Political News

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో కీలకం ఈ లెక్కలేనా?

అనూహ్యమైన ఎత్తులు వేయడం మోడీకి అలవాటే. మరో ఏడాదిలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ పరివారం డిసైడ్ చేసే రాష్ట్రపతి అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గా ప్రకటిస్తారన్న మాట వినిపిస్తోంది. ఎందుకిలా? అన్నప్పుడు మోడీకి ముస్లిం మైనార్టీలంటే మంట.. ఆయన వారిని ద్వేషిస్తారన్న బ్రాండ్ ఇమేజ్ ఉంది. దాన్ని పోగొట్టుకునే క్రమంలోనే ఈ నిర్ణయమని చెబుతున్నా.. అసలు కారణం మాత్రం ‘లెక్కలే’ అని చెప్పాలి. ఎందుకంటే.. మిగిలిన మాటలు ఎలా ఉన్నా.. ఎన్నికల్లో విజేత ఎవరన్నది తేల్చేది అంకెలే. ఈ అంకెల విషయంలో మోడీ పరివారం వెనుకబడి ఉండటంతో.. సేఫ్ గేమ్ లో భాగంగా ఈ సర్ ప్రైజ్ అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాలన్న వ్యూహంలో ఉన్నట్లు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం…

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే.. ఎంపీలు వేసే ఓట్లను లెక్క వేయటం ద్వారా రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారన్నది తేలుస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థిగా ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎంపిక చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పోటీ ఖాయమనుకుంటే.. బీజేపీ దాని మిత్రపక్షాలకు ఉన్న ఓట్లు.. విపక్షాలకు ఉన్న ఓట్లను లెక్కను చూస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతుందని చెబుతారు. గత ఎన్నికల్లో రాంనాథ్ కోవింద్ కు 7.02 లక్షల ఓట్లు వచ్చాయి. అప్పట్లో విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన మీరా కుమార్ కు 3.67లక్షల ఓట్లు వచ్చాయి.

నాడు కోవింద్ ను బలపరిచిన పార్టీల్లో బీజేపీతో పాటు అన్నాడీఎంకే.. జేడీయూ.. బీజేడీ.. టీఆర్ఎస్.. టీడీపీ.. వైసీపీ.. శివసేన.. అకాలీదళ్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు కోవింద్ కు మద్దతు ఇవ్వటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఉన్న మిత్రపక్షాలు చాలా తక్కువ. వాటికున్న ఓట్లు మొత్తాన్ని లెక్కిస్తే 4.74 లక్షల ఓట్లు మాత్రమే కనిపిస్తాయి. రాష్ట్రపతిగా ఎంపిక కావాలంటే మినిమం 5.49 లక్షల ఓట్లు కావాలి. అంటే.. దాదాపు 80 వేల ఓట్లు తక్కువ కానున్నాయి. గతంలో మాదిరి బీజేపీకి మిత్రుల అండ లేదు.
గతంలో టీడీపీ.. శివసేన తదితర పార్టీలు ఉండేవి. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. మరో కీలక విషయం ఏమంటే.. యూపీ ఎన్నికల్లో గతంలో మాదిరి బీజేపీకి మెజార్టీ వచ్చేది లేదు.

తేడా వస్తే ఓడిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తంగా గతంలో ఉన్నంత మంది ఎమ్మెల్యేల బలమైతే కచ్చితంగా ఉండదని ఖాయంగా చెబుతున్నారు. అదే జరిగితే.. యూపీలో బీజేపీ ఓట్లు తగ్గుతాయి. అంటే.. తాము బరిలోకి దింపే రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవటానికి మరిన్ని ఓట్లు అవసరమవుతాయి. ఈ లెక్కల్ని పరిగణలోకి తీసుకొని.. విపక్షాలు విస్తుపోయేలా.. మైనార్టీల మనసుల్ని అంతో ఇంతో దోచుకునేలా చేయటానికి గులాం నబీ ఆజాద్ కు మించిన అభ్యర్థి మరొకరు ఉండరని చెప్పాలి.

రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన ఎలక్టోరల్ కాలేజీ కింద ఎమ్మెల్యే ఓటు విలువ 208 అయితే.. ఎంపీ ఓటు విలువ 708గా లెక్కిస్తారు. ఈ లెక్కన చూసినప్పుడు బీజేపీకి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు.. ఎంపీల లెక్కతో పోలిస్తే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు గులాం నబీ ఆజాద్ కు మించిన మంచి ఆప్షన్ మరొకటి ఉండదు. అజాద్ కు వివిధ పార్టీలతో మంచి అనుబంధం ఉంది. ఉదాహరణకు టీఆర్ఎస్ ను తీసుకుంటే.. అజాద్ కు కేసీఆర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనే రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగితే.. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శివసేన కానీ ఎన్సీపీ కానీ.. ఆఖరకు వైసీపీ, టీడీపీకి కానీ కిమ్మనలేవు. అందుకే.. అందరికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ఉండే అజాద్ ను బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించితే.. మరో ఆలోచన లేకుండా ఆయన ఎన్నికల్లో గెలవడం.. రాష్ట్రపతి టాస్కును విజయవంతంగా ముగించిన క్రెడిట్ మోడీకి దక్కుతుంది. అందుకే.. ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on March 4, 2022 11:33 am

Share

Recent Posts

లోకేష్… ట్విట్టర్ ని కూడా వదలట్లేదు

మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…

20 minutes ago

‘మ్యాడ్’ భామకు ప్యారడైజ్ ఛాన్స్ మిస్…

నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…

1 hour ago

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గ్రేటే

టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…

2 hours ago

నాని సినిమా… సూపర్ స్ట్రాటజీ

యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…

7 hours ago

అవును… సోనియా పుస్త‌కం ప్ర‌చురించం!

కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మక‌థ ..పుస్త‌కం ముద్రణ వ్య‌వ‌హారం వివాదంగా మారింది.…

9 hours ago

సెప్టెంబర్ బోణీ వారం… పోటీ రసవత్తరం

ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…

9 hours ago