ఔను! ఇప్పుడు హిందూపురం ఎంపీ.. గోరంట్ల మాధవ్.. న్యూడ్ వీడియో కాల్ విషయం.. దేశవ్యాప్తంగా చర్చ కు వస్తోంది. ఈ విషయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎలాంటి చర్యలకు దిగుతారనేది ప్రధాన టాపిక్. పార్టీలోను, పార్టీ నేతల విషయంలోనూ.. జగన్.. క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారనేది ఎవరు ఔనన్నా.. కాదన్నా.. నిజం. అందుకే.. నాయకులు జగన్ తో మాట్లాడాలంటే.. కొన్ని కొన్ని విషయాల్లోచాలా జాగ్రత్తగా ఉంటారు.
ఇక, నాయకుల క్రమశిక్షణ ఎలా ఉన్నా.. మహిళల విషయంలో మాత్రం చిన్న ఆరోపణవచ్చినా.. జగన్ ఒప్పుకొనే ప్రసక్తి లేదనే టాక్ ఉంది. దీనికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. గతంలో పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో.. పార్టీ నాయకుడు.. సినీ నటుడు.. పృథ్వీకి.. జగన్.. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఇది ప్రతిష్టాత్మక పోస్టు. గతంలో అగ్రదర్శకుడు.. కే.రాఘవేంద్రరావు వంటివారు నిర్వహించిన పోస్టు కావడంతో పార్టీలో .. ఈ పోస్టుకు బాగానే పోటీ ఏర్పడింది. పోసాని కృష్ణమురళి కూడా.. ఈ పోస్టును ఆశించారని టాక్.
అయితే.. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. జగన్ మాత్రం.. పృథ్వీకి పిలిచి ఈ పీఠం అప్పగించారు. అయితే.. ఈ పదవి చేపట్టిన నాలుగు మాసాల్లోనే పృథ్వీపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే ఓమహిళపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదు అందిన వెంటనే జగన్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు. పృథ్వీని పదవి నుంచి తప్పించారు. అయితే.. తాను ఏ పాపం ఎరుగనని.. అంతా కుట్ర అని.. అప్పట్లోను.. ఇప్పుడు కూడా పృథ్వీ చెపుతున్నారు.
అయినా.. జగన్ మాత్రం మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వమని.. పేర్కొంటూ.. ఆయనను పక్కన పెట్టారు. ఇక, ఇప్పుడు ఏకంగా.. పార్లమెంటు సభ్యుడే న్యూడ్ వీడియో కాల్ మాట్లాడడం.. జుగుప్సాకరంగా వ్యవహరించడం.. వంటివి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిని ఎంపీ మాధవ్ ఖండిస్తున్నా.. వీడియోలో ఆయన స్పష్టంగా కనిపిస్తున్న వైనాన్ని మాత్రం నెటిజన్లు నిజమనే అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది ఆసక్తిగా మారింది. ఎంపీగా ఆయనను సస్పెండ్ చేయిస్తారా? లేక.. పార్టీ నుంచి తీసేస్తారా? లేక.. పార్లమెంటుకు ఫిర్యాదు చేసి.. ఆయనపై అనర్హత వేటు వేయిస్తారా? అనేది చూడాలని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 4, 2022 6:49 pm
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…
దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…
సహజంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్యలు ఆసక్తి చూపుతారు. ఈ విషయం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…
ముందు ప్రకటించిన ప్రకారమైతే అడివి శేష్ డెకాయిట్ మార్చి 19 విడుదల కావాలి. కానీ అదే రోజు దురంధర్ 2,…
టీ20 ప్రపంచకప్లో మొన్నటిదాకా భారత జట్టు టైటిల్కు హాట్ ఫేవరెట్. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచింది. మొత్తం…