తాడిపత్రిలో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఓ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య పంతాలు చివరకు ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే తాడిపత్రి-అనంతపురం జాతీయ రహదారి మీద కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిసైడ్ అయ్యారు. ఇంతకీ రామిరెడ్డి ఎవరంటే పెద్దారెడ్డి తండ్రి. సరే విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకుంటే తప్పులేదు. కానీ అందుకు మున్సిపల్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి. ఇదే సమయంలో ఆర్ అండ్ బీ శాఖ అనుమతి కూడా తప్పదు.
అయితే ఎంఎల్ఏ మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. మున్సిపల్ అనుమతి లేకుండా విగ్రహాన్ని పెట్టడం ఏమిటంటే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే నియోజకవర్గానికి వైసీపీ నేత పెద్దారెడ్డి ఎంఎల్ఏ అయితే మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ కారణంగానే ఏ విషయం తీసుకున్నా ఇద్దరి మధ్య గొడవలవుతున్నాయి.
తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ చేతిలో ఉంది కాబట్టి తన తండ్రి విగ్రహం ఏర్పాటుకు అనుమతి రాదని ఎంఎల్ఏ అనుకున్నట్లున్నారు. లేదా అధికార పార్టీ ఎంఎల్ఏని కాబట్టి ఎవరినీ అడగాల్సిన అవసరం లేదనుకున్నారో తెలీటం లేదు. మొత్తానికి విగ్రహాన్ని తయారు చేయించారు. జాతీయ రహదారిపై తాను అనుకున్న చోట్ల పెద్ద దిమ్మ కట్టేసి విగ్రహాన్ని తీసుకొచ్చి నిలబెట్టేశారు కూడా. దీంతో ఇదే విషయాన్ని చైర్మన్ ముందు కమిషనర్ కు తర్వాత కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
వివాదానికి ఒకవైపు ఎంఎల్ఏ మరోవైపు చైర్మన్ కాబట్టి కమిషనర్, కలెక్టర్ చేయగలిగిందేమీ లేదు. విగ్రహం ఏర్పాటు ఎప్పుడో తెలీదు కానీ అందుకు ఎంఎల్ఏ ఏర్పాట్లయితే చేసేసుకుంటున్నారు. తమ అనుమతి లేకుండానే విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారో చూస్తానంటు జేసీ మండిపోతున్నారు. దీంతో తాడిపత్రిలో ఎప్పుడు ఏమవుతుందో అని జనాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
This post was last modified on February 18, 2022 12:38 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…