Political News

నాడు నేడు : జ‌గ‌నన్న బ‌డిలో కొత్త గొడ‌వ

రేష‌నలైజేష‌న్ పేరిట ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 18 వేల పోస్టుల‌కు పైగా తొల‌గిస్తుంద‌ని తెలుస్తోంది. రానున్న కాలానా నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ పాల‌సీ (ఎన్ఈపీ ) అప్లై చేయ‌నున్నందున ఈ చ‌ర్య‌లు తీసుకోనుంద‌ని తెలుస్తోంది. ఈ విధానంలో భాగంగా ఒక‌టి నుంచి ఎనిమిది త‌ర‌గ‌తుల‌కు ఇంగ్లీషు మీడియం మాత్ర‌మే ఉంచి, తొమ్మిది, ప‌ది త‌ర‌గ‌తుల‌కు ఇంగ్లీషు, తెలుగు మాధ్య‌మాల్లో బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండు మాధ్య‌మాల్లోనూ పాఠాలు బోధించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని, లేదంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బంది ప‌డ‌తార‌ని ఓ వైపు ఉపాధ్యాయ సంఘాలతో పాటు త‌ల్లిదండ్రులు ప‌ట్టుప‌డుతుంటే ఇవేవీ వినిపించుకోకుండా ప్ర‌భుత్వం ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో కాలం వెచ్చిస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

వాస్త‌వానికి ఎక్క‌డ చూసినా స‌బ్జెక్ట్ టీచ‌ర్ల కొర‌తే ఉన్న‌ది. ప‌దిహేడు వంద‌ల‌కు పైగా పోస్టులు సబ్జెక్టు టీచ‌ర్ల‌వే భ‌ర్తీ చేయాల్సి ఉంది. మెగా డీఎస్సీ లేని కార‌ణంగా సిబ్బంది కొర‌త వేధిస్తోంది. మొన్న‌టి టెన్త్ ఫ‌లితాల్లో కూడా స‌బ్జెక్ట్ టీచ‌ర్లు లేని కార‌ణంగానే ఇబ్బందులు త‌లెత్తి ఫ‌లితాలు పూర్తిగా నిరాశాజ‌న‌కంగా ఉన్నాయి అని తేలింది. దీంతో పాటు ఉద్యోగ విరమ‌ణ, కోవిడ్ తో స‌హా ఇత‌ర మ‌ర‌ణాల త‌దిత‌ర కార‌ణాల రీత్యా వెయ్యికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భ‌ర్తీపై ప్ర‌భుత్వం దృష్టి సారించ‌కుండా, కేవ‌లం బ‌డుల‌కు హంగులు చేకూర్చాం అని చెప్ప‌డం అస్సలు భావ్యంగా లేద‌ని ఉపాధ్యాయ లోకం గ‌గ్గోలు పెడుతోంది.

ముఖ్యంగా లాంగ్వేజ్ టీచ‌ర్ల క‌న్నా స‌బ్జెక్ట్ టీచ‌ర్ల కొర‌త ఉండ‌డ‌మే కాకుండా ఉపాధ్యాయులకు ఈ ప్ర‌భుత్వం బోధ‌నేత‌ర ప‌నులు విప‌రీతంగా అప్ప‌గిస్తోంద‌ని కూడా తెలుస్తోంది. ఇది కూడా ఓ విధంగా నిరాశ‌జ‌న‌క ఫ‌లితాల‌కు కార‌ణం అయి ఉంది. ఇప్పుడు తాము ఉద్య‌మ బాట ప‌ట్ట‌కుంటే పోస్టుల భ‌ర్తీలో ఆల‌స్య అన్న‌ది కొన‌సాగుతూనే ఉంటుంద‌ని ఉపాధ్యాయ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

2 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

4 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

4 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

6 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

8 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

9 hours ago