ఏపీలో మంత్రులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు.. వారు అనుసరిస్తున్న తీరుపై వారి వారి సామాజిక వర్గాలే ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.. టీటీడీ చైర్మన్ , వైసీపీ నాయకుడు.. వైవీ సుబ్బారెడ్డి ముందు.. మోకాళ్లపై మోకరిల్లి మరీ పాదనమస్కారాలు చేశారు. దీంతో ఆయన సామాజిక వర్గం శెట్టిబలిజ నాయకులు తీవ్రస్థాయిలో దీనిని ఖండించారు. మంత్రి మోకరిల్లడం ఎందుకు.. అవసరమైతే.. రాజీనామా చేయండి అని డిమాండ్లు చేస్తున్నారు.
ఇక, గత కేబినెట్లోనూ.. ప్రస్తుతం కూడా ఉన్న మంత్రి గుమ్మనూరు జయరామ్ కుమారుడిపై ఓ లగ్జరీ కారును బహుమానంగా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.. ఆధారాలతో సహా అప్పట్లో నిరూపించారు. దీనిపై ఎలాంటి విచారణకూ నోచుకోలేదు.
ఇక, ఇప్పుడు తాజాగా మంత్రి ఆదిమూలపు సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ ప్రకాశం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని.. మీరైనా న్యాయం చేయండంటూ ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ను వేడుకుంది.
మంత్రి ఆదిమూలపు సురేశ్ తన పొలం ఆక్రమించారని ఆరోపిస్తూ.. ప్రకాశం జిల్లా కలెక్టర్కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన రంగలక్ష్మమ్మ అనే మహిళ.. మంత్రి సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ దినేశ్ కుమార్కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా.. న్యాయం జరగలేదని మహిళ వాపోయింది. మీరైనా న్యాయం చేయండి అంటూ.. కలెక్టర్ను వేడుకుంది.
అయితే.. పోలీసులు జోక్యం చేసుకొని ఆమెను అక్కడి నుంచి బయటకు పంపించారు. “మీరంతా మంత్రికే కాపలా. అతని పక్షానే ఉన్నారు. మాకు న్యాయం చేసేవారు ఎవరూ లేరు” అంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. దీనిపై స్థానికులు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ప్రజలను పట్టించుకుని.. వారికి న్యాయం చేయాల్సిన మంత్రులే ఇలా కబ్జాలకు పాల్పడడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. మరి మంత్రి ఆదిమూలపు సురేశ్ దీనిపై ఏమంటారో చూడాలి. ఇన్ని జరుగుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం మౌనం వీడకపోవడం గమనార్హం.
This post was last modified on May 9, 2022 7:00 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను కస్టడీలో హింసించారని.. దీంతో తనకు…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…