అదిత్ అరుణ్.. టాలీవుడ్ యంగ్ హీరో. అందంగా ఉంటాడు. బాగా నటిస్తాడు. వాయిస్ కూడా బాగుంటుంది. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. జెనీలియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కథ’ సినిమాతో అతను తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా వచ్చింది 2009లో. అంటే అదిత్ నటుడిగా అరంగేట్రం చేసి పుష్కరం దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా సరైన హిట్ రాక హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు.
తొలి సినిమా ‘కథ’ పెద్ద ఫ్లాప్. ఆ తర్వాత ‘హ్యాపీ డేస్’ తమిళ రీమేక్లో నటిస్తే అది కూడా సరిగా ఆడలేదు. అయినా అదిత్కు అవకాశాలేమీ ఆగిపోలేదు. తుంగభద్ర, 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘా, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.. ఇలా పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. ‘గరుడవేగ’ సహా కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లోనూ నటించాడు. కానీ ఏవీ అనుకున్నంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు.
త్వరలోనే ‘కొండా’ సినిమతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అదిత్.. కెరీర్లో ఈ దశలో తన పేరు మార్చుకోవడం గమనార్హం.అదిత్ అరుణ్ అన్న తన పేరును త్రిగుణ్గా మార్చుకున్నాడీ యంగ్ హీరో. మామూలుగా సినిమా వాళ్లు తమకు అదృష్టం కలిసి రాలేదనుకున్నపుడు న్యూమరాలజీ నిపుణుల్ని కలుస్తుంటారు. తమ పేర్లలో అదనపు అక్షరాలను చేర్చుకోవడం లాంటివి చేస్తుంటారు. పేర్లను కొద్దిగా మార్చుకుంటూ కూడా ఉంటారు. కానీ ఇలా ఏకంగా పేర్లే మార్చుకునేవాళ్లు మాత్రం అరుదు.
కెరీర్ ఆరంభంలోనే అసలు పేరును పక్కన పెట్టి ఆకర్షణీయమైన స్క్రీన్ నేమ్ పెట్టుకోవడం వేరే కథ. చిరంజీవి, మోహన్ బాబు, రంభ లాంటి వాళ్లు ఇలా పేర్లు మార్చుకున్న వాళ్లే. కానీ ఒక పేరుతో పాపులర్ అయి.. ఇప్పుడు అదిత్ అరుణ్లా పేర్లు మార్చుకున్న వాళ్లు మాత్రం పెద్దగా కనిపించరు. అయినా సరైన సినిమాలు ఎంచుకుని రాత మార్చుకోవాలి కానీ.. ఇలా పేరు మార్చుకుంటే ఏం లాభం అని అదిత్ అరుణ్పై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ‘కొండా’ సినిమా ట్రైలర్ రిలీజైన టైంలోనే అదిత్ ఇలా పేరు మార్చుకోవడంతో ఈ కౌంటర్లు మరింత ఎక్కువవుతున్నాయి.
This post was last modified on January 26, 2022 2:52 pm
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…