Political News

మోడీకి భ‌య‌ప‌డ్డ శివ‌సేన‌? ఉద్ధ‌వ్ యూట‌ర్న్‌.. ముర్ముకు మ‌ద్ద‌తు!

మ‌హారాష్ట్ర రాజ‌కీయం మ‌రోసారి సంచ‌ల‌నంగా మారింది. ఇక్క‌డి ఉద్ద‌వ్ ఠాక్రేను బీజేపీ ప‌డ‌గొట్టిన విష‌యం తెలిసిందే. స్వ‌యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, అమిత్ షాల సూచ‌న‌ల‌తోనే తాము రెబ‌ల్‌గా మారామంటూ.. ఏక్‌నాథ్ షిండే ప్ర‌క‌టించిన విష‌యం సంచ‌లనంగా మారిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే.. అదే ఉద్ద‌వ్ ఠాక్రే.. ఇప్పుడు అదే బీజేపీకి స‌న్నిహితుడు కావ‌డ‌మే ఇప్పుడు మ‌రో ట్విస్ట్. నిన్న‌గాక మొన్న త‌న నిండు ప్ర‌భుత్వాన్ని ప‌డగొట్టిన బీజేపీతో చేతులు క‌లిపేందుకు ఉద్ద‌వ్ రెడీ అయ్యారు. బీజేపీ నిల‌బెట్టిన రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

దీంతో మ‌హారాష్ట్ర‌లో ఉద్ద‌వ్ సేన‌.. మోడీ భ‌య‌ప‌డుతోంద‌నే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అంశంపై ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని శివసేన కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకు మద్దతు ఇవ్వాలని తనపై ఎలాంటి ఒత్తిడి రాలేదని.. తన పార్టీ ఎంపీలతో నిన్న మాతోశ్రీలో జరిగిన సమావేశంలోనూ వారెలాంటి ఒత్తిడి చేయలేదని స్పష్టంచేశారు.

రాష్ట్రపతి పదవికి దేశంలోనే తొలిసారి ఒక ఆదివాసీ మహిళకు అవకాశం వచ్చిందని తన పార్టీలోని ఆదివాసీ నేతలు తనతో అన్నారని ఉద్ధవ్‌ తెలిపారు. వాస్తవానికి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీయే నిలబెట్టిన ద్రౌపదీ ముర్మూకు తాము మద్దతు ఇవ్వాల్సి ఉండేది కాదని.. కానీ తమది అంత సంకుచిత మనస్తత్వం కాదని వ్యాఖ్యానించారు. ఉద్ధవ్‌ఠాక్రే ప్రైవేటు నివాసం మాతోశ్రీలో పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ద్రౌపదికే మద్దతు ఇవ్వాలని ఎక్కువ మంది సభ్యులు కోరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల్లో తన నిర్ణయం వెల్లడిస్తానని తెలిపిన ఉద్ధవ్‌ ఠాక్రే.. శివసేన మద్దతు ద్రౌపదీ ముర్మూకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. శివసేనకు లోక్‌సభలో మొత్తంగా 18మంది ఎంపీలు ఉండగా.. వీరిలో 15మంది ఎంపీలు సమావేశానికి నేరుగా హాజరయ్యారు. అయితే, వారంతా ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని ఠాక్రేను కోరినట్టు ఆ పార్టీ ఎంపీ గజానన్‌ కిరీట్కర్ వెల్లడించారు. ద్రౌపది ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన వారు.. పైగా ఓ మహిళ కావడంతో ఆమెకే మద్దతు ఇవ్వాలని వారంతా అభిప్రాయపడినట్టు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర జనాభాలో దాదాపు 10శాతం ఆదివాసీలు ఉన్నారు. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ద్రౌపదీ ముర్మూ.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

This post was last modified on July 12, 2022 9:29 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

హీరామండి రిపోర్ట్ ఏంటి

మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…

1 hour ago

జ్యోతికృష్ణ గెలవాల్సిన సవాల్ పెద్దదే

ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…

1 hour ago

హాట్ టాపిక్‌గా చంద్ర‌బాబు ‘టోపీ’.. ఏంటిది?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అటు…

2 hours ago

ఇక్కడే చస్తానంటున్న బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…

3 hours ago

ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని ఆగుతున్నాం: బొత్స

ఏపీ అధికార పార్టీ వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని…

4 hours ago

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

13 hours ago