Political News

మోడీకి లొంగిపోయిన కేసీఆర్‌: రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్‌.. ఆదివారం జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు కావ‌డం లేదని ప్రకటించడంపై  మండిపడ్డారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరై మోడీని కేసీఆర్‌ నిలదీయాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై ప్రశ్నించాలని కోరారు. కానీ, నీతి ఆయోగ్ స‌మావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం అంటే.. మోడీకి లొంగిపోయిన‌ట్టేన‌ని రేవంత్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప్రభుత్వ వ్యవస్థలను టీఆర్ ఎస్‌, బీజేపీ దుర్వినియోగం చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఐబీ వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు మోడీ ఈడీ, సీబీఐని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు కేసీఆర్‌ పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌, మోడీని ప్రజలు ఎవరూ నమ్మరని అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌… ఒకే నాణెనికి బొమ్మబొరుసు వంటి వారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మోడీపై విమర్శలు చేసినంత మాత్రన కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరై…. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధానిని నిలదీయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రతిపక్ష నేతల సూచనలను వింటున్నారా? నీతిఆయోగ్‌ సమావేశంలో మోడీని కేసీఆర్ నిలదీయాలి. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి నీతిఆయోగ్‌లో నిలదీయాలి. నీతిఆయోగ్‌ సమావేశానికి వెళ్లకపోతే చక్కని అవకాశం దుర్వినియోగం అవుతుంది. సమావేశానికి వెళ్లకపోతే మోడీకి కేసీఆర్‌ లొంగిపోయి ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. మోడీని ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోవద్దు. నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లకపోతే రాష్ట్రానికి నష్టం.. అని రేవంత్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 7, 2022 12:06 am

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

1 hour ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

3 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

4 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

4 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

4 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

5 hours ago