Political News

నోట్ దిస్ పాయింట్ కేసీఆర్ స‌ర్‌!… ఈటల ఏమ‌న్నారంటే!

కొన్ని కొన్ని కామెంట్లు కొంద‌రి నోటి నుంచి వ‌స్తేనే సంచ‌ల‌నంగా మారుతుంది. ఇప్పుడు ఆ స‌బ్జెక్టుకు కూడా సార్ధ‌క‌త చేకూరుతుంది. ఇప్పుడు ఇలాంటి కామెంట్లే చేశారు. బీజేపీ నాయ‌కుడు, మాజీ టీఆర్ఎస్ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. మ‌ద్యం అమ్మి, భూములు అమ్మి.. రాష్ట్రాన్ని బాగు చేస్త‌రా.. అంటూ.. కేసీఆర్ స‌ర్కారుపై విరుచుకుపడ్డారు. తనదైన శైలీలో కేసీఆర్ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. మ‌ద్యం, భూములు అమ్మి ఖర్చు పెడితే ధనిక రాష్ట్రం అవుతుందా? అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని పాలించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి నిజాయతీ లేదన్న ఈటల… ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అధికారం కేసీఆర్‌కు లేదని వ్యాఖ్యానిం చారు. రైతు ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకుంటున్నారని.. కానీ, ఆచరణలో మాత్రం శూన్యమని వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.

రైతుల కళ్లల్లో మట్టిగొట్టి వారి జీవితాలతో ఆటలాడుతున్నారని ఈటల ధ్వజమెత్తారు. ఇప్పటికీ… కొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు లేవని మండిపడ్డారు. ఉన్న కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత ఉందని తెలిపారు. ధాన్యం తూకాల్లో క్వింటాల్‌ బస్తాకు ఏడున్నర నుంచి పది కిలోల ధాన్యాన్ని కోత విధిస్తున్నారని విమర్శించారు. క్లారిటీ లేని హామీలు ఇచ్చి ప్రజల్ని అయోమయా నికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీలుగా ఏం చేస్తారో అదే చెప్పాలని… ఓట్లు దండుకోవటానికి పూటకోమాట చెప్పకూడదని ఈటల పేర్కొన్నారు.

కేసీఆర్‌ది.. చ‌క్ర‌వ‌ర్తుల లెక్క‌!!

కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు. భూములు అమ్మి ఖర్చు పెడితే ధనిక రాష్ట్రం అవుతుందా?. మద్యం అమ్మి డబ్బు సంపాదిస్తే ధనిక రాష్ట్రం అవుతుందా? బాగానే ఉన్న సచివాలయంను వాస్తు కోసం కూలగొట్టారు. ఇతర సీఎంల పేర్లున్న శిలాఫలకాలు ఉండొద్దని భావించారు. పూర్వం చక్రవర్తులు చేసిన పని ఇవాళ కేసీఆర్‌ చేస్తున్నారు. ఆచరణయోగ్యం కానీ హామీలను రాహుల్‌గాంధీ ఇచ్చారు. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే రూ.40 వేల కోట్లు కావాలి. అన్నారు ఈట‌ల‌.

టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చలేదని ఈటల చెప్పారు. ధనిక రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. భూములు అమ్మి ఖర్చు పెడితే ధనిక రాష్ట్రం అవుతుందా? అని ప్రశ్నించారు. మద్యం అమ్మి డబ్బు సంపాదిస్తే ధనిక రాష్ట్రం అవుతుందా? అని మండిపడ్డారు.

This post was last modified on May 7, 2022 10:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్ధరాత్రి మాట కోసం ‘అఖండ 2’ సిద్ధం

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…

53 minutes ago

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

5 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

7 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

9 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

10 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

10 hours ago