ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్.. ఆదివారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు కావడం లేదని ప్రకటించడంపై మండిపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై మోడీని కేసీఆర్ నిలదీయాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై ప్రశ్నించాలని కోరారు. కానీ, నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నానని ప్రకటించడం అంటే.. మోడీకి లొంగిపోయినట్టేనని రేవంత్ విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ వ్యవస్థలను టీఆర్ ఎస్, బీజేపీ దుర్వినియోగం చేస్తున్నాయని రేవంత్రెడ్డి మండిపడ్డారు. విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఐబీ వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు మోడీ ఈడీ, సీబీఐని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్, మోడీని ప్రజలు ఎవరూ నమ్మరని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్… ఒకే నాణెనికి బొమ్మబొరుసు వంటి వారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మోడీపై విమర్శలు చేసినంత మాత్రన కేసీఆర్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై…. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధానిని నిలదీయాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతల సూచనలను వింటున్నారా? నీతిఆయోగ్ సమావేశంలో మోడీని కేసీఆర్ నిలదీయాలి. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి నీతిఆయోగ్లో నిలదీయాలి. నీతిఆయోగ్ సమావేశానికి వెళ్లకపోతే చక్కని అవకాశం దుర్వినియోగం అవుతుంది. సమావేశానికి వెళ్లకపోతే మోడీకి కేసీఆర్ లొంగిపోయి ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. మోడీని ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోవద్దు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకపోతే రాష్ట్రానికి నష్టం.. అని రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on August 7, 2022 12:06 am
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…