Political News

ఒక్క చోట నుండే పోటీ

రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని అనుకుంటున్న వాళ్ళకు కేంద్ర ఎన్నికల కమిషన్ చెక్ పెట్టబోతోంది. వచ్చే ఎన్నికల నుంచి ఒక అభ్యర్ధి ఒక నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయాలనే నిబంధనను మళ్ళీ తెరపైకి తెచ్చింది. ఈ మేరకు చట్టంలో మార్పులు తేవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ సూచించింది. గతంలో కూడా ఇలాంటి నిబంధనను కమిషన్ సిఫారసు చేసినా అప్పట్లో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు.

షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంతకాలం మరుగునపడిన నిబంధన మళ్ళీ ఇపుడు తెరపైకి వచ్చింది. రెండు చోట్ల నుండి పోటీ చేసి గెలిచిన అభ్యర్ధి ఒక నియోజకవర్గానికి రాజీనామా చేస్తారు. అప్పుడు రాజీనామా చేసిన అభ్యర్ధే మొత్తం ఉపఎన్నికల ఖర్చును భరించేందుకు సిద్ధపడితే మాత్రమే రెండుచోట్ల పోటీకి అనుమతివ్వాలనే నిబంధనకు సవరణను కూడా కమీషన్ ప్రతిపాదించింది.

మామూలుగా అయితే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు చాలా తక్కువగా ఉంటారు. అప్పుడెప్పుడో ఎన్టీయార్ మూడు నియోజకవర్గాల్లో తర్వాత రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఆ తర్వాత చాలాకాలానికి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రెండు చోట్ల పోటీ చేశారు. అయితే చిరంజీవి ఒక నియోజకవర్గంలో ఓడిపోయారు కాబట్టి రాజీనామా, ఉపఎన్నిక అవసరంలే రాలేదు. మొన్నటి ఎన్నికలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు.

అయితే పవన్ రెండు చోట్లా ఓడిపోవటంతో అసలు ఎలాంటి సమస్యా తలెత్తలేదు. అయినా వచ్చే ఎన్నికల్లో ఎవరైనా రెండు చోట్లా పోటీ చేసే అవకాశమైతే ఉంది. దాన్ని నివారించేందుకే కేంద్ర ఎన్నికల కమీషన్ ముందు జాగ్రత్తగా నిబంధనల్లో మార్పులు చేయాలని సూచించింది. మార్పులు చేయటం సాధ్యం కాకపోతే కనీసం సవరణ అయినా చేయాలని సూచించింది. ఉపఎన్నిక ఖర్చును మొత్తం రాజీనామా చేసిన సదరు అభ్యర్ధే పెట్టుకోవాలంటే కష్టమే. అందుకనే రెండు నియోజకవర్గాల్లో పోటీకి వెనకాడే అవకాశాలు ఎక్కువగా ఉంది. మరీ నిబంధన, దానికి సవరణలో కేంద్ర ప్రభుత్వం దేన్ని ఎంచుకుంటుందో చూడాలి.

This post was last modified on June 18, 2022 12:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నో ట్విస్టులతో… డ్రీమ్ లవ్ స్టోరీకి బ్రేకప్

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…

3 hours ago

లేటు వయసులో అదరగొడుతున్న అక్షయ్

మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…

3 hours ago

కోహ్లీ 100 సెంచరీలు: సచిన్ రికార్డు సాధ్యమేనా?

సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…

5 hours ago

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…

5 hours ago

కొత్త ప్రభాస్‌… వంగ టచ్ కనిపిస్తోంది

‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…

5 hours ago

అమెరికాలో లోకేష్ ను ఆపిన పోలీసులు…

తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…

6 hours ago