ఏపీలో మంత్రులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు.. వారు అనుసరిస్తున్న తీరుపై వారి వారి సామాజిక వర్గాలే ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.. టీటీడీ చైర్మన్ , వైసీపీ నాయకుడు.. వైవీ సుబ్బారెడ్డి ముందు.. మోకాళ్లపై మోకరిల్లి మరీ పాదనమస్కారాలు చేశారు. దీంతో ఆయన సామాజిక వర్గం శెట్టిబలిజ నాయకులు తీవ్రస్థాయిలో దీనిని ఖండించారు. మంత్రి మోకరిల్లడం ఎందుకు.. అవసరమైతే.. రాజీనామా చేయండి అని డిమాండ్లు చేస్తున్నారు.
ఇక, గత కేబినెట్లోనూ.. ప్రస్తుతం కూడా ఉన్న మంత్రి గుమ్మనూరు జయరామ్ కుమారుడిపై ఓ లగ్జరీ కారును బహుమానంగా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.. ఆధారాలతో సహా అప్పట్లో నిరూపించారు. దీనిపై ఎలాంటి విచారణకూ నోచుకోలేదు.
ఇక, ఇప్పుడు తాజాగా మంత్రి ఆదిమూలపు సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ ప్రకాశం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని.. మీరైనా న్యాయం చేయండంటూ ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ను వేడుకుంది.
మంత్రి ఆదిమూలపు సురేశ్ తన పొలం ఆక్రమించారని ఆరోపిస్తూ.. ప్రకాశం జిల్లా కలెక్టర్కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన రంగలక్ష్మమ్మ అనే మహిళ.. మంత్రి సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ దినేశ్ కుమార్కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా.. న్యాయం జరగలేదని మహిళ వాపోయింది. మీరైనా న్యాయం చేయండి అంటూ.. కలెక్టర్ను వేడుకుంది.
అయితే.. పోలీసులు జోక్యం చేసుకొని ఆమెను అక్కడి నుంచి బయటకు పంపించారు. “మీరంతా మంత్రికే కాపలా. అతని పక్షానే ఉన్నారు. మాకు న్యాయం చేసేవారు ఎవరూ లేరు” అంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. దీనిపై స్థానికులు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ప్రజలను పట్టించుకుని.. వారికి న్యాయం చేయాల్సిన మంత్రులే ఇలా కబ్జాలకు పాల్పడడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. మరి మంత్రి ఆదిమూలపు సురేశ్ దీనిపై ఏమంటారో చూడాలి. ఇన్ని జరుగుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం మౌనం వీడకపోవడం గమనార్హం.
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…