రేషనలైజేషన్ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 18 వేల పోస్టులకు పైగా తొలగిస్తుందని తెలుస్తోంది. రానున్న కాలానా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ ) అప్లై చేయనున్నందున ఈ చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. ఈ విధానంలో భాగంగా ఒకటి నుంచి ఎనిమిది తరగతులకు ఇంగ్లీషు మీడియం మాత్రమే ఉంచి, తొమ్మిది, పది తరగతులకు ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాల్లో బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు మాధ్యమాల్లోనూ పాఠాలు బోధించేందుకు అనుమతి ఇవ్వాలని, లేదంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బంది పడతారని ఓ వైపు ఉపాధ్యాయ సంఘాలతో పాటు తల్లిదండ్రులు పట్టుపడుతుంటే ఇవేవీ వినిపించుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో కాలం వెచ్చిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.
వాస్తవానికి ఎక్కడ చూసినా సబ్జెక్ట్ టీచర్ల కొరతే ఉన్నది. పదిహేడు వందలకు పైగా పోస్టులు సబ్జెక్టు టీచర్లవే భర్తీ చేయాల్సి ఉంది. మెగా డీఎస్సీ లేని కారణంగా సిబ్బంది కొరత వేధిస్తోంది. మొన్నటి టెన్త్ ఫలితాల్లో కూడా సబ్జెక్ట్ టీచర్లు లేని కారణంగానే ఇబ్బందులు తలెత్తి ఫలితాలు పూర్తిగా నిరాశాజనకంగా ఉన్నాయి అని తేలింది. దీంతో పాటు ఉద్యోగ విరమణ, కోవిడ్ తో సహా ఇతర మరణాల తదితర కారణాల రీత్యా వెయ్యికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించకుండా, కేవలం బడులకు హంగులు చేకూర్చాం అని చెప్పడం అస్సలు భావ్యంగా లేదని ఉపాధ్యాయ లోకం గగ్గోలు పెడుతోంది.
ముఖ్యంగా లాంగ్వేజ్ టీచర్ల కన్నా సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉండడమే కాకుండా ఉపాధ్యాయులకు ఈ ప్రభుత్వం బోధనేతర పనులు విపరీతంగా అప్పగిస్తోందని కూడా తెలుస్తోంది. ఇది కూడా ఓ విధంగా నిరాశజనక ఫలితాలకు కారణం అయి ఉంది. ఇప్పుడు తాము ఉద్యమ బాట పట్టకుంటే పోస్టుల భర్తీలో ఆలస్య అన్నది కొనసాగుతూనే ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
This post was last modified on June 14, 2022 3:40 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…