ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్.. ఆదివారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు కావడం లేదని ప్రకటించడంపై మండిపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై మోడీని కేసీఆర్ నిలదీయాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై ప్రశ్నించాలని కోరారు. కానీ, నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నానని ప్రకటించడం అంటే.. మోడీకి లొంగిపోయినట్టేనని రేవంత్ విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ వ్యవస్థలను టీఆర్ ఎస్, బీజేపీ దుర్వినియోగం చేస్తున్నాయని రేవంత్రెడ్డి మండిపడ్డారు. విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఐబీ వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు మోడీ ఈడీ, సీబీఐని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్, మోడీని ప్రజలు ఎవరూ నమ్మరని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్… ఒకే నాణెనికి బొమ్మబొరుసు వంటి వారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మోడీపై విమర్శలు చేసినంత మాత్రన కేసీఆర్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై…. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధానిని నిలదీయాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతల సూచనలను వింటున్నారా? నీతిఆయోగ్ సమావేశంలో మోడీని కేసీఆర్ నిలదీయాలి. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి నీతిఆయోగ్లో నిలదీయాలి. నీతిఆయోగ్ సమావేశానికి వెళ్లకపోతే చక్కని అవకాశం దుర్వినియోగం అవుతుంది. సమావేశానికి వెళ్లకపోతే మోడీకి కేసీఆర్ లొంగిపోయి ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. మోడీని ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోవద్దు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకపోతే రాష్ట్రానికి నష్టం.. అని రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on August 7, 2022 12:06 am
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…