Political News

ఇటు #whereiskcr.. అటు #10millioncovidtestsinap

రెండు నెలల కిందట తెలుగు రాష్ట్రాల జనాలు ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెగ పొగుడుతుండేవాళ్లు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురుస్తుండేది. కరోనా నియంత్రణలో కేసీఆర్ చాలా సమర్థంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపించేది. ఈ విషయంలో ఏపీ సీఎం ఫెయిలైనట్లే అని అంతా తీర్మానించేశారు.

కానీ అప్పటితో పోలిస్తే పరిస్థితి ఇప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ విమర్శలెదుర్కొంటున్నారు. జగన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే ఇది స్పష్టమవుతోంది. నేషనల్ మీడియాలో కూడా ఇదే తరహాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు హైదరాబాద్ సహా తెలంగాణలో కరోనా తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో కేసీఆర్ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు కనిపించారు.

తరచుగా ప్రెస్ మీట్లు పెట్టి జనాల్లో నైతిక స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. కొన్ని వారాలుగా ఆయన కనిపించడం లేదు. హైదరాబాద్‌లో రోజు రోజుకూ కరోనా తీవ్రత పెరిగిపోయి భయాందోళనలు పెరిగిపోతున్న సమయంలో కేసీఆర్ మీడియా ముందుకు రాకపోవడం, ఆయన్నుంచి ఏ రకమైన ప్రకటన కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్లో నిన్నట్నుంచి #whereiskcr హ్యాష్ ట్యాగ్ పెట్టి పెద్ద ఎత్తున ట్వీట్లు గుప్పిస్తున్నారు నెటిజన్లు.

ఇది కేవలం ప్రత్యర్థులు చేయిస్తున్న పని అని కొట్టేయడానికి వీల్లేదు. సామాన్య జనాల నుంచి కూడా ఈ ప్రశ్న ఎదురవుతోంది. ఇదే సమయంలో మరోవైపు #10millioncovidtestsinap అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుండటం విశేషం. తెలంగాణతో పోలిస్తే ఏపీలో పది రెట్లకు పైగా కరోనా టెస్టులు చేశారు. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ విషయంలో జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ హ్యాష్ ట్యాగ్ పెట్టి జగన్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

This post was last modified on July 6, 2020 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోరాట యోధుడిగా సల్మాన్ సర్ప్రైజ్

ఈ మధ్య సినిమాల్లో ఏదైనా దాచిపెట్టి సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటే అది లీక్ కాకుండా కాపాడుకోవడంలో దర్శక నిర్మాతలు…

3 hours ago

హోటళ్లకు బండ బాదుడే

దేశంలో వంట గ్యాస్ కు కొరత ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే అర్థమైపోయిందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్…

5 hours ago

సాయిపల్లవిని చూడ్డానికి కూడా రారా?

ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. తొలి చిత్రం ‘ప్రేమం’తో మొదలుపెడితే ప్రతి సినిమాతోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది…

7 hours ago

ఎన్టీఆర్ కోసం కథ మార్చిన ప్రశాంత్ నీల్

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా.. డ్రాగన్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా…

8 hours ago

సుకుమార్ ఎంత సమయం తీసుకుంటారో

కాసేపు పెద్ది ముచ్చట పక్కన పెడదాం. రామ్ చరణ్ తర్వాత చేయబోయే సినిమా దర్శకుడు సుకుమార్ తో అన్న సంగతి…

13 hours ago

ప్ర‌పంచానికి ముప్పే: ఇరాన్ వ‌ర్సెస్ అమెరికా.. మ‌ధ్య‌లో ర‌ష్యా!

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా.. ప్ర‌పంచ దేశాలు ఇప్ప‌టికే చ‌మురు, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ఇర‌కాటంలో ప‌డ్డాయి. అనేక దేశాల్లో మార‌కం…

17 hours ago