హీరో హీరోయిన్లెవరు.. టెక్నీషియన్లెవరు.. కథ ఏంటి అన్నది సంబంధం లేదు.. ఒక్క రాజమౌళి పేరు కనిపిస్తే చాలు.. ఇప్పుడు సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయి. ఇది తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. దేశమంతటా ఆయనకున్న క్రేజ్ అలాంటిదే. ‘బాహుబలి’ తర్వాత తనపై అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు రాజమౌళి.
ఇలా తనపై అంచనాలు పెంచడం.. ఆ అంచనాలను అందుకోవడానికి మరింత కష్టపడటం.. ఎంతటి అంచనాలతో వచ్చినా సంతృప్తిపరచడం రాజమౌళికే సాధ్యమైన విద్య. ఆయన కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మీద కూడా అంచనాలు మామూలుగా లేవు. దాన్ని ఆయన కచ్చితంగా అందుకుంటాడనే అంటున్నాడు ‘బాహుబలి’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’కు కూడా తమిళంలో మాటలు, పాటలు రాస్తున్న మదన్ కార్కీ.
ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కార్కీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తావన తెచ్చాడు. ‘బాహుబలి’లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎపిసోడ్లు పది ఉన్నాయనుకుంటే.. ‘ఆర్ఆర్ఆర్’లో అంతకుమించిన గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నట్లుగా చెప్పి ఈ సినిమాపై అంచనాల్ని ఇంకా పెంచేశాడు కార్కీ. ఈ చిత్రంలో దేశభక్తి అంశాన్ని చాలా బలంగా, రోమాలు నిక్కబొడుచుకునేలా రాజమౌళి చూపించాడని… ఇందులో అందమైన విజువల్స్తో పాటు ఇంతకుముందు ఎన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని చెప్పాడు మదన్.
ఇక రాజమౌళి సినిమాల్లో మాటలు ఎప్పుడూ చిన్నగా, ఎంతో తీవ్రతతో, మరెంతో ప్రభావం చూపేలా ఉంటాయని.. ‘ఆర్ఆర్ఆర్’ కూడా అందుకు మినహాయింపు కాదని అన్నాడు మదన్. మితభాషి అయిన మదన్.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఈ రేంజిలో చెప్పాడంటే జక్కన్న మరోసారి వినోదాల విందు చేయబోతున్నట్లే. కరోనా ప్రభావం లేకుంటే వచ్చే సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ సందడి చేసేది కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ చిత్రం విడుదల కావడానికి కనీసం ఏడాది పట్టేలా ఉంది.
This post was last modified on July 6, 2020 2:21 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…