ఏపీలో మంత్రులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు.. వారు అనుసరిస్తున్న తీరుపై వారి వారి సామాజిక వర్గాలే ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.. టీటీడీ చైర్మన్ , వైసీపీ నాయకుడు.. వైవీ సుబ్బారెడ్డి ముందు.. మోకాళ్లపై మోకరిల్లి మరీ పాదనమస్కారాలు చేశారు. దీంతో ఆయన సామాజిక వర్గం శెట్టిబలిజ నాయకులు తీవ్రస్థాయిలో దీనిని ఖండించారు. మంత్రి మోకరిల్లడం ఎందుకు.. అవసరమైతే.. రాజీనామా చేయండి అని డిమాండ్లు చేస్తున్నారు.
ఇక, గత కేబినెట్లోనూ.. ప్రస్తుతం కూడా ఉన్న మంత్రి గుమ్మనూరు జయరామ్ కుమారుడిపై ఓ లగ్జరీ కారును బహుమానంగా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.. ఆధారాలతో సహా అప్పట్లో నిరూపించారు. దీనిపై ఎలాంటి విచారణకూ నోచుకోలేదు.
ఇక, ఇప్పుడు తాజాగా మంత్రి ఆదిమూలపు సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ ప్రకాశం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని.. మీరైనా న్యాయం చేయండంటూ ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ను వేడుకుంది.
మంత్రి ఆదిమూలపు సురేశ్ తన పొలం ఆక్రమించారని ఆరోపిస్తూ.. ప్రకాశం జిల్లా కలెక్టర్కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన రంగలక్ష్మమ్మ అనే మహిళ.. మంత్రి సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ దినేశ్ కుమార్కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా.. న్యాయం జరగలేదని మహిళ వాపోయింది. మీరైనా న్యాయం చేయండి అంటూ.. కలెక్టర్ను వేడుకుంది.
అయితే.. పోలీసులు జోక్యం చేసుకొని ఆమెను అక్కడి నుంచి బయటకు పంపించారు. “మీరంతా మంత్రికే కాపలా. అతని పక్షానే ఉన్నారు. మాకు న్యాయం చేసేవారు ఎవరూ లేరు” అంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. దీనిపై స్థానికులు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ప్రజలను పట్టించుకుని.. వారికి న్యాయం చేయాల్సిన మంత్రులే ఇలా కబ్జాలకు పాల్పడడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. మరి మంత్రి ఆదిమూలపు సురేశ్ దీనిపై ఏమంటారో చూడాలి. ఇన్ని జరుగుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం మౌనం వీడకపోవడం గమనార్హం.
This post was last modified on May 9, 2022 7:00 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…