దాదాపు ఏడాది కిందట, సంచలన రీతిలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతగా ఉన్న ఈటల రాజేందర్ మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. తనను అన్యాయంగా టార్గెట్ చేశారని ఆవేదన చెందిన ఈటల టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి అనంతరం వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున బరిలో దిగి సంచలన విజయం సాధించడం ద్వారా తన సత్తా చాటారు.
ఇదిలాఉంటే, ఇప్పటికీ గులాబీ దళపతి కేసీఆర్కు తను అంటే పగ తీరలేదని తాజాగా ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ఏ విధంగా టార్గెట్ చేసింది ఆయన వివరించారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో జరుగుతున్న బీజేపీ శిక్షణ తరగతుల్లో ఈటల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ ను గద్దె దింపేందుకు నిరంతరం పోరాటం చేస్తామని ఈటల రాజేందర్ వెల్లడించారు. తనకు ఫాలోయింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో తన పేపర్, టీవీలలో రాకుండా చేశాడని గుర్తు చేశారు.
ఒక్క కేసీఆర్ మీడియాలో రాకుంటే నష్టం ఏమీలేదని…ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందన్నారు. యువత తలుచుకుంటే సోషల్ మీడియాలో కేసీఆర్ పని తీరును ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారని ఈటల రాజేందర్ అన్నారు.
ఈటల రాజేందరన్న వార్తలు టీవీల్లో, పేపర్లలో వస్తలేదనుకోవద్దని.. యువత చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోనే ఏకే 47లా ఉపయోగపడుతుందని బీజేపీ శ్రేణులకు ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని మనం అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదని.. ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు.
మనం చెప్పాల్సింది సమాజానికి ఏది అవసరమో.. చైతన్యం కలిగించేలా ఉండాలని తెలిపారు. ఒకప్పటి కాలం వేరు…ఇప్పటి జనరేషన్ వేరు అని పేర్కొన్న ఈటల రాజేందర్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు.
This post was last modified on May 5, 2022 7:20 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…