అదిత్ అరుణ్.. టాలీవుడ్ యంగ్ హీరో. అందంగా ఉంటాడు. బాగా నటిస్తాడు. వాయిస్ కూడా బాగుంటుంది. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. జెనీలియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కథ’ సినిమాతో అతను తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా వచ్చింది 2009లో. అంటే అదిత్ నటుడిగా అరంగేట్రం చేసి పుష్కరం దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా సరైన హిట్ రాక హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు.
తొలి సినిమా ‘కథ’ పెద్ద ఫ్లాప్. ఆ తర్వాత ‘హ్యాపీ డేస్’ తమిళ రీమేక్లో నటిస్తే అది కూడా సరిగా ఆడలేదు. అయినా అదిత్కు అవకాశాలేమీ ఆగిపోలేదు. తుంగభద్ర, 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘా, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.. ఇలా పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. ‘గరుడవేగ’ సహా కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లోనూ నటించాడు. కానీ ఏవీ అనుకున్నంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు.
త్వరలోనే ‘కొండా’ సినిమతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అదిత్.. కెరీర్లో ఈ దశలో తన పేరు మార్చుకోవడం గమనార్హం.అదిత్ అరుణ్ అన్న తన పేరును త్రిగుణ్గా మార్చుకున్నాడీ యంగ్ హీరో. మామూలుగా సినిమా వాళ్లు తమకు అదృష్టం కలిసి రాలేదనుకున్నపుడు న్యూమరాలజీ నిపుణుల్ని కలుస్తుంటారు. తమ పేర్లలో అదనపు అక్షరాలను చేర్చుకోవడం లాంటివి చేస్తుంటారు. పేర్లను కొద్దిగా మార్చుకుంటూ కూడా ఉంటారు. కానీ ఇలా ఏకంగా పేర్లే మార్చుకునేవాళ్లు మాత్రం అరుదు.
కెరీర్ ఆరంభంలోనే అసలు పేరును పక్కన పెట్టి ఆకర్షణీయమైన స్క్రీన్ నేమ్ పెట్టుకోవడం వేరే కథ. చిరంజీవి, మోహన్ బాబు, రంభ లాంటి వాళ్లు ఇలా పేర్లు మార్చుకున్న వాళ్లే. కానీ ఒక పేరుతో పాపులర్ అయి.. ఇప్పుడు అదిత్ అరుణ్లా పేర్లు మార్చుకున్న వాళ్లు మాత్రం పెద్దగా కనిపించరు. అయినా సరైన సినిమాలు ఎంచుకుని రాత మార్చుకోవాలి కానీ.. ఇలా పేరు మార్చుకుంటే ఏం లాభం అని అదిత్ అరుణ్పై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ‘కొండా’ సినిమా ట్రైలర్ రిలీజైన టైంలోనే అదిత్ ఇలా పేరు మార్చుకోవడంతో ఈ కౌంటర్లు మరింత ఎక్కువవుతున్నాయి.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…