Political News

అమిత్ షా ను ఎందుకు పక్కన పెట్టారు ?

రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయటానికి నరేంద్రమోడి ప్రయత్నాలను మొదలుపెట్టారు. తన ప్రయత్నాల్లో భాగంగానే ఎన్డీయే పార్టీలతోనే కాకుండా యూపీఏ బాగస్వామ్యపక్షాలు, నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలతో పాటు స్వతంత్ర ఎంపీలతో సంప్రదింపులు జరపాలని మోడి అనుకున్నారు. ఇందుకోసమని రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డాకు బాధ్యతలు అప్పగించారు. నిజానికి నాన్ ఎన్డీయే పార్టీలను మోడి ఆలోచనలకు అనుగుణంగా ఒప్పించేంత సీన్ వీళ్ళిద్దరికీ లేదు.

ఎందుకంటే మోడి మనసులో ఇప్పటికే కచ్చితంగా ఎవరో ఒక అభ్యర్ధి ఉండేవుంటారు. ఆ విషయం వీళ్ళద్దరికి తెలిసే అవకాశంలేదు. వీళ్ళద్దరు మోడి దూతలుగా ప్రతిపక్షాలతో సంప్రదింపులకు వెళ్ళినపుడు వాళ్ళు మోడి ప్రతిపాదించబోయే అభ్యర్ధి ఎవరని అడుగుతారు. దానికి సమాధానం వీళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి వీళ్ళు చెప్పిందానికి ప్రతిపక్షాల నేతలు అంగీకరించరు.

అయినా మోడి తరపున ఇన్ని సంవత్సరాలుగా అన్నీ వ్యవహరాలను చక్కబెడుతున్నది హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రమే. అలాంటిది ఇపుడు ఇంతటి కీలకమైన బాధ్యతలను అమిత్ షాకు కాకుండా రాజ్ నాద్+నడ్డాకు ఎందుకు అప్పగించినట్లు ? అమిత్ ఏదైనా మాట్లాడినా, హామీఇచ్చినా మోడియే మాట్లాడినట్లు, హామీలిచ్చినట్లే అనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో రాజ్ నాధ్, నడ్డాలు మాట్లాడితే మోడి దూతలుగానే చూస్తారు కానీ స్వయంగా మోడియే మాట్లాడుతున్నట్లు ఎవరు అనుకోరు.

అమిత్ ను ఎందుకు పక్కనపెట్టారంటే మోడి అంటేనే ప్రతిపక్షాలు మండిపోతున్నాయి. మోడి మీద ప్రతిపక్షాలకు ఎంతమంటున్నదో అమిత్ అన్నా అంతే మంటుంది. కాబట్టే రాష్ట్రపతి ఎన్నికలాంటి కీలకమైన సంప్రదింపుల ప్రక్రియనుండి అమిత్ ను మోడి దూరంపెట్టినట్లున్నారు. రాజ్ నాద్ సీనియరే కాకుండా సౌమ్యుడిగా పేరున్నది. ప్రతిపక్షాలు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రశాంత వాతావరణంలో చర్చలు జరిగే అవకాశముంది. వీళ్ళద్దరికీ బాధ్యతలు అప్పగించినంత మాత్రాన ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చేస్తాయని ఎవరు అనుకోవటంలేదు. మరి ద్విసభ్య కమిటి జరపబోయే సంప్రదింపులు ఎంతవరకు సాగుతాయో చూడాల్సిందే.

This post was last modified on June 13, 2022 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago