తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కేటీఆర్… ఈ మేరకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. ఈ పరిణామం నిజం అవడం సంగతి అలా ఉంచితే, ఎన్ని సార్లు వార్తల్లోకి ఎక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఊహ ప్రచారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ పెద్దలు అనుసరిస్తున్న వ్యూహాలు లేదా ఈ అంచనాను బలపరిచేలా కనిపించే సంఘటనలు దీనికి కారణం.
ఇక పాయింట్లోకి వచ్చేస్తే, ఒకింత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ప్రచారంలోకి వచ్చేందుకు కారణం తెలంగాణ సీఎం కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు వేదికగా మరోమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ భగ్గుమంటోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు చేస్తోంది. అయితే, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రం బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ భగ్గుమన్న సంగతి తెలిసిందే.
ఏకంగా రాజ్యాంగ మార్చాల్సిన అవసరం ఉందని స్పందించారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అయితే, తాజాగా ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో స్వాగతం- వీడ్కోలు పలకకపోవడంపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టడం కావచ్చు.
అనంతరం తాజాగా తెలంగాణ ఏర్పాటు విషయంలో చేసిన వ్యాఖ్యలపై తన వైఖరిని తెలియజేయడం కోసం అయి ఉండవచ్చు టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడలేదు. పైగా ఈ అంశాలలో ఆయన తనయుడు కేటీఆర్ సర్వం తానై పార్టీ శ్రేణులకు, పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఓవైపు దేశ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్ ఆ పనుల్లో బిజీగా ఉండటంలో భాగంగా తనయుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగించే ఎత్తుగడ మొదలుపెట్టారా అంటూ కొత్త చర్చ జరుగుతోంది.
This post was last modified on February 10, 2022 9:21 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…