మన వేలితే మన కంటినే పొడిచే రకం చైనా. ఆ దేశానికి ప్రపంచంలో అత్యధిక ఆధాయం అందించే దేశం ఇండియానే. ఐతే ఆ ఆదాయంతోనే పాకిస్థాన్కు సాయం చేస్తుంది. మనపై దండయాత్ర చేస్తుంది. మన సరిహద్దుల్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది. ఐతే ఇది ఎప్పట్నుంచో జరుగుతున్న వ్యవహారమే అయినా.. ఆ దేశ బలం, దానితో దౌత్య సంబంధాలు, వాణిజ్య పరంగా పరస్పరం ఆధారపడి ఉండటం లాంటి కారణాలతో భారత్ ఏ చర్యలూ చేపట్టేది కాదు.
కానీ ఇటీవల గాల్వాన్ లోయలో చైనా దుందుడుకు చర్యల కారణంగా 21 మంది సైనికుల ప్రాణాలు పోవడంతో భారత్ ఇక ఎంతమాత్రం ఆ దేశాన్ని ఉపేక్షించూడదని నిర్ణయించుకున్నట్లే ఉంది. క్రమంగా ఆ దేశంతో అన్ని సంబంధాలూ తెంచుకునే దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే 59 చైనా యాప్లను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం.
మరోవైపు ఇండియాలో చైనా పెట్టుబడులు తగ్గించే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఇండియాలో ఇకపై రోడ్ల నిర్మాణంలో చైనా భాగస్వామ్యం లేకుండా చూడాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్ణయించారు. జాయింట్ వెంచర్లతో పాటు రహదారి నిర్మాణాలు వేటిలోనూ చైనా కంపెనీలను, పెట్టుబడులను అనుమతించకూడదని సంబంధిత శాఖకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
‘‘చైనా భాగస్వామ్యంతో ఉన్న జాయింట్ వెంచర్లు భారత్లో రహదారుల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు అనుమతించం. చైనా కంపెనీల్ని నిషేధిస్తూ.. మన దేశ కంపెనీలు మాత్రమే వీటిలో పాలుపంచుకునేలా త్వరలోనే ఓ విధానాన్ని తీసుకొస్తున్నాం. భవిష్యత్తులోనూ టెండర్లలో చైనా కంపెనీలకు అవకాశమే లేకుండా చూస్తాం. టెక్నాలజీ, రీసెర్చ్ సంబంధిత ఎంఎస్ఎంఈల్లో విదేశీ కంపెనీలను జాయింట్ వెంచర్లను అనుమతిస్తాం. కానీ చైనా కంపెనీలకు మాత్రం అవకాశం లేదు’’ అని గడ్కరీ స్పష్టం చేశారు.
This post was last modified on July 2, 2020 9:32 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…