Political News

మోడీకి లొంగిపోయిన కేసీఆర్‌: రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్‌.. ఆదివారం జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు కావ‌డం లేదని ప్రకటించడంపై  మండిపడ్డారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరై మోడీని కేసీఆర్‌ నిలదీయాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై ప్రశ్నించాలని కోరారు. కానీ, నీతి ఆయోగ్ స‌మావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం అంటే.. మోడీకి లొంగిపోయిన‌ట్టేన‌ని రేవంత్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప్రభుత్వ వ్యవస్థలను టీఆర్ ఎస్‌, బీజేపీ దుర్వినియోగం చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఐబీ వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు మోడీ ఈడీ, సీబీఐని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు కేసీఆర్‌ పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌, మోడీని ప్రజలు ఎవరూ నమ్మరని అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌… ఒకే నాణెనికి బొమ్మబొరుసు వంటి వారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మోడీపై విమర్శలు చేసినంత మాత్రన కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరై…. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధానిని నిలదీయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రతిపక్ష నేతల సూచనలను వింటున్నారా? నీతిఆయోగ్‌ సమావేశంలో మోడీని కేసీఆర్ నిలదీయాలి. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి నీతిఆయోగ్‌లో నిలదీయాలి. నీతిఆయోగ్‌ సమావేశానికి వెళ్లకపోతే చక్కని అవకాశం దుర్వినియోగం అవుతుంది. సమావేశానికి వెళ్లకపోతే మోడీకి కేసీఆర్‌ లొంగిపోయి ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. మోడీని ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోవద్దు. నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లకపోతే రాష్ట్రానికి నష్టం.. అని రేవంత్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 7, 2022 12:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago