Political News

అప్ప‌ట్లో బుద్దిలేక టీడీపీతో చేతులు క‌లిపాం: వీర్రాజు

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించిన రాజ‌కీయ పొత్తుల విషయంలో స్పష్టంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అయితే.. టీడీపీ, జనసేన కలుస్తాయా లేదా? అనేది మాత్రం పవన్‌నే అడగాలని చెప్పారు. కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ఉన్నాయ‌న్న సోము.. ఆ పార్టీల‌కు వ్య‌తిరేకంగానే తాము ప‌నిచేస్తున్నామ‌న్నారు.

ప్ర‌స్తుతం జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని వీర్రాజు స్పష్టం చేశారు. అయితే.. టీడీపీ, జనసేన కలుస్తాయా? లేదా? అనేది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌నే అడగాలని చెప్పారు. ఏలూరులో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. పొత్తులపై నంద్యాల జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ఆ విషయం ఆయన్నే అడగాలని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదని మ‌రోసారి స్పష్టం చేశారు.

“రాష్ట్రంలో ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే రాజ‌కీయాలు ఏవున్నాయి? ఉన్న రెండు పార్టీలు కుటుంబం కోసం ప‌నిచేస్తున్న పార్టీలే. ఆ పార్టీల నేత‌లు కుటుంబ స‌భ్యుల కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వారి ప్ర‌యోజ‌నాలే.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు. ప్ర‌జ‌ల కోసం ద‌శాబ్దాలుగా ప‌నిచేస్తున్న పార్టీ బీజేపీ. అలాంటి పార్టీ కుటుంబ పార్టీల‌తో ఎలా పొత్తు పెట్టుకుంటుంది?” అని ప్ర‌శ్నించారు. మ‌రి 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారుక‌దా? అని ప్ర‌శ్నిస్తే.. “నో కామెంట్‌. అది అప్ప‌ట్లో తీసుకున్న పొర‌పాటు నిర్ణ‌యం. బుద్ధి త‌క్కువై టీడీపీతో క‌లిసాం” అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

జ‌గ‌న్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం..

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామని.. సోము చెప్పారు. సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన బీఫార్మసీ యువతి మృతిపై.. ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్యారా విచారణ చేపట్టాలని డీజీపీ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ ఘటనలు జరిగిన సమయంలో పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది తప్ప.. శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న జ‌గ‌న్ ఒంటెత్తు పాల‌న‌పై.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామ‌ని వివ‌రించారు. అదేస‌మ‌యంలో తాము కూడా రాష్ట్రంలో పోరాటాల‌ను మ‌రింత ముమ్మ‌రం చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.

This post was last modified on May 9, 2022 7:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

5 minutes ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

3 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

4 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

6 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

6 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

6 hours ago