Political News

మోదీ సర్కార్ తీరుపై ఎన్డీఏ ఓటర్లలోనే అసంతృప్తి

నీట్ పేపర్ లీకేజి వ్యవహారం కేంద్రంలోని బీజేపీని నీడలా వెంటాడుతూనే వుంది. 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నాక కూడా ప్రభుత్వం స్పందించక పోవడంతో విద్యార్థుల్లో ఆగ్రహం తెప్పించింది. చివరికది జంతర్ మంతర్ ఆందోళనకు దారి తీసింది. అప్పటికైనా కళ్ళు తెరిచిందా అంటే లేదు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించింది. ఈ విషయం పై తాజాగా సీ ఓటర్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రజలు అసంతృప్తి వెళ్ళగక్కినట్లు రిపోర్టు వచ్చింది. ఎన్డీఏ ఓటర్లలో ఈ అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లు తేలడం చర్చకు దారితీసింది.

నీట్ పేపర్ లీకేజి, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో జులై 29,30 తేదీల్లో సీ ఓటర్ ఒక సర్వే నిర్వహించింది. ఆన్ లైన్ సిస్టంలో ఫోన్ ద్వారా 1349 మంది నుంచి అభిప్రాయాలను సేకరించి రిపోర్ట్ రూపొందించింది. నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం, అమానుష ప్రవర్తన పై సమగ్ర విచారణ జరపాలని 62.7 శాతం మంది కోరారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ 62.7 శాతం మందిలో 58 శాతం మంది ఎన్డీఏ మద్దతుదారులున్నారు. సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తించడం ద్వారా హింసను ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని 54.2 శాతం మంది కోరారు. పేపర్ లీకేజిని అరికట్టెందుకు కఠిన చట్టాలు చేయాలని 31.7 శాతం కోరారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక ఇంత పెద్ద సంఖ్యలో వ్యతిరేకత రావడం ఇదే మొదటిసారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకరకంగా ఇది మోదీ ప్రభుత్వానికి ప్రమాద హెచ్చరికలాంటిదని విశ్లేషిస్తున్నారు. విద్యార్థులు ఆందోళన విరమించుకున్న తర్వాత విద్యార్థులపై కేసులు పెట్టడంపై కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇదేమి పట్టించుకునేలా లేదు. మళ్ళీ మరోసారి ఇలాంటి ఉద్యమం తలెత్తకుండా కఠినంగా వ్యవహారించాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు.

This post was last modified on August 5, 2026 9:05 am

Share

Recent Posts

రవితేజ ఇకపై మరింత జాగ్రత్తగా

వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…

25 minutes ago

సందీప్ వంగ ప్రభావం ఆ స్థాయిలో ఉంది

తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…

1 hour ago

పులివెందుల టికెట్ వదులుకుంటారా జగన్ సార్?

ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణ‌యాలు.. చేసే ప్ర‌క‌ట‌నల విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. స‌మ‌యం వ‌చ్చింద‌నో.. సంద‌ర్భం చిక్కింద‌నో…

2 hours ago

బ్యాలెట్ పోరుపై వైసీపీ ఆశ‌లు ఫ‌లించేనా…?

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న స్థానిక ఎన్నిక‌ల‌ను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి ఎన్నిక‌ల సంఘం కూడా…

3 hours ago

కొండా ఫ్యామిలీ ప్లాన్-బీ ఏంటో తెలియట్లేదు

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…

3 hours ago

రీల్స్ కోసం రెండు చేతులు పోగొట్టుకుంది

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్‌లో రీల్ తీసుకునేందుకు…

4 hours ago