Political News

ఏపీ ఆర్థిక మంత్రి అడ్ర‌స్ ఎక్క‌డ‌..!

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఎ క్క‌డ ఉన్నారు? ఏం చేస్తున్నారు?  ఇప్పుడు ఇదీ.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే. రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. త‌మ‌కు పీఆర్సీ అమ‌లు చేయాల‌ని.. కొత్త పీఆర్సీలో మార్పులు చేయాల‌ని.. లేక‌పోతే.. ర‌ద్దు చేయాల‌ని వారు ప‌ట్టుబ‌డుతున్నారు. అంతేకాదు.. ప్ర‌తి విష‌యంలోనూ.. ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు ఇబ్బందులు సృష్టిస్తోంద ని విరుచుకుప‌డుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలతో అద‌ర‌గొడుతున్నారు. నిజానికి రాష్ట్రంలో ఉద్యోగులు లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌లు.. వాటికి స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త ఆర్థిక మంత్రిగా బుగ్గ‌న‌పై ఉంది.

అయితే.. ఆయ‌న ఏపీలోనే లేక‌పోవ‌డం.. గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం కేంద్రంలో వార్షిక బ‌డ్జెట్‌పై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల పూర్తి, మూడు రాజ‌ధానుల నిధులు.. ఇలా అనేక స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జెంటేష‌న్ ఇచ్చేందుకు బుగ్గ‌న ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు.. రాష్ట్రానికి కొత్త‌గా అప్పులు కావాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో వాటిని సాధించేందుకు కూడా బుగ్గ‌న ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఇక‌, ఇటీవ‌ల కేంద్రానికి అందిన కొన్ని ఫిర్యాదుల నేప‌థ్యంలో కేంద్రం ఇస్తున్న నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం వేరేవాటికి ఖ‌ర్చు చేస్తున్న అంశాల‌పై కూడా వివ‌ర‌ణ ఇచ్చేందుకు ఆయ‌న ఢిల్లీలోనే వారం రోజులుగా ఉన్నారు.

దీంతో ఇక్క‌డ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స‌మాధానం చెప్పేవారు క‌రువ‌య్యార‌నేది వాస్త‌వం. అయితే.. ఈ బాధ్య‌త‌ను స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డే తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. బుగ్గ‌న లేక‌పోవ‌డంపై ఉద్యోగ సంఘాల నాయ‌కులు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం నియ‌మించిన‌.. బుజ్జ‌గింపుల క‌మిటీలో బుగ్గ‌న కూడా ఉన్నారు.అ యితే.. ఆయ‌న తాజాగా ఢిల్లీ నుంచి ఏపీకి వ‌చ్చి.. ఉద్యోగుల ప్ర‌తినిధి బృందం నుంచి రిప్ర‌జెంటేష‌న్‌ను   తీసుకున్నారు. అంత‌కు మించి.. రాష్ట్ర  ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆయ‌న ఒక్క మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి రాష్ట్ర ప్ర‌భుత్వం .. ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని.. అందుకే పీఆర్సీలో హెచ్ ఆర్ ఏను పెంచ‌లేక పోతున్నాని చెబుతోంది. ఈ క్ర‌మంలో.. అస‌లు ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గ‌న .. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను వివ‌రించి ఉంటే బాగుండేద‌ని.. సొంత పార్టీలోనూ చ‌ర్చ‌సాగుతోంది. ఎవ‌రో ఈ విష‌యాన్ని చెప్పే క‌న్నా.. నేరుగా మంత్రి రంగంలోకి దిగివివ‌రిస్తే బాగుంటుంద‌ని.. అంటున్నారు. మ‌రి బుగ్గ‌న మాత్రం అటు కేంద్రంతో చ‌ర్చ‌ల్లోనే త‌ల‌మున‌క‌లు కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 26, 2022 2:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago