భారత రాష్ట్ర సమితి.. పార్టీ ఏర్పాటు చేస్తే.. ఎలా ఉంటుందంటూ.. టీఆర్ ఎస్ ప్లీనరీలో సంచలన వ్యాఖ్యలు చేసిన.. సీఎం కేసీఆర్.. 24 గంటలు కాకముందే.. జాతీయ రాజకీయ ముచ్చట్ల జోరును పెంచారు. తాజాగా ఆయన జార్ఖండ్ యువ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్తో ప్రగతి భవన్ లో బేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో చర్చలు జరిపారు. జాతీయ రాజకీయాలు, కేంద్రం విధానాలు, ఇతర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయని.. సమాచారం.
మోడీని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల్లో.. జార్ఖండ్ కీలకంగా ఉంది. పైగా.. ఇక్కడ బీజేపీకి పట్టు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరింత దూకుడు పెంచి.. కేసీఆర్తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. ఇక, దేశంలో సమూల మార్పు కోసం ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా ఉండాలంటూ.. టీఆర్ ఎస్ ప్లీనరీలో కేసీఆర్ పేర్కొనడం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని అన్నారు.
దీంతో కేసీఆర్ పక్కాగా జాతీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారనే మాట జాతీయ స్థాయిలో హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు కదులుతుండడం గమనార్హం. ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్.. గత నెల 4 న జార్ఖండ్ రాజధాని రాంచీలో పర్యటించారు. ఈ క్రమంలోనే త్వరలోనే హైదరాబాద్కు రావాలంటూ.. సీఎం హేమంత్కు కేసీఆర్ ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే యువ సీఎం హైదరాబాద్కు వచ్చారు.
దేశ రాజకీయాలు, బీజేపీకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసే అంశాలపై కేసీఆర్.. హేమంత్ సొరేన్తో చర్చించారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్. మంత్రి కేటీఆర్, తదితరులు హేమంత్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం.. అంతర్గత మందిరంలో చర్చలకు దిగారు. హేమంత్ గౌరవార్థం సీఎం కేసీఆర్ .. రాత్రి డిన్నర్ ఏర్పాటు చేశారు.
This post was last modified on April 29, 2022 9:18 am
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…
కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…
అసలే వేసవి కాలం.. సాధారణ ఇళ్లలో ఫాన్లు.. మధ్యతరగతి ఇళ్లలో కూలర్లు, ఆపై తరగతుల ఇళ్లలో ఏసీలు కనీసంలో కనీసం…