టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడుతోంది. గత శుక్రవారం విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుని తొలి వారాంతంలో మంచి వసూళ్లు రాబట్టాయి. ఐతే రెండింట్లో ఎక్కువ పాజిటివ్ రివ్యూలు టాక్ వచ్చింది సీతారామం మూవీకే. కానీ తొలి వారాంతంలో వసూళ్ల పరంగా బింబిసార పైచేయి సాధించింది. సీతారామం మూవీకి తొలి మూడు రోజుల్లో రూ.10 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ వస్తే.. బింబిసారకు దాని కంటే రూ.8 కోట్లకు పైగా షేర్ ఎక్కువ వచ్చింది.
ఐతే మాస్ మూవీ కావడం వల్ల రిలీజ్కు ముందు నుంచే బింబిసారకు హైప్ ఉంది. తొలి రోజు పూర్తిగా ఆ చిత్రం ఆధిపత్యం చలాయించింది. కానీ తొలి రోజు సాయంత్రం నుంచి పుంజుకున్న సీతారామం.. శని, ఆదివారాల్లో దానికి దీటుగానే వసూళ్లు రాబట్టింది. ఇక వీకెండ్ అయ్యాక సీతారామం బాక్సాఫీస్ లీడర్గా అవతరించే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగులోనే కాక తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రానికి వసూళ్లు క్రమ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ తర్వాత బింబిసార కలెక్షన్లలో డ్రాప్ కనిపించగా.. సీతారామం కలెక్షన్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈవెనింగ్, నైట్ షోలకు హౌస్ ఫుల్స్తో రన్ అయింది సీతారామం. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఆ చిత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బుక్ మై షోలో బుకింగ్స్ చూస్తే మల్టీప్లెక్స్ స్క్రీన్లన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్, దాదాపు సోల్డ్ ఔట్ మోడ్లో కనిపించాయి.
ఇలాంటి క్లాస్ లవ్ స్టోరీలు బాక్సాఫీస్ దగ్గర నెమ్మదిగా పుంజుకోవడం.. ఎక్కువ రోజులు థియేటర్లలో నిలబడి స్థిరంగా వసూళ్లు రాబట్టడం మామూలే. అందులోనూ సీతారామంకు చాలా మంచి టాక్ రావడం, అందరూ దీన్ని క్లాసిక్ అంటుండడంతో సినిమా కొన్ని వారాల పాటు బాగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళం, మలయాళంలో తొలి రోజుతో పోలిస్తే వసూళ్లు బాగా పుంజుకున్నాయి. అక్కడ ఈ సినిమాను తొలి రోజు పట్టించుకోని ప్రేక్షకులు తర్వాత థియేటర్లకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…