Political News

ఏపీ మంత్రిపై భూక‌బ్జా ఆరోప‌ణ‌.. పోలీసుల‌కు ఫిర్యాదు

ఏపీలో మంత్రుల‌పై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఒక‌వైపు.. వారు అనుస‌రిస్తున్న తీరుపై వారి వారి సామాజిక వ‌ర్గాలే ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ‌.. టీటీడీ చైర్మ‌న్ , వైసీపీ నాయ‌కుడు.. వైవీ సుబ్బారెడ్డి ముందు.. మోకాళ్ల‌పై మోక‌రిల్లి మ‌రీ పాదన‌మ‌స్కారాలు చేశారు. దీంతో ఆయ‌న సామాజిక వ‌ర్గం శెట్టిబ‌లిజ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో దీనిని ఖండించారు. మంత్రి మోక‌రిల్ల‌డం ఎందుకు.. అవ‌స‌ర‌మైతే.. రాజీనామా చేయండి అని డిమాండ్లు చేస్తున్నారు.

ఇక‌, గ‌త కేబినెట్‌లోనూ.. ప్ర‌స్తుతం కూడా ఉన్న మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రామ్ కుమారుడిపై ఓ ల‌గ్జ‌రీ కారును బ‌హుమానంగా తీసుకున్నారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై టీడీపీ మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు.. ఆధారాల‌తో స‌హా అప్ప‌ట్లో నిరూపించారు. దీనిపై ఎలాంటి విచార‌ణ‌కూ నోచుకోలేదు.

ఇక‌, ఇప్పుడు తాజాగా మంత్రి ఆదిమూల‌పు సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ ప్రకాశం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని.. మీరైనా న్యాయం చేయండంటూ ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్‌ను వేడుకుంది.

మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తన పొలం ఆక్రమించారని ఆరోపిస్తూ.. ప్రకాశం జిల్లా కలెక్టర్కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన రంగలక్ష్మమ్మ అనే మహిళ.. మంత్రి సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ దినేశ్ కుమార్కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా.. న్యాయం జరగలేదని మహిళ వాపోయింది. మీరైనా న్యాయం చేయండి అంటూ.. కలెక్టర్‌ను వేడుకుంది.

అయితే.. పోలీసులు జోక్యం చేసుకొని ఆమెను అక్కడి నుంచి బయటకు పంపించారు. “మీరంతా మంత్రికే కాపలా. అతని పక్షానే ఉన్నారు. మాకు న్యాయం చేసేవారు ఎవరూ లేరు” అంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. దీనిపై స్థానికులు తీవ్ర‌స్థాయిలో మండి ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకుని.. వారికి న్యాయం చేయాల్సిన మంత్రులే ఇలా క‌బ్జాల‌కు పాల్ప‌డ‌డం ఏంట‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి మంత్రి ఆదిమూల‌పు సురేశ్ దీనిపై ఏమంటారో చూడాలి. ఇన్ని జ‌రుగుతున్నా.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం మౌనం వీడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 9, 2022 7:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

6 minutes ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

28 minutes ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

1 hour ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

2 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

2 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

3 hours ago