గడిచిన వారం.. పది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇష్యూ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన్ను విచారించేందుకు సీబీఐ ఇచ్చిన నోటీసును తాజాగా ఆయన అంగీకరించలేదు. వివేకా హత్య కేసుకు సంబంధించి ఇప్పటివరకు 207 మందిని విచారించిన సీబీఐ మొత్తం 146 మంది వాంగ్మూలాన్ని రికార్డు చేసింది.
ఈ నేపథ్యంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి.. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను విచారించేందుకు సీబీఐ సిద్ధమైంది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం పరిధిలోని స్పెషల్ క్రైమ్స్ మూడో విభాగానికి చెందిన అధికారులతో పాటు.. పలువురు ముఖ్య అధికారులు కలిసి ఎంపీ అవినాశ్ కు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చేందుకు గురువారం పులివెందులకు చేరుకున్నారు.
తమ వద్ద విచారణకు హాజరు కావాలని కోరుతూ నోటీసులు జారీ చేసే ప్రయత్నం చేశారు. అయితే.. సీబీఐ జారీ చేస్తున్న నోటీసుల్ని స్వీకరించేందుకు అవినాశ్ .. ఆయన తండ్రి అంగీకరించలేదు. దీంతో.. సీబీఐ అధికారులు స్థానిక కోర్టును ఆశ్రయించనున్నారు. ఇందులో భాగంగా కోర్టు అనుమతి తీసుకోనున్నారు.
వివేకా హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకల్ని కడగటం.. భౌతికకాయం మీద ఉన్న గాయాలకు ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందితో కుట్లు వేయించి.. కట్లు కట్టించటంతో అవినాశ్ రెడ్డి.. ఆయన తండ్రి పాత్ర ఉందని.. హత్య జరిగినచోట ఆధారాల ధ్వంసంలో వారు కీలకంగా వ్యవహరించారని.. వివేకా గుండెపోటుతో మరణించారని ప్రచారం చేసింది కూడా వారేనని వాంగ్మూలంలో పలువురు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరిని సీబీఐ విచారణకు రావాలని కోరుతూ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైతే.. అందుకు నో చెప్పారు. దీంతో.. పులివెందుల కోర్టును ఆశ్రయించి.. కోర్డు ఆదేశాలతో నోటీసులు జారీ చేసే వీలుందని చెబుతున్నారు.
This post was last modified on March 4, 2022 1:30 pm
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…