Political News

అమిత్ షా ను ఎందుకు పక్కన పెట్టారు ?

రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయటానికి నరేంద్రమోడి ప్రయత్నాలను మొదలుపెట్టారు. తన ప్రయత్నాల్లో భాగంగానే ఎన్డీయే పార్టీలతోనే కాకుండా యూపీఏ బాగస్వామ్యపక్షాలు, నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలతో పాటు స్వతంత్ర ఎంపీలతో సంప్రదింపులు జరపాలని మోడి అనుకున్నారు. ఇందుకోసమని రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డాకు బాధ్యతలు అప్పగించారు. నిజానికి నాన్ ఎన్డీయే పార్టీలను మోడి ఆలోచనలకు అనుగుణంగా ఒప్పించేంత సీన్ వీళ్ళిద్దరికీ లేదు.

ఎందుకంటే మోడి మనసులో ఇప్పటికే కచ్చితంగా ఎవరో ఒక అభ్యర్ధి ఉండేవుంటారు. ఆ విషయం వీళ్ళద్దరికి తెలిసే అవకాశంలేదు. వీళ్ళద్దరు మోడి దూతలుగా ప్రతిపక్షాలతో సంప్రదింపులకు వెళ్ళినపుడు వాళ్ళు మోడి ప్రతిపాదించబోయే అభ్యర్ధి ఎవరని అడుగుతారు. దానికి సమాధానం వీళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి వీళ్ళు చెప్పిందానికి ప్రతిపక్షాల నేతలు అంగీకరించరు.

అయినా మోడి తరపున ఇన్ని సంవత్సరాలుగా అన్నీ వ్యవహరాలను చక్కబెడుతున్నది హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రమే. అలాంటిది ఇపుడు ఇంతటి కీలకమైన బాధ్యతలను అమిత్ షాకు కాకుండా రాజ్ నాద్+నడ్డాకు ఎందుకు అప్పగించినట్లు ? అమిత్ ఏదైనా మాట్లాడినా, హామీఇచ్చినా మోడియే మాట్లాడినట్లు, హామీలిచ్చినట్లే అనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో రాజ్ నాధ్, నడ్డాలు మాట్లాడితే మోడి దూతలుగానే చూస్తారు కానీ స్వయంగా మోడియే మాట్లాడుతున్నట్లు ఎవరు అనుకోరు.

అమిత్ ను ఎందుకు పక్కనపెట్టారంటే మోడి అంటేనే ప్రతిపక్షాలు మండిపోతున్నాయి. మోడి మీద ప్రతిపక్షాలకు ఎంతమంటున్నదో అమిత్ అన్నా అంతే మంటుంది. కాబట్టే రాష్ట్రపతి ఎన్నికలాంటి కీలకమైన సంప్రదింపుల ప్రక్రియనుండి అమిత్ ను మోడి దూరంపెట్టినట్లున్నారు. రాజ్ నాద్ సీనియరే కాకుండా సౌమ్యుడిగా పేరున్నది. ప్రతిపక్షాలు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రశాంత వాతావరణంలో చర్చలు జరిగే అవకాశముంది. వీళ్ళద్దరికీ బాధ్యతలు అప్పగించినంత మాత్రాన ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చేస్తాయని ఎవరు అనుకోవటంలేదు. మరి ద్విసభ్య కమిటి జరపబోయే సంప్రదింపులు ఎంతవరకు సాగుతాయో చూడాల్సిందే.

This post was last modified on June 13, 2022 3:10 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

10 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

10 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

12 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

13 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

17 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

19 hours ago