ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం చాలా నగరాల్లో బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికి ఏడు రోజులుగా జరుగుతున్న యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఏ నగరంపై ఎప్పుడు బాంబులు పడతాయో, క్షిపణలు వచ్చి మీదపడతాయో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎంత బంకర్లలో దాక్కున్నా ప్రాణభయంతో జనాలు అల్లాడిపోతున్నారు. బంకర్లలో దాక్కున్న వాళ్ళ సమస్య ఏమిటంటే నీళ్ళు, ఆహారం, మందులు అయిపోతున్నాయి. వీటికోసం మళ్ళీ రోడ్ల మీదకు రావాల్సిందే.
అందుకనే ఉక్రెయిన్లోనే ఉండి నిమిషం నిమిషం నరకం అనుభవించే బదులు పొరుగునే ఉన్న దేశాల్లోకి ఏదోరకంగా వలసలు వెళ్ళిపోతే చాలా మళ్ళీ సంగతి మళ్ళీ చూసుకుందాం అని జనాలు అనుకుంటున్నారు. అవకాశాలు ఉన్న వాళ్ళు ఆస్తులు గాలికొదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఏదోరకంగా పారిపోతున్నారు. ఈ విధంగా గడచిన ఏడు రోజుల్లో ఉక్రెయిన్ నుండి పొరుగు దేశాలకు సుమారు 10 లక్షలకు పైగా వలసలు వెళ్ళిపోయారు.
పక్కనే ఉన్న పోలండ్ కు అత్యధికంగా 5 లక్షలమంది పారిపోయారు. హంగరీకి 1.20 లక్షలు, మాల్టోవాకు లక్ష మంది, స్లొవేకియాకు 70 వేల మంది, యురోపియన్ యూనియన్ దేశాలకు 88 వేలమంది, బెలారస్ కు 350 మంది పారిపోయారు. చివరకు యుద్ధానికి కారణమైన రష్యాలోకి కూడా సుమారు 47 వేల మంది పారిపోయారు. రొమేనియాలోకి 50 వేల మంది వలస వెళ్ళిపోయారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య తేడా ఏమీలేదు. పూర్వపు సోవియట్ యూనియన్లోని అత్యంత పెద్ద రాష్ట్రాల్లో ఉక్రెయిన్ కూడా ఒకటి.
అందుకనే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముందు వరకు జనాల రాకపోకలు హ్యాపీగా జరిగిపోతుండేవి. ఇపుడు ఉక్రెయిన్లోని జనాలంతా ఒకపుడు సోవియట్ యూనియన్ జనాలే. అందుకనే ఇపుడు ఉక్రెయిన్ నుండి రష్యాలోకి పారిపోయారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని లక్షలమంది ఒక దేశం నుండి ఇతర దేశాలకు వలసలు వెళ్ళిపోవటం ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. గతంలో జరిగిన యుద్ధాల్లో కూడా ఇన్ని లక్షలమంది బయట దేశాలకు వలసలు వెళ్ళిపోలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసలు వెళ్ళిపోవటం నిజంగా బాధాకరమే.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…