ఏపీలోనే కాదు తెలంగాణలోనూ హాట్ టాపిక్ గా మారటమే కాదు.. రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలకు కారణమైంది వైసీపీ ఎంపీగా వ్యవహరిస్తున్న గోరంట్ల మాధవ్ కు చెందిన న్యూడ్ వీడియో బయటకు రావటం.. అది కాస్తావైరల్ గా మారటం ఒక ఎత్తు అయితే.. న్యూడ్ గా ఉన్న ఆయన చేసినట్లుగా చెప్పే చేష్టలు రాయలేనంతగా ఉండటం గమనార్హం. గోరంట్ల మీద చర్యలు తీసుకోవాలని.. అందుకు తగ్గట్లుగా ఆదేశించాలని కోరుతూ పలువురు విపక్ష నేతలు డిమాండ్ల మీద డిమాండ్లు చేయటం తెలిసిందే.
ఇలాంటివేళ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు.. ఆయనకు రాజకీయ సలహాదారుగా వ్యవహరించే సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో మీద మాట్లాడారు. అయితే.. అందులో కనిపించిన వీడియోలో గోరంట్ల లేరన్నారు. అంతేకాదు.. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సంచలన కథనం చదివినా.. లేదంటే ఒకరి మీద ఆరోపణ వచ్చినప్పుడు.. దానికి సంబంధించిన ఫిర్యాదుదారు ఉండాలి కదా? అంటూ సజ్జలకు సమాధానం ఇచ్చారు.
గోరంట్ల వీడియో నిజమైనదా? లేదంటే తప్పుడు వీడియోనా? అన్నదే తేలిన తర్వాత అతడిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన సజ్జల.. వీడియో మీద రావాల్సిన రిపోర్టు సోమవారం సాయంత్రం చేరుకుంటుందని చెబుతున్నారని.. అందులో నిజం లేదన్నారు. వీడియోను పంపిన అరగంటకో.. గంటకో రిపోర్టు వస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారని.. కానీ.. రిపోర్టు ఇప్పటివరకు రాలేదని స్పష్టం చేశారు. గోరంట్ల వీడియో రిపోర్టులో తప్పు చేసినట్లు తేలితేనే చర్యలు ఉంటాయన్నారు.
గోరంట్ల వీడియో మీద మాట్లాడిన సజ్జల.. చంద్రబాబు కేసును బయటకు తీసుకురావటం.. అందులో పేర్కొన్న వాయిస్ తనది కాదని చెప్పడం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో ఉన్నది చంద్రబాబే కదా? అని సందేహాల్ని ఏడేళ్లు అవుతున్నా తీర్చలేదని మండిపడ్డారు. ఆడియోలో ఉన్నది చంద్రబాబు వాయిసేనా..? కాదా? అనేది ఇంకా తేలాల్సింది ఉందన్నారు. మొత్తానికి గోరంట్ల స్పైసీ వీడియోకు.. ఓటుకు నోటు కేసు సందర్భంగా బయటకు వచ్చిన వీడియోలు తెగ వైరల్ గా మారాయని చెప్పక తప్పదు. అదే సమయంలో గోరంట్ల వీడియో ఎపిసోడ్ ముగిసిపోయినట్లేనన్న మాటను వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలతో గోరంట్లపై చర్యలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నట్లుగా సజ్జల నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.
This post was last modified on August 9, 2022 1:07 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…