దాదాపు ఏడాది కిందట, సంచలన రీతిలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతగా ఉన్న ఈటల రాజేందర్ మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. తనను అన్యాయంగా టార్గెట్ చేశారని ఆవేదన చెందిన ఈటల టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి అనంతరం వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున బరిలో దిగి సంచలన విజయం సాధించడం ద్వారా తన సత్తా చాటారు.
ఇదిలాఉంటే, ఇప్పటికీ గులాబీ దళపతి కేసీఆర్కు తను అంటే పగ తీరలేదని తాజాగా ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ఏ విధంగా టార్గెట్ చేసింది ఆయన వివరించారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో జరుగుతున్న బీజేపీ శిక్షణ తరగతుల్లో ఈటల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ ను గద్దె దింపేందుకు నిరంతరం పోరాటం చేస్తామని ఈటల రాజేందర్ వెల్లడించారు. తనకు ఫాలోయింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో తన పేపర్, టీవీలలో రాకుండా చేశాడని గుర్తు చేశారు.
ఒక్క కేసీఆర్ మీడియాలో రాకుంటే నష్టం ఏమీలేదని…ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందన్నారు. యువత తలుచుకుంటే సోషల్ మీడియాలో కేసీఆర్ పని తీరును ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారని ఈటల రాజేందర్ అన్నారు.
ఈటల రాజేందరన్న వార్తలు టీవీల్లో, పేపర్లలో వస్తలేదనుకోవద్దని.. యువత చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోనే ఏకే 47లా ఉపయోగపడుతుందని బీజేపీ శ్రేణులకు ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని మనం అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదని.. ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు.
మనం చెప్పాల్సింది సమాజానికి ఏది అవసరమో.. చైతన్యం కలిగించేలా ఉండాలని తెలిపారు. ఒకప్పటి కాలం వేరు…ఇప్పటి జనరేషన్ వేరు అని పేర్కొన్న ఈటల రాజేందర్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు.
This post was last modified on May 5, 2022 7:20 am
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…