Political News

నాడు నేడు : జ‌గ‌నన్న బ‌డిలో కొత్త గొడ‌వ

రేష‌నలైజేష‌న్ పేరిట ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 18 వేల పోస్టుల‌కు పైగా తొల‌గిస్తుంద‌ని తెలుస్తోంది. రానున్న కాలానా నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ పాల‌సీ (ఎన్ఈపీ ) అప్లై చేయ‌నున్నందున ఈ చ‌ర్య‌లు తీసుకోనుంద‌ని తెలుస్తోంది. ఈ విధానంలో భాగంగా ఒక‌టి నుంచి ఎనిమిది త‌ర‌గ‌తుల‌కు ఇంగ్లీషు మీడియం మాత్ర‌మే ఉంచి, తొమ్మిది, ప‌ది త‌ర‌గ‌తుల‌కు ఇంగ్లీషు, తెలుగు మాధ్య‌మాల్లో బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండు మాధ్య‌మాల్లోనూ పాఠాలు బోధించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని, లేదంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బంది ప‌డ‌తార‌ని ఓ వైపు ఉపాధ్యాయ సంఘాలతో పాటు త‌ల్లిదండ్రులు ప‌ట్టుప‌డుతుంటే ఇవేవీ వినిపించుకోకుండా ప్ర‌భుత్వం ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో కాలం వెచ్చిస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

వాస్త‌వానికి ఎక్క‌డ చూసినా స‌బ్జెక్ట్ టీచ‌ర్ల కొర‌తే ఉన్న‌ది. ప‌దిహేడు వంద‌ల‌కు పైగా పోస్టులు సబ్జెక్టు టీచ‌ర్ల‌వే భ‌ర్తీ చేయాల్సి ఉంది. మెగా డీఎస్సీ లేని కార‌ణంగా సిబ్బంది కొర‌త వేధిస్తోంది. మొన్న‌టి టెన్త్ ఫ‌లితాల్లో కూడా స‌బ్జెక్ట్ టీచ‌ర్లు లేని కార‌ణంగానే ఇబ్బందులు త‌లెత్తి ఫ‌లితాలు పూర్తిగా నిరాశాజ‌న‌కంగా ఉన్నాయి అని తేలింది. దీంతో పాటు ఉద్యోగ విరమ‌ణ, కోవిడ్ తో స‌హా ఇత‌ర మ‌ర‌ణాల త‌దిత‌ర కార‌ణాల రీత్యా వెయ్యికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భ‌ర్తీపై ప్ర‌భుత్వం దృష్టి సారించ‌కుండా, కేవ‌లం బ‌డుల‌కు హంగులు చేకూర్చాం అని చెప్ప‌డం అస్సలు భావ్యంగా లేద‌ని ఉపాధ్యాయ లోకం గ‌గ్గోలు పెడుతోంది.

ముఖ్యంగా లాంగ్వేజ్ టీచ‌ర్ల క‌న్నా స‌బ్జెక్ట్ టీచ‌ర్ల కొర‌త ఉండ‌డ‌మే కాకుండా ఉపాధ్యాయులకు ఈ ప్ర‌భుత్వం బోధ‌నేత‌ర ప‌నులు విప‌రీతంగా అప్ప‌గిస్తోంద‌ని కూడా తెలుస్తోంది. ఇది కూడా ఓ విధంగా నిరాశ‌జ‌న‌క ఫ‌లితాల‌కు కార‌ణం అయి ఉంది. ఇప్పుడు తాము ఉద్య‌మ బాట ప‌ట్ట‌కుంటే పోస్టుల భ‌ర్తీలో ఆల‌స్య అన్న‌ది కొన‌సాగుతూనే ఉంటుంద‌ని ఉపాధ్యాయ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

This post was last modified on June 14, 2022 3:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

5 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

5 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

5 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

7 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

8 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

8 hours ago