రేషనలైజేషన్ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 18 వేల పోస్టులకు పైగా తొలగిస్తుందని తెలుస్తోంది. రానున్న కాలానా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ ) అప్లై చేయనున్నందున ఈ చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. ఈ విధానంలో భాగంగా ఒకటి నుంచి ఎనిమిది తరగతులకు ఇంగ్లీషు మీడియం మాత్రమే ఉంచి, తొమ్మిది, పది తరగతులకు ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాల్లో బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు మాధ్యమాల్లోనూ పాఠాలు బోధించేందుకు అనుమతి ఇవ్వాలని, లేదంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బంది పడతారని ఓ వైపు ఉపాధ్యాయ సంఘాలతో పాటు తల్లిదండ్రులు పట్టుపడుతుంటే ఇవేవీ వినిపించుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో కాలం వెచ్చిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.
వాస్తవానికి ఎక్కడ చూసినా సబ్జెక్ట్ టీచర్ల కొరతే ఉన్నది. పదిహేడు వందలకు పైగా పోస్టులు సబ్జెక్టు టీచర్లవే భర్తీ చేయాల్సి ఉంది. మెగా డీఎస్సీ లేని కారణంగా సిబ్బంది కొరత వేధిస్తోంది. మొన్నటి టెన్త్ ఫలితాల్లో కూడా సబ్జెక్ట్ టీచర్లు లేని కారణంగానే ఇబ్బందులు తలెత్తి ఫలితాలు పూర్తిగా నిరాశాజనకంగా ఉన్నాయి అని తేలింది. దీంతో పాటు ఉద్యోగ విరమణ, కోవిడ్ తో సహా ఇతర మరణాల తదితర కారణాల రీత్యా వెయ్యికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించకుండా, కేవలం బడులకు హంగులు చేకూర్చాం అని చెప్పడం అస్సలు భావ్యంగా లేదని ఉపాధ్యాయ లోకం గగ్గోలు పెడుతోంది.
ముఖ్యంగా లాంగ్వేజ్ టీచర్ల కన్నా సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉండడమే కాకుండా ఉపాధ్యాయులకు ఈ ప్రభుత్వం బోధనేతర పనులు విపరీతంగా అప్పగిస్తోందని కూడా తెలుస్తోంది. ఇది కూడా ఓ విధంగా నిరాశజనక ఫలితాలకు కారణం అయి ఉంది. ఇప్పుడు తాము ఉద్యమ బాట పట్టకుంటే పోస్టుల భర్తీలో ఆలస్య అన్నది కొనసాగుతూనే ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
This post was last modified on June 14, 2022 3:40 pm
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…