యంగ్య ధోరణి కనిపించింది. మొత్తానికి ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సున్నితమైన అంశాలను మాత్రమే స్పృశించే ఇంద్రగంటి ఈసారి గేర్ మార్చి ఇలా కొత్త రూట్ లో వెళ్లడం ఆశ్చర్యం. స్టార్ల సతీమణులపై వేసిన కౌంటర్ ఆల్రెడీ ట్రైలర్ లో వచ్చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 17, 2022 6:15 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…