Political News

చైనాకు ఇండియా మరో షాక్

మన వేలితే మన కంటినే పొడిచే రకం చైనా. ఆ దేశానికి ప్రపంచంలో అత్యధిక ఆధాయం అందించే దేశం ఇండియానే. ఐతే ఆ ఆదాయంతోనే పాకిస్థాన్‌కు సాయం చేస్తుంది. మనపై దండయాత్ర చేస్తుంది. మన సరిహద్దుల్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది. ఐతే ఇది ఎప్పట్నుంచో జరుగుతున్న వ్యవహారమే అయినా.. ఆ దేశ బలం, దానితో దౌత్య సంబంధాలు, వాణిజ్య పరంగా పరస్పరం ఆధారపడి ఉండటం లాంటి కారణాలతో భారత్ ఏ చర్యలూ చేపట్టేది కాదు.

కానీ ఇటీవల గాల్వాన్ లోయలో చైనా దుందుడుకు చర్యల కారణంగా 21 మంది సైనికుల ప్రాణాలు పోవడంతో భారత్ ఇక ఎంతమాత్రం ఆ దేశాన్ని ఉపేక్షించూడదని నిర్ణయించుకున్నట్లే ఉంది. క్రమంగా ఆ దేశంతో అన్ని సంబంధాలూ తెంచుకునే దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే 59 చైనా యాప్‌లను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం.

మరోవైపు ఇండియాలో చైనా పెట్టుబడులు తగ్గించే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఇండియాలో ఇకపై రోడ్ల నిర్మాణంలో చైనా భాగస్వామ్యం లేకుండా చూడాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్ణయించారు. జాయింట్ వెంచర్లతో పాటు రహదారి నిర్మాణాలు వేటిలోనూ చైనా కంపెనీలను, పెట్టుబడులను అనుమతించకూడదని సంబంధిత శాఖకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

‘‘చైనా భాగస్వామ్యంతో ఉన్న జాయింట్ వెంచర్లు భారత్‌లో రహదారుల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు అనుమతించం. చైనా కంపెనీల్ని నిషేధిస్తూ.. మన దేశ కంపెనీలు మాత్రమే వీటిలో పాలుపంచుకునేలా త్వరలోనే ఓ విధానాన్ని తీసుకొస్తున్నాం. భవిష్యత్తులోనూ టెండర్లలో చైనా కంపెనీలకు అవకాశమే లేకుండా చూస్తాం. టెక్నాలజీ, రీసెర్చ్ సంబంధిత ఎంఎస్ఎంఈల్లో విదేశీ కంపెనీలను జాయింట్ వెంచర్లను అనుమతిస్తాం. కానీ చైనా కంపెనీలకు మాత్రం అవకాశం లేదు’’ అని గడ్కరీ స్పష్టం చేశారు.

This post was last modified on July 2, 2020 9:32 am

Share
Show comments
Published by
Satya
Tags: ChinaIndia

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

1 hour ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

1 hour ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago