Political News

మ‌రో 15 మందిపై బీజేపీ క‌న్ను

తెలంగాణ బీజేపీ మ‌రో 15 మంది కీల‌క నేత‌ల‌పై క‌న్నేసిందా? వారిని కూడా త్వ‌ర‌లోనే పార్టీలోకి ఆహ్వానిం చనుందా? వారుకూడా సిట్టింగు ఎమ్మెల్యేలేనా? అంటే.. ఔన‌నే అంటున్నారు పార్టీ చీఫ్ బండి సంజ‌య్. దీనికి సంబంధించి తాజాగా ఆయ‌న‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఇంకా చాలా ఉప ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. తమతో 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని.. చెప్పారు.

అధికార టీఆర్ ఎస్‌ నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని తెలిపారు. భువనగిరి పట్టణంలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ఎమ్మెల్యేల జంపింగుల‌పై మాట్లాడారు. రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచామని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఎన్నికలని వ్యాఖ్యానించారు.

త్వ‌ర‌లోనే అది కూడా ఏడాదిలోనే రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బండి పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా సందర్భాల్లో మోడీ పథకాలను ప్రశంసించారని ఆయన తెలిపారు. పార్టీలో చేరే వారికి సముచిత గౌరవం ఉంటుందని తెలిపారు. టికెట్ల విషయంలో ఎవరికీ హామీ ఉండదన్నారు. పార్టీ నిర్ణయమే ఫైనల్ అని, కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా సందర్భాల్లో బీజేపీ పథకాలను ప్రశంసించారని చెప్పారు.

ఎన్నికల వరకు తన ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని బండి స్పష్టం చేశారు. మధ్యలో ఆపే ప్రసక్తే లేదన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే యాత్ర ముఖ్య ఉద్దేశమని.. వాటినే తమ మేనిఫెస్టోలో పెడతామని పేర్కొన్నారు. పార్టీలో అందరికీ సముచిత గౌరవం ఉంటుందన్నారు.  తమ ప్రభుత్వంలో జర్నలిస్టులకు రైల్వే పాసులు, ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. పాత్రికేయులను ఆదుకునే బాధ్యత తమదే అని.. ఆయు ష్మాన్ భారత్లో జర్నలిస్టులను చేర్చే విషయం చర్చిస్తానని చెప్పారు.

This post was last modified on August 4, 2022 11:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago