Political News

తెలుగు రాష్ట్రాల్లో “చూడ కూడ‌ని“ రాజ‌కీయం

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు కామ‌న్‌. పార్టీల మ‌ధ్య, నేత‌ల మ‌ధ్య కూడా విమ‌ర్శ‌లు కామ‌న్‌. అయితే.. ఇవి కొంత వ‌ర‌కు హ‌ద్దుల్లోనే ఉండాలి. అంత‌కుమించితే.. ఇబ్బందులు త‌ప్ప‌వు. అయినాకూడా.. గ‌తంలో కాంగ్రెస్‌-క‌మ్యూనిస్టులు-టీడీపీ-బీజేపీ నేత‌లు.. ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకునేవారు. కానీ, ఎప్పుడూ.. ఎవ‌రూ.. అతి చేసుకున్న ప‌రిస్థితి లేదు. అంతేకాదు.. ఎక్క‌డైనా ఏదైనా సంద‌ర్భంలో ఎదురు ప‌డితే.. ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కులే అయిన‌ప్ప‌టికీ.. ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకునేవారు.

అంతేకాదు.. ఒక‌రి పిల్లల్ని మ‌రొక‌రికి ఇచ్చి.. వియ్యం అందుకున్న ప‌రిస్థితులు..కుటుంబాల మ‌ధ్య బం ధుత్వాన్ని క‌లుపుకొన్న నాయ‌కులు.. కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు చిత్ర‌మైన రాజ‌కీయాలు క‌నిపిస్తున్నా యి. నాయ‌కుల మ‌ధ్య పంతాల‌కు ప్రాధాన్యం పెరిగిపోతోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల మ‌ద్య ప‌ట్టింపులు పెరిగిపో తున్నాయి. నువ్వెంత అంటే.. నువ్వెంత అనుకునే రాజ‌కీయం కాస్తా.. వ్య‌క్తిగ‌తానికి దారితీస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. అధికార పార్టీ వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీకి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయం ర‌గులుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇది ఎంత దూరం వెళ్లిందంటే.. టీడీపీ అధినేత చంద్ర‌బా బుకు వైసీపీ అధినేత  జ‌గ‌న్ ఎదురు ప‌డ‌లేని విధంగా మారిపోయింది. గ‌తంలో అసెంబ్లీలోనూ ఇలానే వైసీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రించారు. తాజాగా.. కేంద్ర ప్ర‌భుత్వం పంపిన ఆదేశం మేర‌కు జ‌గ‌న్ ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్‌కు హాజ‌రు కావాల్సి ఉంది.

కానీ, ఇదే కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు వెళ్తుండ‌డంతో ఏకంగా..జ‌గ‌న్ డుమ్మా కొట్టారు. దీనికి ఉన్న ఏకైక కార‌ణం.. తాను ఈ కార్య‌క్ర‌మానికి వెళ్తే.. చంద్ర‌బాబుకు ఎదురు ప‌డాల్సి వ‌స్తుంద‌నే! దీంతో జ‌గ‌న్ ఆ కార్య‌క్ర‌మానికి డుమ్మా కొట్టారు. ఇక‌, స్పీక‌ర్ తమ్మినేని సీతారాం.. కుమారుడి వివాహం జ‌రిగింది. టీడీపీ నేత‌ల‌తో ఉన్న సంబంధాల నేప‌థ్యంలో ఆయ‌న వారికి కూడా ఆహ్వానాలు పంపాల‌ని అనుకున్నార‌ట‌. కానీ, పై నుంచి వ‌చ్చిన ఆదేశాల మేర‌కు విర‌మించుకున్నార‌ని.. శ్రీకాకుళం టాక్‌!!

ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. బీజేపీ నేత‌ల‌కు ఎదురు ప‌డ‌కూడ‌నే నిర్ణ‌యానికి ఇక్క‌డి సీఎం కేసీఆర్ కూడా నిర్ణ‌యించేసుకున్నారు. వారి మొహం చూడ‌ద‌ని అనుకున్నారు. అందుకే.. ఆయ‌న ఏకంగా.. అటు ఆజాదీ కార్య‌క్ర‌మానికి,.. నీతి ఆయోగ్ కార్య‌క్ర‌మానికి కూడా డుమ్మా కొట్టారు. నిజానికి గ‌తంలో ఇంత పంతాలు ప‌ట్టింపులు ఉండేవి కాదు. వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి-చంద్ర‌బాబు క‌లిసి వేదిక పంచుకున్న సీట్లు పంచుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. బీజేపీ-కాంగ్రెస్ నేత‌లు.. క‌లిసిమెలిసి  తిరిగిన ప‌రిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి మారిపోయింది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితి మున్ముందు.. మంచిదేనా? అనేది ఆస‌క్తిగా మారింది. 

Satya

Recent Posts

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

15 minutes ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

2 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

3 hours ago

జగన్.. బాలయ్య సాయం కోరిన వేళ..!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…

3 hours ago

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…

3 hours ago

వంద దేవుళ్ళు తల్లిది పెద్ద టాలెంటే

ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…

4 hours ago