తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కేటీఆర్… ఈ మేరకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. ఈ పరిణామం నిజం అవడం సంగతి అలా ఉంచితే, ఎన్ని సార్లు వార్తల్లోకి ఎక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఊహ ప్రచారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ పెద్దలు అనుసరిస్తున్న వ్యూహాలు లేదా ఈ అంచనాను బలపరిచేలా కనిపించే సంఘటనలు దీనికి కారణం.
ఇక పాయింట్లోకి వచ్చేస్తే, ఒకింత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ప్రచారంలోకి వచ్చేందుకు కారణం తెలంగాణ సీఎం కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు వేదికగా మరోమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ భగ్గుమంటోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు చేస్తోంది. అయితే, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రం బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ భగ్గుమన్న సంగతి తెలిసిందే.
ఏకంగా రాజ్యాంగ మార్చాల్సిన అవసరం ఉందని స్పందించారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అయితే, తాజాగా ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో స్వాగతం- వీడ్కోలు పలకకపోవడంపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టడం కావచ్చు.
అనంతరం తాజాగా తెలంగాణ ఏర్పాటు విషయంలో చేసిన వ్యాఖ్యలపై తన వైఖరిని తెలియజేయడం కోసం అయి ఉండవచ్చు టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడలేదు. పైగా ఈ అంశాలలో ఆయన తనయుడు కేటీఆర్ సర్వం తానై పార్టీ శ్రేణులకు, పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఓవైపు దేశ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్ ఆ పనుల్లో బిజీగా ఉండటంలో భాగంగా తనయుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగించే ఎత్తుగడ మొదలుపెట్టారా అంటూ కొత్త చర్చ జరుగుతోంది.
This post was last modified on February 10, 2022 9:21 pm
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…