కరోనా ప్రభావం పెరిగి థియేటర్లపై ఆంక్షలు మొదలయ్యాయంటే చాలు.. ఆ సినిమా ఓటీటీకి.. ఈ సినిమా ఓటీటీకి అంటూ వార్తలు మొదలైపోతాయి. ఈ ఊహాగానాల్లో కొన్ని నిజమవుతుంటాయి కూడా. కానీ కొన్ని వార్తలు మాత్రం అస్సలు నమ్మశక్యం కావు. సినిమా స్కేల్ పరంగా చూసినా.. వాటి విజువల్ ఎక్స్పీరియన్స్ కోణంలో చూసినా.. కచ్చితంగా థియేటర్లలోనూ చూడాల్సిన సినిమాలు సైతం ఓటీటీ బాట పడుతున్నట్లుగా వార్తలొస్తే నమ్మబుద్ధి కాదు.
ఇప్పుడు ‘రాధేశ్యామ్’ సినిమా విషయంలోనూ జరుగుతున్నది ఇదే. ఈ సినిమాను ఎంత వేగంగా పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తేవాలని చూసినా.. కరోనా, ఇతర కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది. కరోనా ఇబ్బంది పెడుతున్నా సరే.. సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని పట్టుబట్టారు కానీ.. కుదరక చివరికి వాయిదా వేయాల్సి వచ్చింది. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడితే అప్పుడు సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేద్దామని చూస్తున్నారు.
కానీ గతంలో మాదిరే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా ఓటీటీలోకి వెళ్లబోతోందంటూ ప్రచారం ఊపందుకుంది. నిన్నట్నుంచి ఈ ప్రచారం మరీ ఎక్కువైపోయింది. కొన్ని వెరిఫైడ్ హ్యాండిల్స్, డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అప్డేట్స్ ఇచ్చే ట్విట్టర్ అకౌంట్ల నుంచి రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ గురించి సంకేతాలు కనిపించాయి. ఒక భారీ చిత్రం ఓటీటీ బాట పడుతోందని.. చర్చలు జోరుగా జరుగుతున్నాయి.. ఇది రికార్డ్ డీల్ అంటూ అప్ డేట్స్ ఇచ్చారు. పేరు చెప్పకపోయినా.. ఆ సినిమా ‘రాధేశ్యామ్’యే అంటూ నెటిజన్లలో చర్చ మొదలైంది.
సినిమా మరీ ఆలస్యమవుతుండటంతో నిర్మాతల మీద భారం పెరిగిపోతోందని.. మార్చిలో అయినా సరే థియేట్రికల్ రిలీజ్కు అనుకూలమైన పరిస్థితులు ఉండవని, ఆ తర్వాత పోటీ తీవ్రంగా ఉందని, పైగా ఇదేమీ మాస్ మసాలా సినిమా కాకపోవడం, ట్రాజిక్ ఎండ్తో నడిచే లవ్ స్టోరీ కావడంతో థియేటర్లలో భారీ వసూళ్లు రావడం కష్టమే అని.. ఈ నేపథ్యంలో మంచి లాభానికి ఓటీటీ డీల్ కుదిరేలా ఉండటంతో నిర్మాతలు టెంప్ట్ అవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ ఊహాగానాలపై యువి క్రియేషన్స్ వాళ్ల నుంచి ఏ స్పందనా లేకపోవడం కూడా సందేహాలకు తావిస్తోంది.
This post was last modified on January 26, 2022 2:27 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…