తెలంగాణలో మరోసరికొత్త వివాదం..తెరమీదికి వచ్చింది. సెప్టెంబరు 17, తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యవ్యవస్థలోకి వచ్చిన రోజు. ఇది రేపటికి 75వ వసంతంలోకి అడుగు పెడుతోంది. దీనిని పురస్కరించుకుని.. సర్కారు-గవర్నర్ భవనాలు.. రెండుగా చీలిపోయాయి. ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది. అయితే.. గవర్నర్ తమిళిసై మాత్రం దీనిని విమోచనా దినోత్సవంగానే నిర్వహించాలని నిర్ణయించారు.
ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దీంతో ఈ పరిణామాలు.. అటు ప్రభుత్వానికి, ఇటు రాజ్భవన్కు మధ్య మరింత వివాదాన్ని రేపిందని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరిట ఏడాదిపాటు ఘనంగా వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వజ్రోత్సవ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నా రు. విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. తెలంగాణ చరిత్రలో ఎంతో చారిత్రకతను సొంతం చేసుకున్న సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేసమయంలో విమోచన దినోత్సవంలో భాగంగా రాజ్భవన్ లో మేధావుల సదస్సును గవర్నర్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక, శనివారం.. హైదరాబాద్లో బంజారా, ఆదివాసీ భవన్లను సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు గిరిజన కళారూపాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం స్టేడియంలో జరిగే బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రారంభ వేడుకల్లో మూడో రోజైన ఈనెల 18న జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వాతంత్ర సమరయోధులను సన్మానిస్తారు. కవులు, కళాకారులను గుర్తించి సత్కరిస్తారు.
షా రాక..
మరోవైపు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన అమృతోత్సవాలను విజయవంతం చేసేందుకు… కేంద్ర పర్యాటక శాఖ ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఈ రోజు హైదరాబాద్కు రానున్నారు. శనివారం ఉదయం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే విమోచన అమృతోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితి గుంభనంగా మారిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో నన్న టెన్షన్ వాతావరణం కూడా నెలకొనడం గమనార్హం.
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…
షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…