గత కొద్దికాలంగా ఏపీలో అధికారంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు హాట్ హాట్గా మారుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఆ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనదైన దూకుడు నిర్ణయాలతో వైసీపీ అధిష్టానానికి చుక్కలు చూపిస్తుండగా మరోవైపు వైసీపీ ముఖ్యనేత, పార్టీలో నంబర్2 అనే పేరున్న ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ రథసారథి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో పరిస్థితులు మారిపోయాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇలాంటి తరుణంలో వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. అది
విజయసాయిరెడ్డికి తీపికబురు కావడం గమనార్హం.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి కీలక పత్రికా ప్రకటన వెలువడింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకొని జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు నేతలకు అప్పగించారని పేర్కొంది.
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఇంచార్జీగా ఉంటారని పేర్కొంది. వైవీ సుబ్బారెడ్డి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలను, సజ్జల రామకృష్ణారెడ్డి కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని ప్రకటన పేర్కొంది.
కాగా, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు విజయసాయిరెడ్డికి మధ్య పొసగడం లేదనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలోపలు సంఘటనలు తెరమీదకు వచ్చాయి. కాగా, ఈ ప్రచారానికి చెక్ పెట్టేలా పార్టీకి కీలకమైన ఉత్తరాంధ్ర, అందులోనూ ప్రతిపాదిత పరిపాలన రాజధాని కొలువుదీరిన విశాఖపట్నం జిల్లాల బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించడం సీఎం జగన్ వద్ద ఆయనకు ఉన్న పట్టును స్పష్టం చేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. పైగా విజయసాయిరెడ్డి పుట్టిన రోజే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం బర్త్డే గిఫ్ట్ అని పేర్కొంటున్నారు.
This post was last modified on July 3, 2020 11:57 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…