తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కేటీఆర్… ఈ మేరకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. ఈ పరిణామం నిజం అవడం సంగతి అలా ఉంచితే, ఎన్ని సార్లు వార్తల్లోకి ఎక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఊహ ప్రచారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ పెద్దలు అనుసరిస్తున్న వ్యూహాలు లేదా ఈ అంచనాను బలపరిచేలా కనిపించే సంఘటనలు దీనికి కారణం.
ఇక పాయింట్లోకి వచ్చేస్తే, ఒకింత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ప్రచారంలోకి వచ్చేందుకు కారణం తెలంగాణ సీఎం కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు వేదికగా మరోమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ భగ్గుమంటోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు చేస్తోంది. అయితే, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రం బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ భగ్గుమన్న సంగతి తెలిసిందే.
ఏకంగా రాజ్యాంగ మార్చాల్సిన అవసరం ఉందని స్పందించారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అయితే, తాజాగా ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో స్వాగతం- వీడ్కోలు పలకకపోవడంపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టడం కావచ్చు.
అనంతరం తాజాగా తెలంగాణ ఏర్పాటు విషయంలో చేసిన వ్యాఖ్యలపై తన వైఖరిని తెలియజేయడం కోసం అయి ఉండవచ్చు టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడలేదు. పైగా ఈ అంశాలలో ఆయన తనయుడు కేటీఆర్ సర్వం తానై పార్టీ శ్రేణులకు, పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఓవైపు దేశ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్ ఆ పనుల్లో బిజీగా ఉండటంలో భాగంగా తనయుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగించే ఎత్తుగడ మొదలుపెట్టారా అంటూ కొత్త చర్చ జరుగుతోంది.
This post was last modified on February 10, 2022 9:21 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…