రేషనలైజేషన్ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 18 వేల పోస్టులకు పైగా తొలగిస్తుందని తెలుస్తోంది. రానున్న కాలానా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ ) అప్లై చేయనున్నందున ఈ చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. ఈ విధానంలో భాగంగా ఒకటి నుంచి ఎనిమిది తరగతులకు ఇంగ్లీషు మీడియం మాత్రమే ఉంచి, తొమ్మిది, పది తరగతులకు ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాల్లో బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు మాధ్యమాల్లోనూ పాఠాలు బోధించేందుకు అనుమతి ఇవ్వాలని, లేదంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బంది పడతారని ఓ వైపు ఉపాధ్యాయ సంఘాలతో పాటు తల్లిదండ్రులు పట్టుపడుతుంటే ఇవేవీ వినిపించుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో కాలం వెచ్చిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.
వాస్తవానికి ఎక్కడ చూసినా సబ్జెక్ట్ టీచర్ల కొరతే ఉన్నది. పదిహేడు వందలకు పైగా పోస్టులు సబ్జెక్టు టీచర్లవే భర్తీ చేయాల్సి ఉంది. మెగా డీఎస్సీ లేని కారణంగా సిబ్బంది కొరత వేధిస్తోంది. మొన్నటి టెన్త్ ఫలితాల్లో కూడా సబ్జెక్ట్ టీచర్లు లేని కారణంగానే ఇబ్బందులు తలెత్తి ఫలితాలు పూర్తిగా నిరాశాజనకంగా ఉన్నాయి అని తేలింది. దీంతో పాటు ఉద్యోగ విరమణ, కోవిడ్ తో సహా ఇతర మరణాల తదితర కారణాల రీత్యా వెయ్యికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించకుండా, కేవలం బడులకు హంగులు చేకూర్చాం అని చెప్పడం అస్సలు భావ్యంగా లేదని ఉపాధ్యాయ లోకం గగ్గోలు పెడుతోంది.
ముఖ్యంగా లాంగ్వేజ్ టీచర్ల కన్నా సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉండడమే కాకుండా ఉపాధ్యాయులకు ఈ ప్రభుత్వం బోధనేతర పనులు విపరీతంగా అప్పగిస్తోందని కూడా తెలుస్తోంది. ఇది కూడా ఓ విధంగా నిరాశజనక ఫలితాలకు కారణం అయి ఉంది. ఇప్పుడు తాము ఉద్యమ బాట పట్టకుంటే పోస్టుల భర్తీలో ఆలస్య అన్నది కొనసాగుతూనే ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
This post was last modified on June 14, 2022 3:40 pm
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…
కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…
అసలే వేసవి కాలం.. సాధారణ ఇళ్లలో ఫాన్లు.. మధ్యతరగతి ఇళ్లలో కూలర్లు, ఆపై తరగతుల ఇళ్లలో ఏసీలు కనీసంలో కనీసం…