ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియాలో బ్లాక్బస్టర్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లే సినిమా ఉండడంతో అపూర్వ ఆదరణ దక్కింది. చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నా కూడా అవేమీ పెద్ద కంప్లైంట్లు కావు. ఇండియాలో ఈ చిత్రం దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో రూ.200 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు వచ్చాయి. మొత్తంగా రూ.1200 కోట్ల వసూళ్లతో ఔరా అనిపించింది ఆర్ఆర్ఆర్.
ఐతే సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయాక నెట్ ఫ్లిక్స్లో హిందీ వెర్షన్కు వచ్చిన రెస్పాన్స్ అసాధారణం. హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్ ఈ సినిమాను గొప్పగా ఆదరించారు ఆడియన్స్. హాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. మళ్లీ యుఎస్లో స్పెషల్ షోలు వేస్తే అక్కడి ప్రేక్షకులు విరగబడి చూశారు.
ఈ స్పందన తనకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించినట్లు చెబుతున్నాడు రాజమౌళి. టొరంటో ఫిలిం ఫెస్టివల్కు అతిథిగా హాజరైన జక్కన్న అక్కడ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్కు వచ్చిన ఇంటర్నేషనల్ అప్లాజ్ గురించి చర్చించాడు. తనతో పాటు ఇండియన్ ఫిలిం మేకర్స్ అందరూ ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ ఉన్న ఇండియన్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లే సినిమాలు తీస్తామని.. ఐతే బాహుబలి సినిమా భారతీయులతో పాటు జపాన్ ఆడియన్స్ను గొప్పగా అలరించిందని.. ఐతే ఆర్ఆర్ఆర్ మాత్రం హాలీవుడ్ ప్రేక్షకులను ఆ స్థాయిలో మెప్పిస్తుందని తాను ఊహించాలేదని జక్కన్న చెప్పాడు.
మామూలుగా వెస్ట్ ప్రేక్షకుల అభిరుచి వేరు, మన సినిమాలు వాళ్లకు రుచించవు అనే అభిప్రాయంతో ఉండేవాడినని.. కానీ ఆర్ఆర్ఆర్ను వాళ్లు అంతగా ఆదరించడం చూసి మనం కూడా వాళ్ల అభిరుచికి తగ్గ సినిమా తీయగలం అని అర్థం చేసుకున్నానని.. ఈ విషయాన్ని మరింత స్టడీ చేస్తున్నానని జక్కన్న చెప్పాడు. జక్కన్న మాటల్ని బట్టి చూస్తే మహేష్బాబుతో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ లెవెల్లోనే ఉంటుందని అర్థమవుతోంది.
This post was last modified on September 16, 2022 10:35 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…