ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం చాలా నగరాల్లో బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికి ఏడు రోజులుగా జరుగుతున్న యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఏ నగరంపై ఎప్పుడు బాంబులు పడతాయో, క్షిపణలు వచ్చి మీదపడతాయో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎంత బంకర్లలో దాక్కున్నా ప్రాణభయంతో జనాలు అల్లాడిపోతున్నారు. బంకర్లలో దాక్కున్న వాళ్ళ సమస్య ఏమిటంటే నీళ్ళు, ఆహారం, మందులు అయిపోతున్నాయి. వీటికోసం మళ్ళీ రోడ్ల మీదకు రావాల్సిందే.
అందుకనే ఉక్రెయిన్లోనే ఉండి నిమిషం నిమిషం నరకం అనుభవించే బదులు పొరుగునే ఉన్న దేశాల్లోకి ఏదోరకంగా వలసలు వెళ్ళిపోతే చాలా మళ్ళీ సంగతి మళ్ళీ చూసుకుందాం అని జనాలు అనుకుంటున్నారు. అవకాశాలు ఉన్న వాళ్ళు ఆస్తులు గాలికొదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఏదోరకంగా పారిపోతున్నారు. ఈ విధంగా గడచిన ఏడు రోజుల్లో ఉక్రెయిన్ నుండి పొరుగు దేశాలకు సుమారు 10 లక్షలకు పైగా వలసలు వెళ్ళిపోయారు.
పక్కనే ఉన్న పోలండ్ కు అత్యధికంగా 5 లక్షలమంది పారిపోయారు. హంగరీకి 1.20 లక్షలు, మాల్టోవాకు లక్ష మంది, స్లొవేకియాకు 70 వేల మంది, యురోపియన్ యూనియన్ దేశాలకు 88 వేలమంది, బెలారస్ కు 350 మంది పారిపోయారు. చివరకు యుద్ధానికి కారణమైన రష్యాలోకి కూడా సుమారు 47 వేల మంది పారిపోయారు. రొమేనియాలోకి 50 వేల మంది వలస వెళ్ళిపోయారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య తేడా ఏమీలేదు. పూర్వపు సోవియట్ యూనియన్లోని అత్యంత పెద్ద రాష్ట్రాల్లో ఉక్రెయిన్ కూడా ఒకటి.
అందుకనే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముందు వరకు జనాల రాకపోకలు హ్యాపీగా జరిగిపోతుండేవి. ఇపుడు ఉక్రెయిన్లోని జనాలంతా ఒకపుడు సోవియట్ యూనియన్ జనాలే. అందుకనే ఇపుడు ఉక్రెయిన్ నుండి రష్యాలోకి పారిపోయారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని లక్షలమంది ఒక దేశం నుండి ఇతర దేశాలకు వలసలు వెళ్ళిపోవటం ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. గతంలో జరిగిన యుద్ధాల్లో కూడా ఇన్ని లక్షలమంది బయట దేశాలకు వలసలు వెళ్ళిపోలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసలు వెళ్ళిపోవటం నిజంగా బాధాకరమే.
This post was last modified on March 4, 2022 1:29 pm
ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు…
వైసీపీ కీలక నేత, ఏపీ శాసనమండలిలో విపక్ష నేతగా సాగుతున్న బొత్స సత్యనారాయణ సెలవు దినం అయిన ఆదివారం అధికార…
తెలుగు సినిమా చరిత్రలోనే బ్రహ్మానందాన్ని మించిన కమెడియన్ ఉండరంటే ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. ఆయనలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కడుపుబ్బ…
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఈ నెల 5న జరగనున్న ఎన్నికల కోసం అటు అధికార…
యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావడం ఆలస్యం.. చదువు, వృత్తి కోసం తమ దేశానికి వచ్చే విదేశీయుల విషయంలో…
కిర్లంపూడి పేరు వింటేనే… కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గుర్తుకు వస్తారు. రాజకీయాల్లో…