Political News

ఆ రెండు ఖాళీల్లో ఒకటి ఆయనకు జగన్ ఇస్తారా?

అనిశ్చితికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది రాజకీయాలు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఈ రంగంలో కనిపిస్తుంది. అన్నింటికి మించి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయంలో కానీ.. పదవుల ఎంపికలోనూ కొన్నిసార్లు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీటిలో లాభపడే వారు కొందరుంటే.. నష్టపోయే వారు మరికొందరు ఉంటారు. ఇప్పుడు అలాంటి లక్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఒకప్పుడు చంద్రబాబుకు వీరవిధేయుడిగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఇటీవల ఏపీకి చెందిన ఇద్దరు మంత్రులు (పిల్లి, మోపిదేవి) రాజ్యసభకు ఎంపిక కావటంతో.. వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి. దీంతో.. ఖాళీ అయ్యే రెండు స్థానాల్ని బీసీలకే కట్టబెడతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇలాంటివేళ.. తెర మీదకు అనూహ్యంగా ఉమ్మారెడ్డి పేరు వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి స్థానంలో అదే జిల్లాకు చెందిన ఉమ్మారెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీలో సీనియర్ నేతగా..అనుభవం ఉన్నఆయనకు మంత్రి పదవి ఇస్తే.. పార్టీలో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరన్న మాట వినిపిస్తోంది.

దీనికి తోడు.. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమ్మారెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా.. ఆ సామాజిక వర్గానికి జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసినట్లు అవుతుందని చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన మంత్రి పదవిని ఉమ్మారెడ్డికి ఇస్తే.. ఎవరూ ఏమీ అనుకోరన్న మాట వినిపిస్తోంది. గడిచిన కొంతకాలంగా తన రాజకీయ జీవితంలో భారీ ఎదురు దెబ్బలు తిన్న ఉమ్మారెడ్డికి మంత్రి పదవి కానీ దక్కితే.. అదో ఆసక్తికర పరిణామంగా చెప్పక తప్పదు. మరి.. జగన్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 2, 2020 10:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago